తన భార్య పుట్టింటికి వెళ్లి రావట్లేదని ప్రశాంత్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాంతో అసలు విషయం బయటపడింది. తన భార్య స్నేహకు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయ్యాయని.. తాజాగా మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని కాపురం చేస్తుంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
హైదరాబాద్ పోలీసులు మరో భారీ డ్రగ్ మాఫియా గుట్టు రట్టు చేశారు. కొత్త సంవత్సరం సందర్భంగా మహారాష్ట్ర నుంచి డ్రగ్స్ తెస్తున్న ముగ్గురు నేరగాళ్లను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేశారు.
ప్రజాభవన్ బారికేడ్లను ఢీ కొట్టిన కేసులో నింధుతుడైన బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సాహిల్ అలియాస్ రాహిల్ అమీర్ దుబాయ్కి పారిపోయినట్లు పంజాగుట్ట పోలీసులు గుర్తించారు. లుక్ అవుట్ నోటీసు జారీ చేశారు. హైదరాబాద్కు రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీపై బాంబు దాడి తీవ్ర కలకలం రేపింది. సీసీ కెమెరా ఆధారంగా ఇద్దరు అనుమానితులను పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు ఇజ్రాయెల్ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తమ దేశాన్ని గుర్తించేలా ఏది ఒంటిపై ప్రదర్శించొద్దని జాతీయ భద్రతా మండలి స్పందించింది.
అమెరికాలోని టెక్సాస్ హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు తెలుగువాళ్లు మృతి చెందారు. వీరంతా ఆంధ్రప్రదేశ్లోని అమలాపురం వాసులు. ప్రమాద వార్త తెలియడంతో స్థానికుల్లో విషాద ఛాయలు అలముకున్నాయి.
కసాయి సెంట్రల్ ప్రావిన్స్లో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు రోడ్లు, ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందినవాళ్లు కూడా మృతి చెందారు.
ప్రస్తుతం చాలామంది గుండెపోటుతో మరణిస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా అకస్మాత్తుగా గుండెపోటుతో మరణించడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఓ 13ఏళ్ల బాలుడు గుండెపోటుతో మరణించాడు.
ఆలయం వద్ద ప్రసాదం తిని ఒకరు మృతి చెందగా మరో 70 మంది పరిస్థితి విషమంగా ఉన్న ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. ప్రస్తుతం ఐసీయూలో మరికొందరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిని సజీవదహనం చేశాడు ఓ ట్రాన్స్జెండర్. తాను ట్రాన్స్జెండర్ అని తెలిసి వేరే అతనితో రిలేషన్లో ఉంది. అదే సమయంలో ట్రాన్స్జెండర్ కూడా యువతి ప్రేమించిన అతనిపై మనసుపడ్డాడు. విషయం తెలియడంతో దారుణం యువతిని చంపేశాడు.
దేశంలో రోజురోజుకు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. వాహనదారుల నిర్లక్ష్యం, ఓవర్ టేకింగ్ , మితిమీరిన వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం తదితర కారణాలతో రోడ్డు ప్రమాదాలు జరిగి అనేక మంది గాయాలపాలవుతున్నారు. తాజాగా శనివారం ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఆంధ్రప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రకాశం జిల్లాలో జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి.