ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. చనిపోయిన తల్లి మృతదేహాన్ని ఏడాది కాలంగా ఇంట్లోనే ఉంచిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది.
హన్మకొండలో దారుణం జరిగింది. ఓటు వేసి వస్తోన్న ఓ మహిళనకు కారు ఢీ కొంది. ప్రమాదంలో మహిళ అక్కడిక్కడే చనిపోయింది.
ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఈ ఐదు రాష్ట్రాల్లో నెల రోజుల పాటు ఎన్నికల కోడ్ అమలులో ఉంది. ఈ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో ఐదు రాష్ట్రాల్లో కలిపి రూ.1766 కోట్ల నగదు, బంగారం, మద్యం, వస్తువులను సీజ్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ వెల్లడించింది.
ఒడిశాలో శుక్రవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారు. కియోంఝర్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. 20 మందితో నిండిన వ్యాన్ రోడ్డుపై నిలబడి ఉన్న ట్రక్కును ఢీకొట్టిందని చెబుతున్నారు.
ఏపీలోని కాకినాడ తీరంలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 11 మంది మత్య్సకారులను కోస్టుగార్డు సిబ్బంది రక్షించారు. కొంచెంలో పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
టాయిలెట్ వస్తుందని, బస్సు ఆపమని కోరితే ఓ కండక్టర్ రాక్షసుడిలా వ్యవహరించాడు. కదిలే బస్సు నుంచి తోసివేశాడు. దీంతో ఆ ప్యాసెంజర్ కన్నుమూశాడు.
ఇరాక్లోని తూర్పు దియాలా ప్రావిన్స్లో గురువారం సాయంత్రం ఒక వాహనం, రెస్క్యూ టీమ్పై బాంబు దాడి జరిగింది. రోడ్డు పక్కన ఉన్న పలువురిపై దుండగులు బాంబులపై దాడి చేసి, కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 10 మంది మరణించగా..14 మంది గాయపడ్డారు.
ఆయుర్వేద మందు తాగి ఐదుగురు మృతి చెందిన ఘటన గుజరాత్ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు.
కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడం వల్ల ఏడుగురు కార్మికులు సజీవదహనం అయ్యారు. ఈ ఘటనలో 27 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విధుల్లో భాగంగా ఓ ఉద్యోగి గుండెపోటుతో మరణించారు. ఆ క్రమంలో గమనించిన తొటి సిబ్బంది సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.
జలపాతంలో 11 మంది అయ్యప్పస్వాములు గల్లంతయ్యారు. స్థానికుల సమాచారం మేరకు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది అయ్యప్ప స్వాములను కాపాడారు. 11 మందిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
గగన్ పహాడ్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. థర్మకోల్ ఫ్యాక్టరీలో మంటలు ఎగసి పడుతున్నాయి. మంటలను ఆర్పేందుకు అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగారు.
గ్యాస్ సిలిండర్ లీక్ కావడం వల్ల నలుగురు దుర్మరణం చెందారు. కొత్త గ్యాస్ సిలిండర్కు రెగ్యులేటర్ను సరిగా అమర్చలేదు. దీంతో గ్యాస్ లీక్ కావడంతో ప్రమాదం జరిగింది. ఆ ప్రమాదంలో కుటుంబంలోని నలుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.
తనతో సహజీవనం చేసే యువకుడి ఫోన్లో 13 వేలకు పైగా నగ్న ఫోటోలు ఉండటాన్ని చూసి యువతి షాక్ అయ్యింది. అందులో తమ కంపెనీలో పనిచేసే ఉద్యోగులు ఫోటోలు ఉండటాన్ని గమనించి వారికి తెలిపింది. అందరూ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
గనిలో ఎలివేటర్ కూలిపోవడం వల్ల 11 మంది చనిపోగా మరో 75 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ దారుణ ఘటన సౌత్ ఆఫ్రికాలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.