జగిత్యాల జిల్లాలో సాగునీటి సమస్యల పరిష్కారానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి సాగునీటి సమస్యలకు కృషి చేస్తానని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. గిరిజన సంక్షేమ మంత్రిగా జిల్లాలో అన్ని గిరిజన గ్రామాలు, తండాలకు రవాణా సౌకర్యం కోసం నిధుల మంజూరుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తానని తెలిపారు.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తున్నారని స్వచ్ఛంద పౌర సేవా సంస్థ అధ్యక్ష కార్యదర్శులు మల్లయ్య, మధుసూదన్ రావు అన్నారు. బుధవారం మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. విచ్చలవిడిగా పర్మిట్ రూములు ఏర్పాటు చేశారని, బెల్ట్ షాపుల్లో నిరంతరం మద్యం అమ్మకాలు చేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ASF: సిర్పూర్ టౌన్లోని బెంగాలీ క్యాంపులో NREGS కింద మంజూరైన సైడ్ డ్రైన్, సిమెంట్ రోడ్డు నిర్మాణానికి MLA డా. పాల్వాయి హరీష్ బాబు బుధవారం శంకుస్థాపన చేశారు. MLA మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ పథకమైన జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో సీసీ రోడ్లు, సైడ్ డ్రైన్లు నిర్మిస్తున్నామని తెలిపారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.
SRD: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై ప్రజాప్రతినిధులకు అవగాహన కార్యక్రమాన్ని కంది పరిధిలోని కన్వెన్షన్లో ఈనెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. మున్సిపల్ ఛైర్మన్లు, వైస్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు, గ్రామపంచాయతీ సర్పంచులు అవగాహన సమావేశంలో పాల్గొనాలన్నారు.
SRCL: భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే రసాయన ఎరువులు వాడాలని తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ హరికృష్ణ సూచించారు. హన్మాజీపేట రైతు వేదికలో ఆత్మ (ATMA) ఆధ్వర్యంలో గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. భూమి ఆరోగ్యాన్ని కాపాడుకుంటూనే ఆయిల్ పామ్, ప్రకృతి వ్యవసాయం, కూరగాయల సాగుతో అధిక లాభాలు గడించవచ్చని హరికృష్ణ అన్నారు. AO వినీత రెడ్డి పాల్గొన్నారు.
PDPL: ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాలన కొనసాగుతుందని రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ తెలిపారు. ఇవాళ ఆయన పెద్దపల్లి ప్రజాప్రతినిధుల అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రజలకు ఉపయోగపడే రోడ్లు, డ్రైనేజీలు, పారిశుద్ధ్య నిర్వహణ, చెట్ల పెంపకం మొదలగు పనులు చేపట్టాలని సూచించారు.
NLG: తిరుమలగిరి సాగర్ తహసీల్దార్ అనిల్కు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ షాక్ ఇచ్చింది. ఒక భూ వివాదంలో పక్షపాతంగా వ్యవహరించారంటూ బాధితుడు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించగా, దీనిపై నివేదిక ఇవ్వాలని గతంలోనే తహసీల్దార్ను ఆదేశించింది. అయితే కమిషన్ ఆదేశాలను బేఖాతరు చేస్తూ నివేదిక సమర్పించకపోవడంతో ఆగ్రహించిన TGHRC, ఎమ్మార్వోకు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.
GDWL: ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ విద్యాసంస్థల్లో అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత నాణ్యమైన విద్య అందుతుంది అని గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా అన్నారు. బుధవారం కలెక్టర్ ఛాంబర్లో గద్వాల ప్రభుత్వ ఎంఏఎల్డీ డిగ్రీ కళాశాల నూతన ప్రవేశాల అవగాహన కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న వివిధ కోర్సులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
MBNR: జిల్లా కేంద్రంలోని మోడల్ బేసిక్ ప్రభుత్వ పాఠశాలలో జిల్లా స్థాయి ప్రహరీ క్లబ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఈవో ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కలిసి పనిచేయాలని అన్నారు. అనంతరం ఎక్సైజ్ శాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ నరసింహారెడ్డి డ్రగ్స్పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, అధ్యాపకులు పాల్గొన్నారు.
MDK: రామాయంపేట మండలం రాయలాపూర్ గ్రామంలో గల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం ‘స్వయం పరిపాలన దినోత్సవం’ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా 5వ తరగతి విద్యార్థులు J. భానుప్రకాష్ (DEO), S. నరేష్ (MEO), కుమారస్వామి (కాంప్లెక్స్ HM), T. రాకేష్ (హెడ్ మాస్టర్)గా బాధ్యతలు స్వీకరించి అలరించారు. మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తోటి విద్యార్థులకు పాఠాలు బోధించారు.
SDPT: మట్టి పరీక్షలు ఆధారంగా పంటలకు సరిపడా ఎరువులు వేసుకోవచ్చని సిద్దిపేట ఏడీఏ పద్మ పేర్కొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలోభాగంగా చిన్నకోడూరు మండలం అల్లీపూర్లో బుధవారం వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతుల వ్యవసాయ క్షేత్రంలో మట్టి పరీక్ష నమూనాలు సేకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతులు ఎరువులు, పురుగుల మందులు అధికంగా వాడటం వల్ల భూమి నిస్సారమవుతుందన్నారు.
ADB: దేశాభివృద్ధి, భవిష్యత్ ప్రణాళికల రూపకల్పనకు పకడ్బందీగా జరిగే జనగణనే దిక్సూచిగా ఉంటుందని ITDA PO యువరాజ్ మర్మాటే అన్నారు. ఆదిలాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన భారత జనగణన–2027 శిక్షణ కార్యక్రమాన్ని అదనపు కలెక్టర్ రాజేశ్వర్తో కలిసి ప్రారంభించారు. క్షేత్రస్థాయిలో సేకరించే సమాచారం భవిష్యత్తు సంక్షేమ పథకాలకు ఆధారమవుతుందని పేర్కొన్నారు.
HNK: ప్రభుత్వ యూనివర్సిటీలను కాపాడాలని, ప్రైవేటు యూనివర్సిటీలను వ్యతిరేకించాలని ఎస్ఎఫ్ఐ హనుమకొండ జిల్లా కార్యదర్శి మంద శ్రీకాంత్ అన్నారు. ఈనెల 17,18వ తేదీలో పాలమూరు యూనివర్సిటీలో జరగబోయే యూనివర్సిటీల కన్వెన్షన్కు సంబంధించిన పోస్టర్లను నేడు కేయూలో నేతలతో కలిసి శ్రీకాంత్ ఆవిష్కరించారు.