MDK: 99 రోజుల ప్రగతి ప్రణాళిక పకడ్బందీగా అమలు చేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమసింగ్ పేర్కొన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండలాల అధికారులతో ప్రణాళికపై సూచనలు చేశారు. చేగుంట మండలంలో జరిగిన కార్యక్రమంలో తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాధికారి, నీటి సరఫరా విభాగం, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు హాజరయ్యారు.
MBNR: కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీటీసీ మనోహర్ రెడ్డి ఓ కేసులో అరెస్ట్ అయ్యారు. ఆయన జిల్లా జైలులో ఉండగా గురువారం దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ములాఖాత్లో కలిసి పరామర్శించి ధైర్యం చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్ఎస్ నాయకులపై కక్షపూరిత కేసులు పెడుతోందని ఆరోపించారు.
GDWL: శ్రీ జోగుళాంబ బాల బ్రహ్మేశ్వర ఆలయాలను శుక్రవారం సాయంత్రం జగద్గురు శంకరాచార్య శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి విజయ యాత్రలో భాగంగా సందర్శించనున్నట్లు ఈవో దీప్తి తెలిపారు. రెండు రోజుల పర్యటనలో బాల బ్రహ్మేశ్వర స్వామికి అభిషేకం, అమ్మవారికి శ్రీచక్ర అర్చన నిర్వహించి అనంతరం అనుగ్రహ భాషణం, తీర్థప్రసాద వితరణ ఉంటుందని పేర్కొన్నారు.
MDK: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 99 రోజుల ‘ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక’పై ఈనెల 6న మెదక్ ఐడీఓసీలో ఉమ్మడి జిల్లా స్థాయి సమావేశం జరగనుంది. ఈ భేటీకి ఇంఛార్జ్ మంత్రి వివేక్, మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరుకానున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, ఉమ్మడి జిల్లా కలెక్టర్లు, అధికారులతో కలిసి ప్రణాళిక అమలుపై దిశానిర్దేశం చేయనున్నారు.
KMR: రామారెడ్డి పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న కృష్ణమూర్తి గుండెపోటుతో మరణించారు. గురువారం ఉదయం ఎప్పటిలాగే స్టేషన్లో విధులకు హాజరైన కృష్ణమూర్తికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి కుప్పకూలిపోయారు. వెంటనే పోలీస్ సిబ్బంది ఆయణ్ను ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు, ఆయన అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
NRML: బీడీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సీఐటీయూ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఏవోకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మెన సురేష్ మాట్లాడుతూ, పీఎఫ్ ఉన్న అర్హత గల బీడీ కార్మికులందరికీ పెన్షన్ మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
సిద్దిపేట జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగు అత్యంత లాభదాయకమని జిల్లా కలెక్టర్ కె. హైమావతి పేర్కొన్నారు. గురువారం దుబ్బాక మండలం దుంపలపల్లిలో మెగా ప్లాంటేషన్ డ్రైవ్లో భాగంగా 12 ఎకరాల్లో సాగును ఆమె ప్రారంభించారు. ఒకే రకమైన పంటలు కాకుండా పంట మార్పిడి చేపట్టాలని రైతులకు సూచించారు.
PDPL: ఈనెల 6 నుంచి 15 వరకు గ్రామ, పట్టణ ప్రాంతాలలో ప్రత్యేక పారిశుద్ధ్య డ్రైవ్ చేపట్టాలని కలెక్టర్ శ్రీహర్ష తెలిపారు. గురువారం కలెక్టరేట్లో 99 రోజుల కార్యాచరణ పై డీసీపీ రామ్ రెడ్డి తో కలిసి జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలన్నారు. రోడ్లపై చెత్త లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
KNR: కరీంనగర్ నగునూరు వైద్యకళాశాలలో ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్న నూకల శ్రీనివాస్ రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ ఆర్థోపెడిక్ అసోసియేషన్ నిర్వహించిన IOACON- 2025 సదస్సులో కన్సల్టెంట్ విభాగంలో బెస్ట్ పేపర్ అవార్డును ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా ప్రతిమ యాజమాన్యం, ఆసుపత్రి వైద్యులు శ్రీనివాస్ రెడ్డిని సత్కరించారు.
KMM: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని వైరా ఎస్సై పవన్ హెచ్చరించారు. ఆయన ఆదేశాల మేరకు గురువారం బ్లూ కోల్ట్ పోలీసులు పట్టణంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుళ్లు నాగేశ్వరరావు, కృష్ణమూర్తి ఆధ్వర్యంలో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహించడంతో పాటు పెండింగ్లో ఉన్న జరిమానాలను వసూలు చేశారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని వారు సూచించారు.
SRD: న్యాల్కల్ మండలం మిర్జాపూర్ (బి) గ్రామంలో ఆర్టీసీ బస్సులు ఆపడం లేదంటూ పలు గ్రామాల ప్రజలు, విద్యార్థులు కలిసి గురువారం ధర్నా చేపట్టారు. తమ గ్రామం మీదుగా జహీరాబాద్ డిపోకు చెందిన బస్సులు తమ గ్రామం మీదుగా రాయికోడ్ చౌరస్తా, రాయిపల్లి, ఖేడ్, వట్పల్లి తదితర గ్రామాలకు బస్సులు వెళుతుంటాయని తెలిపారు. దాదాపు అరగంటకు పైగా బస్సులను ఆపివేశారు.
భద్రాద్రి జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఈవీఎం గోడౌన్ను జిల్లా కలెక్టర్ అంకిత్ ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈవీఎంలు, వీవీప్యాట్ యంత్రాలు భద్రపరిచిన గదులను పరిశీలించి సీసీ కెమెరాల పనితీరును తనిఖీ చేశారు.
WGL: సంగెం మండల కేంద్రంలో ఆస్తి తగాదాల కారణంగా దొంగిలించిన పందుల కేసును ఛేదించారు. గురువారం ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి, రూ. లక్షల విలువైన 25 పందులను స్వాధీనం చేసుకున్నట్లు పర్వతగిరి సీఐ రాజగోపాల్ తెలిపారు. రాయపురం రాజు తన బాబాయి కొమురయ్యపై పగతో, బంధువులతో కలిసి ఈ దొంగతనానికి పాల్పడ్డాడు. నిందితులను రిమాండ్కు తరలించామని తెలిపారు.
MHBD: రాజ్యసభ సభ్యునిగా వేం నరేందర్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. ఈ కార్యక్రమానికి గురువారం మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్యా మురళీనాయక్ హాజరై శుభాకాంక్షలు తెలిపారు. వీరి వెంట డీసీసీ అధ్యక్షురాలు డాక్టర్ ఉమా మురళీనాయక్, మహబూబాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ జ్యోతి రమేష్ ఈ కార్యక్రమంలో పాల్గొని నరేందర్ రెడ్డిని అభినందించారు.
JGL: మెట్పల్లి మండలం వెల్లుల్ల గ్రామంలో నిర్మాణ దశలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ గురువారం పరిశీలించారు. ఇళ్ల నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించి, లబ్ధిదారులతో మాట్లాడారు. ఇటుకలు, ఇసుక, సిమెంట్ ధరలు, నాణ్యత వివరాలను తెలుసుకుని, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం పనులు చేయాలని సూచించారు.