మాముళ్ల కోసం ఎవరైనా వస్తే అండగా ఉండాల్సిన పోలీసులే మాముళ్లు వసూలు చేయడం ప్రారంభించారు. అది కూడా హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న బంజారాహిల్స్ పోలీసులు ఇలా చేయడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. భాధితుని ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పలువురిని అదుపులోకి తీసుకున్నారు.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసు బాలీవుడ్లో అలజడి రేపుతోంది. ఈ కేసులో ఇప్పటికే స్టార్ హీరో రణబీర్ కపూర్కు ఈడీ అధికారులు నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా స్టార్ కమెడియన్ కపిల్ శర్మతో పాటు మరికొందరికి ఈడీ సమన్లు జారీ చేసింది.
ముంబైలోని ఏడు అంతస్తుల భవనంలో శుక్రవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు మృతి చెందగా, మరో 40 మంది గాయపడ్డారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు.
ఓ వ్యక్తికి 690 ఏళ్ల పాటు జైలు శిక్ష పడనుంది. అతని వయసు 34 ఏళ్లు మాత్రమే. కానీ చేసిన నేరాలు మాత్రం చాలానే ఉన్నాయి. ఇంతకీ అతనేం చేశాడు? అన్ని సంవత్సరాల పాటు శిక్ష ఎందుకు పడనుందో తెలుసుకోండి.
ఈ మధ్యకాలంలో మహదేవ్ బెట్టింగ్ యాప్ గురించి ఎక్కువగా వార్తలు వినపడుతున్నాయి. దీనిలో భాగంగానే రీసెంట్ గా బాలీవుడ్ హీరో రణబీర్కు సమన్లు జారీ చేసినట్టుగా ఈడీ వర్గాలు తెలిపాయి. అక్టోబర్ 6వ తేదీన రణబీర్ కపూర్ ఈడీ ఎదుట విచారణకు హాజరుకావాలని ఆయనకు జారీ చేసిన సమన్లలో పేర్కొన్నారు.
సిక్కింలో ఇటివల సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే 14 మంది మృతి చెందగా..100కుపైగా తప్పిపోయినట్లు అధికారులు తెలిపారు. దీంతోపాటు సహాయక చర్యల కోసం హెల్ప్ లైన్ నంబర్, తాత్కాలిక సహాయ శిబిరాలను ఏర్పాటు చేశారు.
కుల్గాం జిల్లాలో కార్టన్ సెర్చ్లో భాగంగా ఇద్దరు ఉగ్రవాదులను భారత సైనికులు హతమార్చారు. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో రంగంలోకి దిగిన ఆర్మీపై కాల్పులు జరిపారు.