భర్త తనకు ఇష్టమైన సీరియల్ చూడొద్దన్నాడని, ఛానెల్ మార్చమన్నాడని ఓ భార్య పుట్టింటికి అలిగి వెళ్లిపోయింది. భార్య వెళ్లిపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన భర్త ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
పాఠాలు చెప్పాల్సిన ఓ టీచర్ బుద్ది తప్పింది. విద్యార్థినిని బెదిరించి లోబరుచుకున్నాడు. ఆ విద్యార్థిని గర్భం ధరించి, డెలివరీ కావడంతో అసలు విషయం తెలిసింది.
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం.. అమెరికాలో 6 ఏళ్ల ముస్లిం చిన్నారి ప్రాణాలను బలిగొంది. ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగోలో 71 ఏళ్ల వృద్ధుడు ఈ షాకింగ్ ఘటనకు పాల్పడ్డాడు. 32 ఏళ్ల చిన్నారి తల్లిని కూడా కత్తులతో పొడిచి తీవ్రంగా గాయపరిచాడు.
రాజస్థాన్లోని మేవాత్ ప్రాంతం ఆన్లైన్ మోసగాళ్లకు పెద్ద కేంద్రంగా మారింది. దీగ్ జిల్లాలోని రెండు గ్రామాల్లో పోలీసులు జరిపిన దాడిలో ఏం బయటపడిందో తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఆన్లైన్ మోసగాళ్లు నగదు విత్డ్రా చేసుకునేందుకు ఇంట్లో ఏటీఎం మెషీన్లను అమర్చారు.
కోల్కతాలో 5నెలల శిశువు సేఫ్టీ పిన్ను మింగేయడంతో శ్వాసనాళంలో ఇరుక్కుంది. ఆ బాలుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా ఆపరేషన్ చేసి పిన్నీసును విజయవంతంగా బయటకు తీశారు. దీంతో పేరంట్స్ ఊపిరి పీల్చుకున్నారు.
కర్ణాటక రాజధాని బెంగళూరులోని యలహంక ప్రాంతంలోని ఓ ఇంటిపై ఆదాయపు పన్ను శాఖ దాడులు చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. గది బెడ్ కింద రూ.854 కోట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులు ఈ సైబర్ మోసానికి పాల్పడ్డారు.