ఈరోజు ఉదయం విశాఖ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న లారీ అదుపుతప్పి ముందు ఉన్న స్కూల్ పిల్లల ఆటోను ఢీ కొట్టింది. దీంతో అందులోని ఏడుగురు చిన్నారులకు గాయాలయ్యాయి.
ఓ ప్లాట్ విక్రయం అంశంలో నటి స్వాతి దీక్షిత్, ఆమె స్నేహితులు మధ్యవర్తులుగా ఉన్నారు. అయితే అది కాస్తా వివాదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో విభేదాలు రావడంతో ఆ ఇంటిని నటితోపాటు పలువురు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఏపీ ఫైబర్నెట్ కుంభకోణంలో నష్టపోయిన నిందితుల స్థిరాస్తుల అటాచ్మెంట్పై ముందుకు వెళ్లాలని విజయవాడ అవినీతి నిరోధక కోర్టు (ACB Court ) మంగళవారం ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (ap cid)ని ఆదేశించింది.
రోజురోజుకు పలువురు మానవ సంబంధాలను మరుస్తున్నారు. ఈజీ పద్ధతిలో జీవితంలో సెటిల్ కావాలని చూస్తున్నారు. ఆ క్రమంలోనే ఓ యువకుడు ఏకంగా ప్రభుత్వ ఉద్యోగం కోసం తండ్రిపైనే కాల్పులు జరిపించాడు. ఈ ఘటన జార్ఖండ్లో చోటుచేసుకుంది.
ఏపీ టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకు స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏపీ హైకోర్టు నిన్న రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ అంశంపై ఏపీ సీఐడీ సుప్రీంకోర్టులో సవాల్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్లోని కనకమామిడి వద్ద నిర్మాణంలో ఉన్న ఇండోర్ స్టేడియం కూప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు మరణించగా..మరో 10 మంది గాయపడ్డారు.
పోలీసు వాహనం ఆగి ఉన్న ట్రక్కును ఢీకొనడంతో ఆరుగురు మృతిచెందారు. ఈ విషాద ఘటన రాజస్థాన్లో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరొకరు గాయపడగా ప్రస్తుతం ఆస్పత్రికి చికిత్స అందిస్తున్నారు. ప్రధాని మోదీ సభకు బందోబస్తుగా పోలీసులు వెళ్తున్న సమయంలో ఈ ఘటన జరిగింది.
విశాఖపట్నంలోని హార్బర్లో నిన్న అర్థరాత్రి జరిగిన భారీ అగ్నిప్రమాదంలో సుమారు 40కిపైగా ఫిషింగ్ బోట్లు కాలిబూడిదయ్యాయి. అయితే ఈ అగ్ని ప్రమాదానికి కారణం ఓ యూట్యూబర్ అని తెలుస్తోంది. ఇది తెలుసుకున్న అధికారులు రంగంలోకి దిగి దర్యాప్తును ముమ్మరం చేస్తున్నారు.
ఓ కుటుంబంలోని అందరూ కలిసి ఒకేసారి పూజ వేడుకల కోసం బయటకు వెళ్లారు. ఆ క్రమంలోనే ఆ ఫ్యామిలీపై కక్ష్య పెంచుకున్న ఓ వ్యక్తి వారిపై కాల్పులు జరిపాడు. దీంతో వారిలో ఇద్దరు మరణించగా..మరో నలుగురు గాయపడ్డారు.
హౌతీ దుండగులు భారత్ వస్తున్న కార్గో షిప్ను హైజాక్ చేశారు. ఈ క్రమంలో అంతర్జాతీయ స్థాయిలో రవాణా మార్గానికి అడ్డంకులు సృష్టించారు. అయితే ఆ నౌకలో ఇజ్రాయెల్ సహా వివిధ దేశాలకు చెందిన 50 మంది నావికులు ఉన్నారని తెలిసింది.
విశాఖలోని ఫిషింగ్ హార్బర్లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్క పడవకు మంటలు చెలరేగి చివరికీ మంటలు పెద్ద ఎత్తున వ్యాపించి 40 బోట్లు కాలి బూడిదయ్యాయి.
అగ్రరాజ్యం అమెరికా(USA)లో మళ్లీ కాల్పుల మోత(Shooting) మోగింది. న్యూ హంప్షైర్(New Hampshire)లోని కాంకర్డ్ నగరంలో ఉన్న సైకియాట్రిక్ ఆసుపత్రిలోకి ఓ దుండగుడు ప్రవేశించి కాల్పులకు తెగబడ్డాడు.ఈ దాడిలో ఇద్దరు మృతి చెందగా పలువురికి బుల్లెట్ గాయాలు అయినట్లు సమాచారం.
ఉగ్రవాదులు, భద్రతా దళాలకు దాదాపు 20 గంటలపాటు కొనసాగిన కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. రెండు రోజుల పాటు సాగిన ఈ ఆపరేషన్లో భారత దళాలు దీటుగా ఎదుర్కొన్నాయని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటన దక్షిణ కాశ్మీర్(Jammu kashmir )లోని కుల్గామ్ జిల్లా(Kulgam district) సామ్నులో చోటుచేసుకుంది.