• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

భూదాన్ భూములపై హైకోర్టు స్టే

KMM: వెలుగుమట్ల భూదాన్ భూములపై యథాస్థితి స్టేటస్ కో కొనసాగించాలని ఖమ్మం కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్లకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అసలైన లబ్దిదారులను గుర్తించాలని, నష్టపోయిన బాధితులందరికీ భూదాన్ భూముల్లో ఇళ్ల స్థలం, ఇళ్లు మంజూరు చేయాలని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు ఇళ్ల కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఇళ్లు ఇవ్వాలని ఆదేశించింది.

March 19, 2026 / 10:24 AM IST

పోచమ్మ ఆలయంలో దాడి ఘటనలో కేసు నమోదు

ఆసిఫాబాద్ మండలం కసాబ్వాడి పోచమ్మ ఆలయాన్ని శుభ్రం చేస్తున్న తక్కల్ల జయశ్రీపై మరో మహిళ (జయశ్రీ) దాడికి పాల్పడింది. అసభ్య పదజాలంతో దూషించి, చీపురుతో కొట్టడమే కాకుండా అక్కడే ఉన్న పవన్, శిరీషలను కులం పేరుతో అవమానపరిచినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు సీఐ బాలాజీ వరప్రసాద్ తెలిపారు.

March 19, 2026 / 10:16 AM IST

విద్యార్థులకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ అప్లికేషన్ కోర్స్

MDCL: ప్రస్తుత తరుణంలో కంప్యూటర్ పరిజ్ఞానం అత్యవసరమైన వేల కంప్యూటర్ అప్లికేషన్ కోర్సు దూరవిద్య, ఆన్‌లైన్ వేదికగా నేర్చుకోవడానికి AICTE అనుమతులు అందించిందని ఉప్పల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ విజయకుమార్ తెలిపారు. ప్రస్తుత యూత్, ఇంటర్మీడియట్ స్థాయి నుంచి కంప్యూటర్ అప్లికేషన్‌పై పట్టు సాధించడం ఎంతో లాభాలు చేకూరుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.

March 19, 2026 / 10:16 AM IST

జిల్లాలోని బియ్యాన్ని FCIకి తరలించాలి: కలెక్టర్

VKB: మిల్లర్ల దగ్గర ఉన్న బియ్యాన్ని వేగంగా FCIకి తరలించాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారీ మిల్లర్లకు సూచించారు. వికారాబాద్ కలెక్టరేట్‌లో రబీ సీజన్‌కు సంబంధించి వరి ధాన్యం సేకరణకు సంబంధిత అధికారులతో కార్యాచరణ ప్రణాళికపై రైస్ మిల్లర్లు, సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో 129 వరి ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు.

March 19, 2026 / 10:15 AM IST

పండుగలకు ప్రతీక ఉమ్మడి WGL జిల్లా

ఉమ్మడి WGL జిల్లా సాంప్రదాయానికి పేరుపొందిన ప్రాంతం, నేడు ఉగాది పర్వదినం కావడంతో ప్రజలు సాంప్రదాయబద్ధంగా పండుగను జరుపుకుంటున్నారు. ఉదయాన్నే ఇల్లు శుద్ధి చేసుకుని షెడ్ రుచులతో పచ్చడి తయారుచేసి తాగుతారు. జిల్లాలోని ప్రసిద్ధ ఆలయంలో సాయంత్రం అర్చకులు సంవత్సరం కాల పంచాంగం వివరిస్తారు. ఆచారాలు జిల్లా సంస్కృతిని మరింత శోభాయమానం చేస్తున్నాయి.

March 19, 2026 / 10:15 AM IST

ఉమ్మడి జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. మూడు రోజులుగా కురుస్తున్న వడగళ్ల వర్షాలకు ఉష్ణోగ్రతలో వ్యత్యాసం ఏర్పడింది. గడిచిన 24 గంటల్లో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. మోస్రా 33.9°C, ఎడపల్లి 33.1, నిజామాబాద్(సౌత్), పెర్కిట్ 32.9, కోటగిరి, మంచిప్ప 32.8, మేనూరు(మద్నూర్) 32.7, మదన్ పల్లి, గోపన్ పల్లి, NZB (నార్త్) 32.6, ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

March 19, 2026 / 10:13 AM IST

ఘనంగా శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ప్రారంభం

PDPL: అంతర్గాం మండల కేంద్రంలో బర్మా- కాందీశీకుల ఇలవేల్పు శ్రీ నూకాంబిక అమ్మవారి జాతర ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా అమ్మవారి దీక్షపరులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకోవడంలో భాగంగా నాలుకపై శూలాలు గుచ్చుకున్నారు. అనంతరం భారీ ఊరేగింపుగా వెళ్లి నూకాంబిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అగ్నిగుండ ప్రవేశం జరిగింది.

March 19, 2026 / 10:12 AM IST

మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌‌కు వరుసగా సెలవులు

JGL: మెట్‌పల్లి వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా సెలవులు ప్రకటించారు. ఉగాది సందర్భంగా ఈరోజు 19 తేదీతో పాటు మార్చి 20న కూడా మార్కెట్ యార్డ్‌కు సెలవులు ప్రకటించారు. అదేవిధంగా మార్చి 21 రంజాన్, 22 ఆదివారం కావడంతో పసుపు కొనుగోళ్లు మార్చి 23 నుంచి యథావిధిగా ప్రారంభమవుతాయని మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రైతులు, కొనుగోలుదారులు గమనించాలని సూచించారు.

March 19, 2026 / 10:11 AM IST

రాష్ట్రంలోనే ప్రత్యేకం.. మోత్కూరు ఉగాది.!

BHNG: తెలుగువారి కొత్త సంవత్సరం ఉగాది పండుగ అంటే పచ్చడి, పంచాంగ శ్రవణం గుర్తొస్తాయి. కానీ, ఉమ్మడి జిల్లాలోని మోత్కూరులో మాత్రం ఉగాది అంటే ‘బోనాల పండుగ’. తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టేలా ఇక్కడ నిర్వహించే వినూత్న వేడుకలు రాష్ట్రంలోనే ఎక్కడా లేని ప్రత్యేకతను చాటుకుంటాయి. ఉగాదికి కొన్ని రోజుల ముందే పట్టణంలో దండోరా వేయడంతో పండుగ హడావుడి మొదలవుతుంది.

March 19, 2026 / 10:10 AM IST

గురుకుల ఇంటర్.. ఏప్రిల్ 15 వరకు దరఖాస్తులకు ఆహ్వానం

MDCL: ఇంటర్ గురుకులం, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఇంటర్మీడియట్ చేయడం కోసం ప్రథమ సంవత్సర ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం ప్రారంభమైనట్లు ఉప్పల్ అధికారి రాములు తెలిపారు. టెన్త్ పూర్తి చేసిన వారు, టెన్త్ పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు ఏప్రిల్ 15 లోగా దరఖాస్తు చేసుకోవాలని, మే 3వ తేదీన ప్రవేశ పరీక్ష ఉంటుందని వివరించారు.

March 19, 2026 / 10:08 AM IST

‘మహిళల ఆర్థికాభివృద్ధే లక్ష్యం’

ADB: గ్రామీణ మహిళలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా నార్నూర్ మండలం తడిహత్నూర్ గ్రామంలో దాల్, మిల్లెట్ ఫ్లోర్ మిల్ యూనిట్‌ను కలెక్టర్ రాజర్షి షా ప్రారంభించారు. సంపూర్ణ అభియాన్ 2.0లో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళల ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇటువంటి యూనిట్ల వల్ల స్థానికంగా ఉపాధి పెరిగి మహిళలు ఆర్థికంగా బలోపేతం అవుతారని కలెక్టర్ ఆకాంక్షించారు.

March 19, 2026 / 10:06 AM IST

ముస్లింలకు ఈద్గా తోఫా పంపిణీ

KNR: సైదాపూర్ మండలంలోని గొల్లగూడెం గ్రామంలో గురువారం ముస్లింలకు ఈద్గా తోఫా కానుకలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మిట్టపల్లి కిష్టయ్య, సర్పంచ్ బత్తుల మౌనిక పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కిష్టయ్య మాట్లాడుతూ.. ముస్లింల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

March 19, 2026 / 10:05 AM IST

రేపు చెర్వుగట్టులో వేలంపాట

NLG: చెర్వుగట్టులో శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో 2026-27 సంవత్సరానికి గాను వివిధ విభాగాల్లో హెచ్-1, ఎల్-1 వేలం నిర్వహించనున్నట్లు EO ఎస్.మోహన్ బాబు తెలిపారు. ఈ నెల 20న తలనీలాలు సేకరించుకునే హక్కు, కిరాణా సామాగ్రి విక్రయం, షాపుల కిరాయి, కూరగాయలు, వాటర్ మోటార్ల రిపేరు, బ్రహ్మోత్సవాల అలంకరణ పనుల హక్కుల కోసం వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

March 19, 2026 / 10:02 AM IST

’19వ వార్డులో మంచినీటి సమస్యను పరిష్కరించండి’

వనపర్తి జిల్లా లోని 19వ వార్డులో గత వారం రోజులుగా మంచినీటి సమస్య నెలకొందని వెంటనే పరిష్కారం చూపాలని కౌన్సిలర్ మురళి సాగర్ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లుకు విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది ఉగాది, రంజాన్ పండుగలు ఏకకాలంలో రావడం వల్ల మంచినీటి వాడకం అధికంగా ఉంటుందని దానిని దృష్టిలో ఉంచుకుని లీకేజీలు, నిరంతరం మంచినీటి పంపిణీని చేపట్టాలని వినతిపత్రం అందజేశారు.

March 19, 2026 / 10:01 AM IST

ఉగాది వేళ మన్యంకొండకు భక్తుల రద్దీ

MBNR: నూతన తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని మన్యంకొండ దేవస్థానంకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే స్వామివారి దర్శనం కోసం భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలైన్లలో నిలబడి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయాయి. అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

March 19, 2026 / 10:00 AM IST