మహారాష్ట్రలోని పూణే జిల్లాలోని పింప్రి చించ్వాడ్ ప్రాంతంలోని మెరిసే కొవ్వొత్తుల తయారీ యూనిట్లో శుక్రవారం ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మరణించగా..ఎనిమిది మంది గాయపడ్డారు.
ప్రభుత్వ ఆస్పత్రిలో 9 మంది నవజాత శిశువులు మరణించారు. గత 24 గంటల్లో 9 మంది చనిపోవడంతో ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ప్రస్తుతం ఆస్పత్రిలో మరికొంత మంది శిశువుల పరిస్థితి ప్రమాదంలో ఉంది. ఒక్కో మంచంపై ముగ్గురు శిశువులను ఉంచి వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్లు చెబుతున్నారు.
ఆర్థిక సమస్యలతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. వారణాసి యాత్రకు వెళ్లి అక్కడే సూసైడ్ చేసుకోవడం కలకలం రేపుతోంది. ఈ ఘటనపై వారణాసి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అమెరికాలో వరుస కాల్పులు కలకలం రేపుతున్నాయి. లాస్ వెగాస్లోని ఓ విశ్వవద్యాలయంలో కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
ములుగు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఏజెన్సీలో చిన్నపాటి వర్షం పడినా రోడ్లన్నీ అధ్వానంగా మారుతున్నాయి. దీంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పుష్ప చిత్రంలో అల్లు అర్జున్ పక్కన నటించిన నటుడు జగదీశ్(కేశవ)పై(jagadeesh) పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అతను ఎందుకు ఈ కేసులో బుక్కయ్యాడు. ఆ కేసు వివరాలేెంటీ అనే విషయాలను ఇప్పుడు చుద్దాం.
గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేన అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ మరణించారు. జైపూర్లో గల అతని నివాసంలో హత్య చేశారు.
గుర్తు తెలియని వ్యక్తులు జరిపిన కాల్పుల్లో రాష్ట్రీయ రాజ్పుత్ కర్ణిసేని అధ్యక్షుడు సుఖ్దేవ్ సింగ్ మరణించారు. జైపూర్లోని ఆయన నివాసంపై కాల్పులు జరిగాయి. సోఫాలో కూర్చున్న సుఖ్ దేవ్ సింగ్ పై ఇద్దరు దుండగులు తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు.
కర్ణాటకలో ఘోరం చోటు చేసుకుంది. బతుకుదెరువు కోసం బీహార్ నుంచి కర్ణాటకకు వలస వెళ్లిన కూలీలు చనిపోయారు. వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని విజయపురలోని రాజ్ గురు ఇండస్ట్రీస్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ లో సోమవారం రాత్రి గోదాంలో స్టోరేజీ యూనిట్ కుప్పకూలింది.
ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపుతప్పి చెట్టును ఢీకొనడంతో 14 మంది దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో 20 మందికి గాయాలు అయ్యాయి.
2022వ ఏడాదిలో దేశవ్యాప్తంగా ఎన్ని హత్యా కేసులు నమోదయ్యాయనే విషయంపై నేడు నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారంగా దేశ వ్యాప్తంగా సగటున ప్రతి గంటకూ మూడుకు పైగా మర్డర్లు జరుగుతున్నట్లు తేలింది. ఈ హత్యల్లో 70 శాతం మంది పురుషులే చనిపోతున్నట్లుగా క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వెల్లడించింది.
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో విషాదం చోటుచేసుకుంది. ఫిరోజాబాద్లోని జస్రానా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గుడిసెలో శనివారం అర్థరాత్రి మంటలు చెలరేగడంతో ఇద్దరు చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందారు.
సాంకేతిక లోపంతో శిక్షణ హెలికాప్టర్ తూప్రాన్ మున్సిపాలిటీ పరిధి శివార్లలో కూలిపోయింది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు తెల్లవారుజామున హైదరాబాద్ వస్తుంది. ఆ క్రమంలో అందులో ప్రయాణిస్తున్న వారందరూ ఎంచక్కా నిద్రపోతున్నారు. అంతే అదే క్రమంలో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు కిందకు దిగారు. కానీ ఓ వ్యక్తి మాత్రం అందులోనే ఉండగా..అతను మంటల్లోనే కాలిపోయాడు.
దక్షిణ ఫిలిప్పీన్స్లోని విశ్వవిద్యాలయ వ్యాయామశాలలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో నలుగురు మృత్యువాత చెందగా..40 మందికిపైగా గాయపడినట్లు అక్కడి మీడియా నివేదించింది.