KMM: కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్ర బడ్జెట్ లో గీత కార్మికుల సంక్షేమానికి రూ. 5వేల కోట్లు కేటాయించాలని KGKS రాష్ట్ర అధ్యక్షులు ఎం. వి రమణ డిమాండ్ చేశారు. ఆదివారం ఖమ్మం జిల్లా సంఘం కార్యాలయంలో బొడపట్ల సుదర్శన్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్లో గీత కార్మికులకు ప్రతిసారి అన్యాయమే జరుగుతుందన్నారు.
MDK: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని, ప్రజలు వాటిని సధ్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. వెల్దుర్తి మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. రిజిస్టర్లు పరిశీలించి వైద్య సేవలపై ఆరా తీశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాలు చేయించుకునేలా గర్భీణులకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు.
BDK: భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో రేపు నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల ఐటీడీఏ యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటీడీఏ పీవో రాహుల్ ఆదివారం తెలిపారు. గిరిజన దర్బార్కు రేపు ఉదయం 10:30 గంటలకు ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. గిరిజనులు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందచేయాలని కోరారు.
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు లక్షెట్టిపేట పట్టణంలో పర్యటించనున్నారని కాంగ్రెస్ పార్టీ లక్షెట్టిపేట పట్టణ, మండల అధ్యక్షులు ఎండీ. ఆరిఫ్, పింగళి రమేష్ తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాల, కళాశాలలను సందర్శిస్తారన్నారు. ఆ కార్యక్రమాలలో ప్రజా ప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొనాలన్నారు.
NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి జి.ప.ఉ. పాఠశాలకు విద్యార్థుల సౌకర్యార్థం క్యూరియా గ్లోబల్ సంస్థ రూ.2.25 లక్షల విలువైన 11 టేబుళ్లు, 10 కుర్చీలు, 10 ర్యాక్లను ఆదివారం అందజేసింది. ఈ పాఠశాల పూర్వ విద్యార్థి, క్యూరియా సైంటిస్ట్ డా. ఆవుల రాఘవేందర్ చొరవతో సీఎస్ఆర్ నిధుల ద్వారా ఈ సహాయం అందింది. కంపెనీ బృందానికి, రాఘవేందర్కు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు.
WNP: వనపర్తి నియోజకవర్గం కన్మనూరు గ్రామానికి చెందిన మీనిగ బాలయ్య నెల రోజుల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై కాలు విరిగిపోయింది.ఆదివారం కన్మనూరు గ్రామానికి వెళ్లిన వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న బాలయ్యను పరామర్శించి ఆరోగ్య విషయాలు తెలుసుకున్నారు. ఇబ్బంది ఏమీ లేదని తనకు భరోసాగా నేనుంటానని ఎమ్మెల్యే బాధితుడికి ధైర్యం చెప్పారు.
NZB: ఆర్మూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ హైయర్ సెకండరీ స్కూల్ (బాలుర)లో 1975 -76లో పదో తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 50 సంవత్సరాల తర్వాత ఆత్మీయ సమ్మేళనంలో కలిశారు. పట్టణంలో గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. 50 ఏళ్ల తర్వాత పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట కలిసి పాత రోజుల్లో జరిగిన విద్యాభ్యాసం గురించి చర్చించుకున్నారు.
NRKL: ఉప్పునుంతల మండల కేంద్రంలో ఆదివారం బీరప్ప స్వామి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగాయి. డప్పు వాయిద్యాల మధ్య మహిళలు సంప్రదాయ దుస్తుల్లో బోనాలతో ఊరేగి స్వామివారికి మొక్కులు చెల్లించారు. ప్రధాన రహదారులన్నీ భక్తులతో కిటకిటలాడగా, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉత్సవాలను విజయవంతం చేసారు.
MHBD: గార్ల మండలం పూమ్యతండాలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. తండాకు చెందిన గూగులోత్ రవి (32) భార్యతో గొడవపడి, మనస్తాపంతో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురికి దర్యాప్తు చేపట్టారు.
PDPL: జూలపల్లి మండలం తేలుకుంట గ్రామంలోని శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయం, శివాలయంలో ఎమ్మెల్యే విజయ రమణారావు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయంలో కళ్యాణ మహోత్సవం, శివాలయంలో కలశ ప్రతిష్టాపన మహోత్సవం సందర్భంగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ సర్పంచ్ సంపత్, పార్టీ నాయకులు ఎమ్మెల్యేను సత్కరించారు.
కరీంనగర్ నగర పాలక సంస్థ పరిధిలోని 20వ డివిజన్లోని రాజారెడ్డి కాలనీలో నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఏన్నికైంది. కాలనీ అభివృద్ధి, శుభ్రత, మౌలిక వసతుల మెరుగుదల, సామాజిక ఐక్యతను లక్ష్యంగా చేసుకొని కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా మోహన్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా భాస్కర్, కార్యదర్శిగా విద్యాకర్, కోశాధికారిగా సంతోశ్ ఎన్నికయ్యారు.
SRPT: కోదాడ పట్టణానికి చెందిన చిత్రపు అన్నపూర్ణమ్మ (105) వందేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆమె కుటుంబ సభ్యులు ‘శతాధికా సంబరాలు’ నిర్వహించారు. నేటికీ ఆమె సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారు. అన్నపూర్ణమ్మ తన జీవితకాలంలో ఐదు తరాలను మనుమలు, మునిమనుమలు చూసి ఆశీర్వదించారు. ఆదివారం కోదాడ పట్టణంలో కుటుంబ సభ్యులు ఆమెను ఘనంగా సన్మానించారు.
BHNG: ఆత్మకూరు మండలం రాయిపల్లి గ్రామంలో ఆదివారం శ్రీ ఆర్కే హాస్పిటల్, చావా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. గ్రామ ప్రజలకు ఉచితంగా జనరల్బి ఫిజీషియన్ డాక్టర్, ఆర్థోపెడిక్ డాక్టర్ డాక్టర్ రాజ్ కుమార్ చే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, న్యూరోపతి, బిఎండి పరీక్షలు నిర్వహించి, వారికి అవసరమైన మందులు ఉచితంగా అందజేశారు.
MLG: గోదావరి నది జలాల వినియోగం, వివాదాలపై ప్రతిపక్షాలతో అసెంబ్లీలోనే చర్చించుకుందామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇవాళ నిర్వహించిన సమీక్ష సమావేశంలో CM మాట్లాడారు. చర్చలు జరగకుండా ఏ సమస్య శాశ్వతంగా పరిష్కారం కాదని CM పేర్కొన్నారు. తెలంగాణలో ప్రతి ఎకరాకు సాగునీరు, ప్రతి పౌరుడికి త్రాగునీరు అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
JGL: పెన్షనర్ల పెండింగ్ సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి హరి అశోక్ కుమార్ డిమాండ్ చేశారు. జగిత్యాల జిల్లాలో ఆదివారం జరిగిన టీపీసీఏ జిల్లా స్థాయి సమావేశంలో పెన్షనర్ల సర్వీస్ రూల్స్ పుస్తకాలను సభ్యులకు అందజేశారు. ఈ సమావేశంలో టీపీసీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి హన్మంత్ రెడ్డి పాల్గొన్నారు.