RR: ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని అన్ని పరీక్ష కేంద్రాల్లో ఇంటర్ పరీక్షలు ప్రశాంత వాతావరణంలో సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా షాద్నగర్, మొయినాబాద్, మహేశ్వరం డివిజన్లకు చెందిన డీసీపీ పరీక్ష కేంద్రాలను సందర్శించి భద్రత ఏర్పాట్లను సమీక్షించారు. అన్ని కేంద్రాల్లో పరిస్థితి ప్రశాంతంగా ఉందని అధికారులు తెలిపారు.
MDK: నార్సింగి మండలం శంకాపూర్ తండాలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు నిరుపేద వధువుకు పుస్తె మట్టెలను సర్పంచ్ మహేందర్ సింగ్ ఆధ్వర్యంలో అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజల సంతోషమే తన సంతోషమని తండాలో ఉన్న ఆడబిడ్డలు తమ తో బుట్టువులని, వారికి సేవచేయడంలో ఉన్న ఆనందం మరోకటి లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ నరేష్ పాల్గొన్నారు.
MDCL: అల్వాల్ సర్కిల్ ఇందిరా గాంధీ విగ్రహం చౌరస్తా సమీపంలోని హనుమాన్ దేవాలయం ఎదురుగా, లైబ్రరీ పక్కన చెత్త వేస్తున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం స్థానిక ప్రజలు చెత్తలో కూర్చొని నిరసన తెలిపారు. మున్సిపల్ అధికారులు చెత్త ఉన్న స్థలాన్ని సందర్శించి తగు చర్యలు తీసుకోవాలని స్థానిక కాలనీవాసులు డిమాండ్ చేశారు.
RR: తిరుమల పవిత్ర లడ్డు కల్తీ చేశారని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నర్సింలు అన్నారు. ఇవాళ షాద్నగర్లో ఆయన మాట్లాడుతూ.. ఈ మహా పాపం మాజీ సీఎం వైఎస్ జగన్కు ఊరికే వదిలిపెట్టదని, తప్పకుండా శిక్ష అనుభవించక తప్పదన్నారు. దాదాపు 20 కోట్ల కల్తీ లడ్డూలను భక్తులకు పంపిణీ చేసి హిందువుల విశ్వాసాలతో ఆడుకున్నారన్నారు.
NZB: దర్పల్లి మండలంలోని అన్ని గ్రామాల ఊసర్పంచ్, వార్డు సభ్యులకు రెండవ విడత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి. ఈ సందర్బంగా ఎంపీడీవో కాయలయ్య సమావేశపు గదిలో అధికారులు పంచాయతీల్లో జరిగే కార్యక్రమాలకు చట్టాలపై అవగాహణ కల్పించారు. ఈ కార్యక్రమంలో అన్నిగ్రామాల ఊసర్పంచులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
JN: నర్మెట్ట మండలం హనుమంతపురం వద్ద బొమ్మకూరు ఎడమ ప్రధాన కాలువ పనులను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరిశీలించారు. కాలువలో ఉన్న పూడిక, చెట్ల తొలగింపు పనులను వారం రోజులలో పూర్తి చేసి మంగలి బండ తండా వరకు సాగు నీరు అందించాలని అధికారులను ఎమ్మెల్యే కడియం ఆదేశించారు.
BHPL: తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేగొండ మండలం మహిళా విభాగం అధ్యక్షురాలుగా సాదు అనితను నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు రవిపటేల్ తెలిపారు. మండలంలో పార్టీ బలోపేతమే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తూ ప్రజలకు అనునిత్యం అందుబాటులో ఉండాలని నూతన అధ్యక్షురాలికి జిల్లా అధ్యక్షులు సూచనలు చేశారు. కార్యక్రమంలో మండల నేతలు పాల్గొన్నారు.
KNR: జిల్లాలో విధులకు హాజరుకాకుండా దీర్ఘకాలిక సెలవుల్లో ఉన్న వైద్యులను తొలగిస్తూ డీఎంఈ నరేంద్ర కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన 12 మంది ఉన్నారు. NTPC డా.మంజుల,నిఖిల్, ప్రదీప్, వినయ్, అనుష, స్వాతి, సాయికిరణ్, స్ఫూర్తిరావు, KNR డా. సింధు, హిమజ, SRCL డా.పర్వీన్ ఫాతిమా, రవికుమార్లు ఏడాదికి పైగా విధులకు రానందుకు తొలగించారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవంలో భాగంగా బుధవారం బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి ఆలయం మర్యాదలతో స్వాగతం తెలిపి, దర్శనం అనంతరం వేద ఆశీర్వచనం, తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు, పాల్గొన్నారు
MHBD: మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో అర్హులైన లబ్ధిదారులకు స్థానిక ఎమ్మెల్యే మురళినాయక్ కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలన్నారు.
SRCL: ప్రముఖ యాంకర్ సుమ కనకాల బుధవారం వేములవాడ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు. ఆమె శ్రీ భీమేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్ర సంప్రదాయం ప్రకారం సుమ కోడె మొక్కును సమర్పించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆమెకు తీర్థ ప్రసాదాలు అందజేసి, వేద మంత్రాలతో ఆశీర్వచనం గావించారు.
HNK: పరకాల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో MPDOగా విధులు నిర్వర్తిస్తున్న రవీందర్ డిప్యూటీ సీఈవో పదోన్నతి పొందారు. ఈ మేరకు నేడు ఆయనను కార్యాలయ సిబ్బంది కలిసి ఘనంగా సన్మానించారు. తెలంగాణ ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి గోవింద్ నవీన్ కుమార్, కార్యాలయ పర్యవేక్షకులు శైలశ్రీ ఉన్నారు.
BDK: పినపాక ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జర్నలిస్ట్ కప్ 2026 క్రికెట్ టోర్నమెంట్ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బుధవారం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రారంభించి క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. క్రీడలు యువతలో క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని అన్నారు.
BHPL: రేగొండ మండలం కొడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మార్చి 7వ తేదీ వరకు జరగనున్నట్లు ఆలయ ఛైర్మన్ NSR ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 8 గంటలకు ప్రత్యేక అభిషేకంతో వేడుకలు ప్రారంభం కానున్నట్లు ఛైర్మన్ పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు.
HYD: నగరంలో వాతావరణం మారిపోయింది. బుధవారం ఉదయం భానుడు ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నానికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరానికి వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఉష్ణోగ్రత 29°Cగా నమోదైనట్లు తెలిపింది. సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.