ఐపీఎల్ మ్యాచ్పై ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్నట్లు పక్కా సమాచారంతో రంగంలో దిగిన పోలీసులకు ఓ వ్యక్తి దొరికాడు. అతని దగ్గర నగదు, మొబైల్ ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు.
ఇరాక్లో సోషల్ మీడియా స్టార్ను దారుణంగా హత్య చేశారు. బైక్ మీద వచ్చిన కొందరు ఆమెపై కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
మహదేవ్ బెట్టింగ్ యాప్ కేసులో బాలీవుడ్ నటుడు, ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ సాహిల్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు అతనిని ఛత్తీస్గఢ్లో అరెస్టు చేశారు.
సైబర్ కేటుగాళ్లు ఈమధ్య కొత్త మోసాలకు పాల్పడుతున్నారు. విదేశాల నుంచి కాల్ చేస్తున్నాం.. పార్ట్ టైం జాబ్ అని చెప్పి డబ్బులు దోచేస్తున్నారు. ఇలాంటి నంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయవద్దని సైబర్ భద్రత బలగాలు చెబుతున్నారు.
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ పేరుతో సైబర్ నేరగాడు ఓ యువతికి మస్కా కొట్టాడు. దక్షిణ కొరియాకు చెందిన జియోంగ్ జిసన్ సైబర్ నేరగాళ్ల చేతిలో లక్షలు పోగొట్టుకుంది.
కెన్యాలో భారీ వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అక్కడ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు సంభవించి ఇప్పటివరకు సుమారుగా 38 మంది ప్రాణాలు కోల్పోయారు.
బెంగళూరులోని కెంపేగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ (కిఐఏ) నుంచి ఓ ఆశ్చర్యకరమైన వార్త బయటకు వస్తోంది. ఇక్కడ కస్టమ్స్ అధికారులు పాములను బ్యాగులో పెట్టుకుని అక్రమ రవాణాకు యత్నిస్తున్న ఓ స్మగ్లర్ను అదుపులోకి తీసుకున్నారు.
హర్యానాలోని రోహ్తక్ జిల్లాలోని జైల్లో శక్ష అనుభవిస్తున్న ఖైదీని ఇద్దరు పురుష ఖైదీలతో చికిత్సకు తీసుకెళ్లారు. చికిత్స పూర్తయిన తర్వాత ఖైదీలను మళ్లీ వ్యాన్లో ఎక్కించగా ఆ ఇద్దరు ఖైదీలు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
ఒడిశాలో ఘోరప్రమాదం జరిగింది. సుమారు 50 మంది ప్రయాణిస్తున్న ఓ పడవ ఆకస్మాత్తుగా మహానదిలో బోల్తా పడింది. దీంతో నలుగురు మరణించారు. ఈ ఘటనలో ముగ్గురు పిల్లలతో పాటు మరో ఏడుగురు గల్లంతయ్యారు.
మణిపూర్లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద కాల్పులు జరిగాయి. దీంతో ఓటు వేయడానికి వచ్చిన జనాలు పోలీంగ్ బూతుల నుంచి పరుగులు తీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్గా మారింది.
సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన విజయ్వర్ధన్ను బెదిరించి డబ్బులు కాజేశాడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్న కుమారుడు కన్నారావుపై కేసు నమోదైంది. పోలీసులు దీనిపై దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్లోని మాదాపుర్లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థులను ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. ఏపీలోని రాజమండ్రికి చెందిన శ్యామ్బాబు, కాటూరి సూర్యకుమార్ల దగ్గర రూ.4.2 లక్షల విలువ చేసే ఎండీఎంఏ మత్తు పదార్థాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.