తనతో సహజీవనం చేసే యువకుడి ఫోన్లో 13 వేలకు పైగా నగ్న ఫోటోలు ఉండటాన్ని చూసి యువతి షాక్ అయ్యింది. అందులో తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఫోటోలు ఉండటాన్ని గమనించి వారికి తెలిపింది. అందరూ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
గనిలో ఎలివేటర్ కూలిపోవడం వల్ల 11 మంది చనిపోగా మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
ఓ యువకుడు తన తల్లి చేసిన వంట రుచిగా లేదని కోపంతో రగిలిపోయాడు. ఆవేశంలో తన తల్లిని క్రూరంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. తల్లిని హత్య చేసిన తర్వాత మనస్తాపంతో నిందితులు నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్ శివారు ప్రాంతంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. 10 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అవడంతో పోలీసులు క్లియర్ చేశారు.
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. ఆదివారం మరో విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడంతో ట్రిపుల్ ఐటీలో ఏదో జరుగుతోందని కలకలం రేగింది.
గ్రేటర్ నోయిడాలో రూ.5 కోట్ల విలువైన బంగారం చోరీకి గురైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఆభరణాల యజమాని ఢిల్లీ నుంచి నగలు తీసుకెళ్తుండగా ఆకలేయడంతో భోజనం కోసం ఓ దాబా దగ్గర ఆగాడు.
1997 తర్వాత సౌత్ కొరియాలో తొలి మరణశిక్షను కోర్టు విధించింది. అది కూడా 23 ఏళ్ల యువతికి ఆ మరణశిక్షను విధించడంతో ప్రపంచ వ్యాప్తంగా ఈ కేసు చర్చనీయాంశమైంది.
డ్రగ్స్ కొనుక్కోవడానికి డబ్బులు లేక తల్లిదండ్రులు తమ పిల్లలను అమ్మేశారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్న నలుగురిని అరెస్ట్ చేశారు.
తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నారాయణవనం మండలం పోలీస్ స్టేషన్ సమీపంలో స్కూల్ బస్సు ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
ఓ విద్యార్థిని ప్రేమిస్తున్నానని టీచర్ మోసం చేశాడు. ఇంటికి తీసుకెళ్లి తాళి కట్టాడు. పెళ్లి అయ్యింది కదా అని.. ఆపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో జరిగింది.
దేశ రాజధానిలో దారుణం చోటు చేసుకుంది. మంగళవారం ఢిల్లీలోని ఈశాన్య ప్రాంతంలో హృదయ విదారకమైన కేసు వెలుగులోకి వచ్చింది. కేవలం రూ.350 కోసం ఓ మైనర్ 17 ఏళ్ల బాలుడిని హత్య చేశాడు.
మీకు అపరిచిత వ్యక్తుల నుంచి కాల్స్ వస్తున్నాయా? అయితే జాగ్రత్త. ఎందుకంటే సైబర్ నేరగాళ్లు రోజుకో విధంగా పలువురికి కాల్ చేస్తూ దోచేస్తున్నారు. ఇటివల హైదరాబాద్ కు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ నుంచి ఏకంగా రూ.1.59 కోట్లు లాగేశారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.