తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు(Viveka murder case)లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ కేసు గురించి ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.
ఓ వ్యక్తి తన తోటి యువతి(minor girl)ని తన ఇంటికి ఆహ్వానించాడు. అంతటితో ఆగలేదు. ఓ శీతల పానీయంలో మత్తు మందు కలిపి ఇచ్చాడు. అంతే ఆమె మత్తులోకి జారుకున్న తర్వాత ఆమెపై అత్యాచారం చేశాడు. ఆ యువతి మేల్కొన్న తర్వాత తెలుసుకున్న యువతిని అతను ఎవరికీ చెప్పొద్దని చెదిరించాడు. దీంతో ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఆంధ్రప్రదేశ్లోని ఓ ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్టల్లో 23 ఏళ్ల విద్యార్థిని ఊరివేసుకుని ఆదివారం ఆత్మహత్యకు పాల్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు కాలేజీకి వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఓ మహిళ(women) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాద ఘటన ఏపీలోని శ్రీసత్యసాయి జిల్లాలో చోటుచేసుకుంది.
అనూరిజం వ్యాధితో యూట్యూబ్ ఫిట్నెస్ స్టార్ జోస్తెటిక్స్ మృతి
బస్టాప్లో ఎదురుచూస్తున్న ప్రయాణికులపైకి ఓ లారీ దూసుకెళ్లడంతో 48 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో మరికొంత మందికి తీవ్ర గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు.
మహారాష్ట్రలో బస్సు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 25 మంది సజీవ దహనం అయ్యారు. మిగిలిన వారికి తీవ్రంగా గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రిలో చేర్పించారు. అందులో పలువురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
కేంద్ర ప్రభుత్వం తనను పది సార్లు బ్లాక్ చేసిందని ట్విట్టర్ కోర్టులో పిటీషన్ వేసింది. ఈ కేసులో ట్విట్టర్కు రూ.50 లక్షల జరిమానాను కోర్టు విధించింది.
వైఎస్ వివేకా హత్య కేసులో నేడు సీబీఐ విచారణ ముగియాల్సి ఉంది. అయితే కోర్టు ఈ కేసు విచారణను జులై 14కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఇద్దరు వ్యక్తులు లారీ కంటైనర్లో సజీవ దహనం అయిన ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది. రెండు కంటైనర్లు ఢీకొనడం వల్ల ఈ దారుణ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు.
తెలంగాణలోని రాజన్న సిరిసిల్లా జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. ముగ్గురు చిన్నారులతో కలిసి ఓ మహిళ మిడ్ మానేరు జలాశయంలో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. ఆ క్రమంలో నలుగురు మృత్యువాత చెందారు. వారిలో తల్లి రజిత, పిల్లలు అయాన్(7), అసరజా(5), ఉస్మాన్(14 నెలలు)ను పోలీసులు గుర్తించారు. రజిత స్వస్థలం వేములవాడ మండలం రుద్రంగి. కొన్నేళ్ల క్రితం మహ్మద్ అలీని రజిత లవ్ మ్యారేజ్ చేసుకుంది.
కిడ్నీ ముఠా ఆగడాలు ఆగడం లేదు. పేదలను టార్గెట్ చేసి.. వారి అవసరాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఏలూరులో ఓ మహిళ వద్ద నుంచి కిడ్నీ తీసుకొని.. చెప్పిన మొత్తం ఇవ్వలేదు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది.
హైదరాబాద్ ఫతేనగర్లో అమ్మోనియా గ్యాస్ లీకయ్యింది. 15 మంది అస్వస్థతకు గురికాగా.. బీబీఆర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం చెందారు. కారు వేగంగా నడపడం వల్ల ట్రక్కును ఢీకొంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.
సముద్రంలోని టైటానిక్ షిప్ను చూసేందుకు వెళ్లిన టైటాన్ అనే సబ్మెర్సిబుల్ అంతర్గత విస్ఫోటనం చెందింది. తాజాగా టైటాన్ సబ్ మెర్సిబుల్ శకలాలను సముద్రం ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో చిక్కుకుని ఉన్న మానవ అవశేషాలను అధికారులు గుర్తించారు.