• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »క్రైమ్

టాస్క్ ఫోర్స్ దాడుల్లో వ్యభిచారం ముఠా గుట్టు రట్టు

గుంటూరులో ప్రత్యేక పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. కొత్తపేట PS పరిధిలోని గెస్ట్ రూమ్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, నందివెలుగు రోడ్డులో అక్రమంగా సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న నంది మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 4 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.

October 31, 2025 / 05:59 AM IST

రెండు లారీలు ఢీ.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

ATP: గుత్తి పట్టణ శివారులోని తాడిపత్రి రోడ్డులో గురువారం రాత్రి రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం గుత్తి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు వాహనాల రాకపోకలకు అంతరాయం లేకుండా తగు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

October 31, 2025 / 05:55 AM IST

BREAKNG: ప్రమాదం.. ముగ్గురు మృతి, 12 మందికి గాయాలు

TG: హన్మకొండ జిల్లాలోని గోపాలపురంలో రోడ్డు వద్ద ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. సిద్దిపేటకు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

October 31, 2025 / 05:50 AM IST

BREAKING: పెళ్లికి వెళ్లి వస్తుండగా ముగ్గురు మృతి

TG: హన్మకొండ జిల్లాలోని గోపాలపురంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లికి వెళ్లి వస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా.. మరో 12 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని స్థానికులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. కాగా, సిద్దిపేటకు నల్లపూసల వేడుకకు వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.

October 31, 2025 / 05:50 AM IST

ఎవరెస్ట్ వద్ద కూలిన రెస్క్యూ హెలికాప్టర్

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం వద్ద ఘోర ప్రమాదం జరిగింది. నేపాల్ వైపున మంచులో చిక్కుకుపోయిన ట్రెక్కర్లను రక్షించే క్రమంలో ఆల్టిట్యూడ్ ఎయిర్ H125 హెలికాప్టర్ మంచు కారణంగా జారిపడి లోబుచే వద్ద కూలిపోయింది. ట్రెక్కర్ల రెస్క్యూ మిషన్ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. కాగా, ఈ ప్రమాదంలో జరిగిన ప్రాణ నష్టం గురించి పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.

October 30, 2025 / 09:41 PM IST

‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వృద్ధుడికి రూ. 51 లక్షల టోకరా

TG: HYDలోని శ్రీనగర్ కాలనీకి చెందిన 76 ఏళ్ల వృద్ధుడిని సైబర్ మోసగాళ్లు రూ.51 లక్షలు టోకరా వేశారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఆ బాధితుడిని, బాంబు పేలుళ్లు/కిడ్నాప్ కేసుల్లో సిమ్ వాడారని వాట్సాప్ కాల్ చేశారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో వీడియో కాల్‌లో 24 గంటలు నిర్బంధించి డబ్బు కాజేశారు. మనీలాండరింగ్‌లో భాగస్వామ్యం ఉందని బెదిరించి మోసం చేశారు.

October 30, 2025 / 09:36 PM IST

వృద్ధుడికి రూ.51 లక్షలు టోకరా!

TG: డిజిటల్ అరెస్టు పేరుతో HYDలోని ఓ వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. బాంబు పేలుళ్లు, కిడ్నాప్ కేసుల్లో మీ సిమ్ వాడారంటూ బాధితుడు (78)కి ముంబై క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ పేరుతో వాట్సాప్ కాల్ చేశారు. కేసు నుంచి తప్పించాలంటే ఖాతాలోని 95 శాతం నగదు పంపాలన్నారు. దీంతో బాధితుడు రూ.51 లక్షలు బదిలీ చేశారు. అనంతరం మోసపోయినట్లు గ్రహించి HYD సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

October 30, 2025 / 09:21 PM IST

వరదలో కొట్టుకుపోయిన దంపతులు.. మహిళ మృతి

RR: మొంథా తుఫాన్ కారణంగా ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు.. తుఫాన్ కారణంగా బాటసింగారం పెద్దవాగు ఉధృత రూపం దాల్చింది. ఈ నేపథ్యంలో అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన స్థానికులు భర్తను రక్షించగా మహిళ మృతి చెందింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 30, 2025 / 07:48 PM IST

అత్యాచారం కేసులో నిందితుడి అరెస్ట్

KMR: మహిళను అత్యాచారం చేసిన ఘటనలో నిందితుడిని పోలీసులు అరెస్ట్​ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్పీ రాజేష్​ చంద్ర గురువారం వెల్లడించారు. పాల్వంచ మండలం ఫరీద్​పేట గ్రామానికి చెందిన ఓ మహిళ ఈనెల 26న అత్యాచారానికి గురైన విషయం తెలిసిందే. అదే గ్రామ శివారులో ఉన్న రైస్​మిల్లులో పనిచేసే బీహార్ కార్మికుడు మహిళపై అత్యాచారానికి ఒడిగట్టాడని తెలిపారు.

October 30, 2025 / 06:46 PM IST

రేంజ్ అధికారిని పట్టుకున్న ఏసీబీ

BPT: రేపల్లె రేంజ్ అధికారి వివి.రమణ రావు గురువారం ఏసీబీకి దొరికారు. కాంట్రాక్టర్ వీర్లంకయ్య ఇచ్చిన ఫిర్యాదుతో ఈ అరెస్ట్ జరిగింది. రూ.5.90 లక్షల బిల్లుకు 25% లంచం డిమాండ్ చేశారని, అంటే సుమారు రూ.2లక్షలు అడిగారు. డబ్బులు చెల్లిస్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. గతంలో రూ.1.40 కోట్ల బిల్లులోనూ లంచం తీసుకున్నారని ఆరోపణలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.

October 30, 2025 / 06:19 PM IST

యూపీలో ప్రమాదం.. ఏపీ వాసులకు గాయాలు

AP: యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన 16 మంది గాయపడ్డారు. వారణాసి నుంచి అయోధ్య దర్శనానికి వెళ్తుండగా జౌన్‌పుర్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు.. బాధితులను ఫోన్‌లో పరామర్శించారు. బాధితులకు అండగా ఉండాలని అధికారులకు సూచించారు.

October 30, 2025 / 06:01 PM IST

20 మంది చిన్నారుల కిడ్నాప్ కేసు సుఖాంతం

ముంబైలో 20 మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన కేసు సుఖాంతమైంది. RA స్టూడియోపై పోలీసులు దాడి చేసి బందీలుగా ఉన్న 20 మంది పిల్లలను రక్షించారు. అనంతరం నిందితుడిని అరెస్ట్ చేశారు. ఆడిషన్స్ పేరుతో 100 మందిని పిలిచి వారిలో 20 మందిని నిందితుడు రోహిత్ కిడ్నాప్ చేసి.. నగదును డిమాండ్ చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారులను అతడి చెర నుంచి విడిపించారు.

October 30, 2025 / 04:48 PM IST

కరెంట్ స్తంభం గుంతలో పడి బాలుడి మృతి

MBNR: కరెంట్ స్తంభం గుంతలో పడి బాలుడు మృతిచెందిన విషాదకర ఘటన మిడ్జిల్ మండలంలో జరిగింది. బోయినపల్లికి చెందిన పిట్టల రామకృష్ణ, లక్ష్మమ్మ దంపతుల చిన్న కుమారుడు సిద్ధార్థ(3) ఇంటి ముందు విద్యుత్ స్తంభం కోసం తీసిన నీటి గుంతలో పడి మరణించాడు. ఆడుకుంటూ వెళ్లిన సిద్ధార్థ ప్రమాదవశాత్తు అందులో పడినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

October 30, 2025 / 04:39 PM IST

ఉరేసుకొని గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య

KMR: కామారెడ్డి మండలంలోని ఉగ్రవాయి నల్లకుంట మైసమ్మ ఆలయం వద్ద గురువారం గుర్తు తెలియని యువకుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు.

October 30, 2025 / 02:24 PM IST

ప్రైవేట్ బస్సులను తనిఖీ చేసిన అధికారులు

NZB: నిబంధనలను పాటించని ట్రావెల్స్, స్కూల్​​ బస్సులపై ఆర్టీఏ అధికారులు కొరడా ఝలిపిస్తున్నారు. కర్నూలులో బస్సు దగ్ధమైన ఘటనను దృష్టిలో ఉంచుకుని అధికారులు తనిఖీలు చేస్తున్నారు. దీంట్లో భాగంగా బోధన్ పట్టణంలో నేడు ఎంవీఐ శ్రీనివాస్ ఆధ్వర్యంలో దాడులు చేశారు. నిబంధనలు పాటించని ఓ స్కూల్ బస్సుపై కేసు నమోదు చేసినట్లు శ్రీనివాస్ పేర్కొన్నారు.

October 30, 2025 / 02:21 PM IST