• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

జ్ఞాన సరస్వతి ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

SRPT: హుజూర్ నగర్ పట్టణంలోని స్థానిక టీచర్స్ కాలనీలోని శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయ ప్రాంగణంలో నూతన నిర్మాణ పనులకు శుక్రవారం ఘనంగా శంకుస్థాపన జరిగింది. అర్చకుల నివాస గదులు, నిత్య హోమాలు, అక్షరాభ్యాసాల కోసం నిర్మించనున్న ప్రత్యేక మండపానికి మున్సిపల్ ఛైర్మన్ శ్రీనివాస్ గౌడ్, వైస్ ఛైర్మన్ మల్లికార్జున రావు కలిసి భూమి పూజ నిర్వహించారు.

February 20, 2026 / 06:01 PM IST

ఖానాపూర్‌లో 10వ శతాబ్దపు విగ్రహాలు లభ్యం..!

NRML: ఖానాపూర్ మండలంలోని బీర్నంది – కొమ్ము తాండా మధ్య అటవీ ప్రాంతంలో క్రీ.శ.10వ శతాబ్దానికి చెందిన విగ్రహాలను గుర్తించినట్లు చరిత్ర పరిశోధకులు రాజ్ కుమార్ తెలిపారు. చాళుక్యుల శైలిలో ఉన్న ద్విభుజ గణపతి, రాతిపై మలచిన భక్తాంజనేయ స్వామి, అరుదైన నాగబంధం, అలంకరణ స్తంభం ఇక్కడ లభ్యమయ్యాయి. భీమన్న గుడి చారిత్రక సంపదగా, స్థానికులను ఆకట్టుకుంటోంది.

February 20, 2026 / 06:00 PM IST

‘ఉద్యమకారులను ఆదుకునేందుకు సబ్ కమిటీ’

NZB: ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణలో పాలన సాగిస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. తెలంగాణ ఉద్య మంలో జైలుకు వెళ్లిన ఉద్యమకారులను ఆదుకునేందుకు త్వరలో సబ్ కమిటీ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు. శుక్రవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. ఉద్యమ సమయంలో మృతి చెందిన వారికి 250 గజాల స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు.

February 20, 2026 / 06:00 PM IST

కన్నాయిగూడెంలో MRPS సమావేశం

MLG: మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఈరోజు కన్నాయిగూడెంలో సమావేశం జరిగింది. వాసంపెల్లి నరసింహారావు మాదిగ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమనికి రాష్ట్ర నాయకులు వావిలాల స్వామి మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాజకీయ పార్టీల్లో మాదిగలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. లేకపోతే భవిష్యత్తులో రాజకీయంగా ప్రతిఘటన చేస్తామని హెచ్చరించారు.

February 20, 2026 / 05:59 PM IST

కొమ్మాల జాతర ఏర్పాట్లపై ఎమ్మెల్యే సమీక్ష

WGL: గీసుగొండ మండలం కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఏర్పాట్లపై పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి శుక్రవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా జాతర ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన, ఫిబ్రవరి 23 నుంచి జాతర ప్రారంభం కావనున్న నేపథ్యంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.

February 20, 2026 / 05:58 PM IST

‘ఎల్లుండి గురుకులంలో విద్యార్థులకు ప్రవేశ పరీక్షలు’

SRD: సిర్గాపూర్ మండల కేంద్రంలోని ఎస్టీ బాలికల గురుకుల పాఠశాలలో ఈ నెల 22న విద్యార్థులకు గురుకుల ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రియాంక శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 5 నుంచి తొమ్మిదవ తరగతి వరకు గురుకులంలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఆదివారం ఉదయం 11 గంటలకు సకాలంలో పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని సూచించారు.

February 20, 2026 / 05:55 PM IST

బొడ్రాయి ప్రతిష్టలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

MBNR: దేవరకద్ర మండలం కోయిల్ సాగర్ గ్రామంలో ఇవాళ జరిగిన బొడ్రాయి ప్రతిష్ట పూజా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామ ప్రజలపై అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామాభివృద్ధికి తమ వంతు కృషి చేశామని పేర్కొన్నారు.

February 20, 2026 / 05:52 PM IST

కామారెడ్డికి ఫుడ్ కమిషన్ ఛైర్మన్.. స్వాగతం పలికిన కలెక్టర్

KMR: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ ఛైర్మన్ గోలిశ్రీనివాస్ రెడ్డి శుక్రవారం జిల్లా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆయనకు సాదరస్వాగతం పలికారు. కలెక్టరేట్‌కు విచ్చేసిన ఛైర్మన్‌కు కలెక్టర్ పూలమొక్కను అందించి, స్వాగతించారు. జిల్లాలో ఆహార భద్రత చట్టం అమలు, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం, అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై సమీక్ష నిర్వహించనున్నారు.

February 20, 2026 / 05:50 PM IST

ప్రమాదకరంగా ఉన్న కంపచెట్ల తొలగింపు

NLG: చిట్యాల 8వ వార్డులో కరెంటు వైర్లకు కంప చెట్లు తాకుతూ ప్రమాదకరంగా ఉండడంతో ఆ వార్డు కౌన్సిలర్ కుక్కల మోహన్ సొంత ఖర్చులతో ఇవాళ జేసీబీ సాయంతో తొలగింపజేశారు. వార్డులో ఉన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తానని, వార్డు ప్రజలకు హామీ ఇచ్చారు. కాలనీవాసులు మారగోని యాదగిరి, నరసింహ, పెద్దులు, లింగస్వామి అమరోజు మదన్‌లు కౌన్సిలర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 05:49 PM IST

‘దశాబ్దాల సొంతింటి కల నెరవేరింద’

NRPT: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు అనుగుణంగా అర్హులైన నిరుపేదలకు గృహాల పంపిణీ కొనసాగుతోంది. ఏనుముల తిరుపతి రెడ్డి సాకారంతో పెదిరిపహాడ్ గ్రామానికి చెందిన చాకలి మల్లేశ్‌కు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు. శుక్రవారం కుటుంబ సభ్యులు ఘనంగా గృహప్రవేశం నిర్వహించారు. దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరిందని మల్లేశ్ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది.

February 20, 2026 / 05:46 PM IST

ఏడో తరగతి విద్యార్థిని కన్నుమూత

GDWL: ఆడుతూ పాడుతూ పాఠశాలకు రావాల్సిన చిన్నారి.. అనారోగ్యంతో తిరిగిరాని లోకాలకు వేలింది. మల్దకల్ మండలం సద్దలోనిపల్లి గ్రామానికి చెందిన పేగుల గోపాల్ కుమార్తె చందు(13) శుక్రవారం కర్నూలు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. అమరవాయి జడ్పీహెచ్ఎస్ స్కూల్‌లో 7వ తరగతి చదువుతున్న ఈ విద్యార్థిని మరణవార్త తెలియగానే పాఠశాలలో విషాద ఛాయలు అలముకున్నాయి.

February 20, 2026 / 05:46 PM IST

రోడ్డు నిర్మాణానికి రూ.2.53 కోట్ల నిధులు మంజూరు

SDPT: హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామం నుంచి పూస వేర్లపల్లె వరకు తారు రోడ్డు నిర్మాణానికి 2.53 కోట్ల నిధులు మంజూరైనట్లు గ్రామ సర్పంచ్ బంక లక్ష్మీ చందు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం రోజున రోడ్డు పనులు ప్రారంభించారు. నిధులు మంజూరు చేసినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

February 20, 2026 / 05:45 PM IST

రైతు సంక్షేమానికి పెద్దపీట: MLA

JN: రైతు సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ముందుకు సాగుతున్నామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి తెలిపారు. స్టేషన్ ఘనపూర్లో సబ్సిడీపై అర్హులైన రైతులకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యవసాయ పనిముట్లను అందజేశారు. ప్రభుత్వ పథకాలను అర్హులైన రైతులు సద్వినియోగం చేసుకొని లబ్ధి పొందాలని, దేశానికి వెన్నెముక రైతు అని ఎమ్మెల్యే అన్నారు.

February 20, 2026 / 05:44 PM IST

‘ఇంటర్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ను అరికట్టాలి’

NZB: జిల్లాలో జరగబోయే ఇంటర్మీడియట్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ డిమాండ్ చేశారు. శుక్రవారం జిల్లా ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు పరీక్షా కేంద్రాలతో కుమ్మక్కై మాస్ కాపీయింగ్‌కు పాల్పడుతున్నాయని ఆయన ఆరోపించారు.

February 20, 2026 / 05:42 PM IST

హరీష్ రావును కలిసిన వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు

HNK: హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో మాజీ మంత్రి టీ. హరీష్ రావును శుక్రవారం వర్ధన్నపేట బీఆర్ఎస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా అధికారులు ప్రవర్తించిన తీరు గురించి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ మార్గం బిక్షపతి, తుమ్మల యాకయ్య, కుమారస్వామి, ఏకాంతం, పిట్టల రాజు, తదితరులు పాల్గొన్నారు.

February 20, 2026 / 05:42 PM IST