కాన్పు కోసం వచ్చిన మహిళకు ఆపరేషన్ చేసి.. కత్తెర కడుపులోనే మరచిపోయాడు సర్కార్ దవాఖాన వైద్యుడు. ఈ ఘటన ఏలూరు జిల్లాలో జరిగింది. కడుపు నొప్పి ఎంతకీ తగ్గకపోవడంతో తిరిగి ఆస్పత్రికి వచ్చింది ఆ బాధితురాలు. ఎక్స్ రే తీయగా కడుపులో కత్తెర స్పష్టంగా కనిపిస్తోంది.
అప్పటి వరకు ఇంటి ఆవరణలో ఆడుకుంటున్న చిన్నారి ఒక్కసారిగా కుప్పకూలింది. తల్లిదండ్రులు తేరుకునేలోపే క్షణంలో అంతా జరిగిపోయింది. నాటు తుపాకీ పేలడంతో విషాద ఘటన జరిగింది.
వరంగల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్పాట్లో ఐదుగురు చనిపోయారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. చనిపోయిన వారంతా తేనె అమ్ముకునేవారిగా పోలీసులు గుర్తించారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. నిత్యం రద్దీగా ఉండే ప్రదేశంలో భవనం కూలింది. ఈ ఘటనలో ఐదు మంది మరణించగా 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. భవనంపై కోతులు తిరగడమే ఇందుకు కారణం అని తెలుస్తోంది.
ఓ పాఠశాల (High School) కింద వేల కొద్ది బాంబులు లభ్యం కావడం కలకలం రేపింది.
ఉత్తరప్రదేశ్లోని షాజహాన్పూర్లో దారుణ ఘటన చోటు చేసుకుంది.
ఓ మహిళా క్రీడాకారిణి పట్ల మంత్రి పేషిలో పనిచేసే ఉద్యోగి అసభ్యంగా ప్రవర్తించాడు. మేసెజ్ చేసి, పర్సనల్ ఫోటోలు పంపాలని కోరాడు. మహిళ తరఫు బంధువు నిలదీయడంతో కాళ్ల బేరానికి వచ్చాడు. విషయం తెలుసుకున్న మంత్రి సదరు ఉద్యోగిపై చర్యలు తీసుకుంటామని హామీనిచ్చారు.
హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలకు 54 మంది దుర్మరణం చెందడంతో విషాదం నెలకొంది. భారీ వర్షాల వల్ల చార్ధామ్ యాత్రను రెండు రోజుల పాటు నిలిపివేశారు.
పెట్రోల్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించడంతో 25 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లో దారుణం చోటుచేసుకుంది. ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఎక్కువగా ఉన్నారని పిల్లల ముందే భార్యను కిరాతకంగా చంపాడు ఓ భర్త.
దొంగల నుంచి తల్లిహ్యండ్ బ్యాగ్ను కాపాడిన ఓ కొడుకుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. దొంగలు తల్లి వద్ద ఉన్న బ్యాగ్ లాక్కొవడానికి ప్రయత్నించగా.. కొడుకు ప్రతిఘటించడం వీడియోలో చూడవచ్చు.
చార్మినార్, హైదరాబాద్ ఎక్స్ ప్రెస్ రైళ్లలో దోపిడి దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి 1.20 గంటల నుంచి 1.50 గంటల సమయంలో దోపిడికి తెగబడ్డారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసు బృందాలు రంగంలోకి దిగాయి.
సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడ వేశారు. స్థానిక యువకులకు ఉద్యోగం కల్పించి, వారి చేత నిరుద్యోగులకు ఫోన్ చేయిస్తున్నారు. బ్యాంక్, ఈ-కామర్స్ సంస్థలలో జాబ్ అని చెప్పి మోసం చేస్తున్నారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడొద్దని, అందులో జాబ్ చేసే యువతకు పోలీసులు సూచిస్తున్నారు.
సినిమా అవకాశాలు ఇస్తానని అమ్మాయిలను మోసం చేయడం ఎన్నో ఏళ్లగా వింటూనే ఉన్నాము. అయినా సరే అమ్మాలు బలవుతూనే ఉన్నారు. తాజాగా మణికొండలో జరిగిన ఓ యువతి ఆత్యహత్యతో దానికి కారణమైన ఓ వ్యక్తి అసలు రంగు బయటపడింది.
హిమాచల్ ప్రదేశ్(Himachal Pradesh) రాష్ట్రంలో మళ్లీ ఆదివారం రాత్రి వానలు దంచికొట్టాయి. దీంతో పలు చోట్ల కొండచరియలు విరిగిపడటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో 16 మంది మృత్యువాత చెందగా, మరికొంత మంది గాయపడ్డారు.