ఈఫిల్ టవర్కు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సందర్శకులను అనుమతించడం లేదు. బాంబు స్వ్కాడ్తో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు.
హవాయి దీవుల్లో కారుచిచ్చు రగులుకొంది. ఈ ఘటనలో ఇప్పటికే 67 మంది ప్రాణాలు వదిలారు. మంటలకు తోడు బలమైన గాలులు వీస్తుండడంతో పరిస్థితులు చేజారిపోతున్నట్లు అధికారులు వెల్లడించారు. 1946 తరువాత ఇదే అతి పెద్ద అగ్ని ప్రమాదం అని అధికారులు చెబుతున్నారు.
కాపాడాల్సిన పోలీసు అధికారే కామంతో ప్రవర్తించాడు. పుట్టినరోజని ఉందంటూ ఓ యువతిని ఇంటికి పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేశాడు. ఆపై వీడియోలు కూడా తీసి ఎవరికైనా చెబితే చంపుతానని బెదిరించాడు. అయితే యువతి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
నారాయణ కాలేజీలో మరో ఇంటర్ విద్యార్థి సూసైడ్ చేసుకున్నాడు. గతంలో కూడా చాలా మంది చదువుల ఒత్తిడి భరించలేకనో, ర్యాంగింగ్ బారినపడి సూసైడ్ చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా హైదరాబాద్ మాదాపూర్ లోని కాలేజీలో బైపీసీ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
హైదరాబాద్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. తండ్రీకొడుకులు కలిసి ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
పంజాబ్లో పరువు హత్య కలకలం రేపింది. ఓ తండ్రి తన కూతుర్ని చంపి, ఆమె మృతదేహాన్ని బైక్కు కట్టి ఈడ్చుకెళ్లాడు. ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భారీ వరదలకు చైనాలో 29 మంది మృతిచెందారు. గత నెలలో కూడా వరదల వల్ల 33 మంది మరణించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చైనాలోని చాలా ప్రాంతాలు వరదల వల్ల ఉక్కిరిబిక్కిరవుతున్నాయి. ప్రజలు తీవ్ర నష్టాలతో తల్లడిల్లుతున్నారు. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
సినీ నటి జయప్రదకు ఆరు నెలల జైలు శిక్షను ఎగ్మోర్ కోర్టు విధించింది. కార్మికుల చట్టం ప్రకారం ఆమెకు ఈ శిక్ష పడింది. జైలు శిక్షతో పాటుగా రూ.5 వేల జరిమానానా కోర్టు విధించింది. ఆమెతో పాటు మరో ముగ్గురికి కూడా ఈ శిక్ష పడింది.
డేటింగ్ యాప్లో పరిచయం అయిన అమ్మాయిపై గ్యాంగ్ రేప్ జరిగిన సంఘటన హ్యర్యానా గురుగ్రామ్లో జరిగింది. పరిచయం అయిన వ్యక్తి హోటల్కు పిలిచి తినే పదార్థంలో మత్తు కలిపాడు. తన స్నేహితుడు ఇద్దరు కలిసి అమ్మాయిపై అత్యాచారం చేశారు.