SDPT: అక్బర్పేట భూంపల్లి మండలం చౌదరిపల్లిలో లీడ్ బ్యాంకు సహకారంతో సైబర్ మోసాలు, ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్పై అవగాహన నిర్వహించారు. సర్పంచ్ నాగరాజ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో TGB చిట్టాపూర్ బ్యాంకు మేనేజర్ అభినయ్ రెడ్డి మాట్లాడుతూ.. PMSBY, PMJJBY లాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
BDK: మణుగూరు మండలం సమితి సింగారం కోడిపుంజుల వాగు వ్యవసాయ క్షేత్రంలో రైతుల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను గుర్తు తెలియని దుండగులు మంగళవారం రాత్రి అపహరించుకుపోయారు. బుధవారం ఉదయం రైతులు వ్యవసాయ క్షేత్రానికి వెళ్లగా ఈ ఘటనను చూసి షాక్ అయ్యారు. పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరారు.
NLG: నల్గొండ పట్టణం, పానగల్ పీఏసీఎస్ వద్ద సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు సయ్యద్ హాషాం మాట్లాడుతూ.. యూరియా యాప్ను రద్దు చేసి రైతుల ఇబ్బందులను తొలగించాలని డిమాండ్ చేశారు. సాగుకు అత్యవసరమైన సమయంలో యూరియా కొరతతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. నాయకులు, రైతులు పాల్గొన్నారు.
SRCL: ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాచర్ల గొల్లపల్లికి చెందిన పిట్ల శరణ్య రాచర్ల కళాశాలలో ఇంటర్ చదువుతోంది. పరీక్షా కేంద్రానికి ఉ.9:20కి ఆమె చేరుకోవడంతో ఉపాధ్యాయులు పరీక్ష కేంద్రానికి అనుమతించలేదు. దీంతో విద్యార్థిని రోదిస్తూ గేటు వద్ద ఉండిపోయింది. తన తమ్ముడిని స్కూలుకు పంపించి వచ్చేసరికి ఆలస్యమైందని శరణ్య ఆవేదన వ్యక్తం చేసింది.
SRPT: నడిగూడెం మండలం సిరిపురం రైతు వేదిక క్లస్టర్ పరిధిలోని వివిధ గ్రామాల రైతులందరూ, ఈనెల 28 లోపు ఫార్మర్ రిజిస్ట్రేషన్ తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని ఏఈవో రేణుక బుధవారం ఒక ప్రకటనలో సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ పథకాలు లబ్ధి పొందేందుకు ఈ నమోదు అవసరమని తెలిపారు. రైతులందరూ 28 లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని సూచించారు.
WNP: పోలీస్ కార్పస్ విడో ఫండ్ పోలీసు కుటుంబాలలో ఆర్థిక భరోసా కల్పిస్తూ, సంక్షేమానికి కొత్త వెలుగులు నింపుతుందని జిల్లా ఎస్పీ సునీత రెడ్డి తెలిపారు. బుధవారం వనపర్తి జిల్లా పోలీస్ కార్యాలయంలో కానిస్టేబుల్ శివకుమార్ భార్య సుజాతకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. ఎస్పీ మాట్లాడుతూ విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తుంది అన్నారు.
KMRL బిచ్కుంద పట్టణంలోని 11వ వార్డులో బుధవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు ఆదేశాల మేరకు చేపట్టిన ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భాగ్యలక్ష్మి పాల్గొని పనులను ప్రారంభించారు. Lనిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పలువురు వార్డు కౌన్సిలర్లు,కాంగ్రెస్ నాయకులు, లబ్ధిదారులు ఉన్నారు.
ADB: పంచాయతీరాజ్ చట్టంపై వార్డు సభ్యులు అవగాహన పెంచుకొని సమస్యలు పరిష్కరించాలని లక్షెట్టిపేట, జన్నారం మండలాల ఎంపీడీవోలు సరోజ, ఉమర్ షరీఫ్ సూచించారు. లక్షెట్టిపేట, జన్నారం మండల కేంద్రాల్లోని రైతు వేదికల్లో వార్డు సభ్యులకు నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమంలో పలు అంశాలను అధికారులు వార్డు సభ్యులకు వివరించారు. గ్రామాల అభివృద్ధికి ప్రణాళిక అతిముఖ్యమన్నారు.
NZB : ధర్పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు 318 మంది విద్యార్థులకు గాను ఐదుగురు గైర్హాజరైనట్లు ప్రిన్సిపల్ శ్రీనాథ్ తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయని, మొదటిరోజు విద్యార్థులెవరూ ఆలస్యంగా రాలేదని పేర్కొన్నారు.గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వివరించారు.
WNP: కేంద్ర జౌళి శాఖ ఆధ్వర్యంలో వనిత జ్యోతి మహిళా సంఘం (NGO) సహకారంతో శ్రీరంగాపురం మండలంలో చేతివృత్తుల వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అసిస్టెంట్ డైరెక్టర్ సువర్చల మాట్లాడుతూ..కళాకారుల గుర్తింపు కార్డుల ప్రాధాన్యతను, ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. ముద్రా పథకం ద్వారా రుణాలు అందిస్తామని బ్యాంక్ మేనేజర్ మల్లికార్జున్ భరోసా కల్పించారు.
MNCL: జన్నారం, లక్షెట్టిపేట, దండేపల్లి పట్టణాల్లో నిర్వహించిన ఇంటర్ పరీక్షకు 16మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జన్నారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 156 మంది విద్యార్థులకు గాను ఆరుగురు, లక్షెట్టిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 245 మంది విద్యార్థులు ఆరుగురు, దండేపల్లి జూనియర్ కళాశాలలో 185 మంది విద్యార్థులకు గాను నలుగురు విద్యార్థులు పరీక్షను రాయలేదు.
VKB: రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను పాటించాలని కరణ్ కోట్ పోలీసులు సూచించారు. బుధవారం మండల పరిధిలోని ప్రధాన కూడళ్లలో వాహనదారులకు రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, మద్యం సేవించి వాహనాలు నడపరాదని ఏఎస్సై రాములు అవగాహన కల్పించారు.
NRML: నిర్మల్ జిల్లాలో మంగళవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం తొలిరోజు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించామని డిఐఈఓ పరుశురాం తెలిపారు. జిల్లాలోని 23 పరీక్ష కేంద్రాలలో విద్యార్థులు ప్రశాంతంగా పరీక్ష రాసారని విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రేపటి ద్వితీయ సంవత్సరం పరీక్షకు సైతం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
ASF: ఆసిపాబాద్ ఆదివాసి మహిళ MLA కోవ లక్ష్మిపై క్యతన్ పల్లి సంఘటనలో A12 గా చూపిస్తూ అక్రమంగా కేసు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆదివాసి హక్కుల పోరాట సమితి నాయకులు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా ఆదివాసి మహిళ MLA పై కేసు బనాయించడం దారుణమన్నారు. తక్షణమే అక్రమ కేసును ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
MBNR: మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని శ్రీనివాస కాలనీ మున్సిపల్ పార్కును కమిషనర్ రామానుజులు రెడ్డి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్కులో పారిశుద్ధ్య చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజల నుంచి ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం పార్క్ను సందర్శించి మున్సిపల్ సిబ్బందికి తగు సూచనలు చేసినట్టు వివరించారు.