NLG: దేవరకొండ మండలం తాటికోల్ గ్రామానికి చెందిన సామల ఎర్రయ్య (56) కల్లు గీస్తూ జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే బుధవారం కల్లు గీసేందుకు తాటిచెట్టు ఎక్కుతుండగా కాలు జారి పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే దేవరకొండ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.
SRPT: గ్రామ సమగ్ర అభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకమని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయంలో నూతన సర్పంచుల శిక్షణలో ఆయన పాల్గొన్నారు. పంచాయతీరాజ్ చట్టం, ప్రభుత్వ పథకాలపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. సాంకేతికతను అందిపుచ్చుకుని గ్రామాలను ఆదర్శంగా తీర్చిదిద్ది, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని అన్నారు.
MDK: జిల్లాలో సమ్మర్ యాక్షన్ ప్లాన్ పనుల కారణంగా ఈనెల 5, 6న పలు ప్రాంతాలకు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు ఈఈ నాగభూషణం తెలిపారు. మెదక్ నియోజకవర్గంలోని 275 గ్రామాలు,మెదక్, రామాయంపేట మున్సిపాలిటీలతో పాటు అల్లాదుర్గ్, టేక్మాల్ మండలాల్లోని 80 ఆవాసాలకు నీటి సరఫరా ఉండదన్నారు. ముందస్తు సమాచారాన్ని సర్పంచ్లకు చేరవేశామని, ప్రజలు పొదుపుగా వాడుకోవాలి అన్నారు.
MNCL: లక్షెట్టిపేట పట్టణ శివారులోని గోదావరి నది తీరంలో జరిగే పుష్కరాల కోసం ప్రతిష్టమైన ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని స్థానిక MRO దిలీప్ తెలిపారు. కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ విజయ్ కుమార్, సీఐ రమణమూర్తి, ఎస్సై గోపతి సురేష్ లతో కలిసి గోదావరి తీర ప్రాంతాన్ని సందర్శించారు. పుష్కరాలకు వేలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిపారు.
SRD: నిరుద్యోగ అభ్యర్థుల కోసం మహేంద్ర పరిశ్రమ మెగా రిక్రూట్మెంట్ కార్యక్రమం చేపట్టడం అభినందనీయమని కలెక్టర్ ప్రావీణ్య అన్నారు. సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రిక్రూట్మెంట్ బ్రోచర్లను బుధవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్యర్థులు ఉద్యోగ అవకాశాల కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో పరిశ్రమ ప్రతినిధులు పాల్గొన్నారు.
KNR: ఇల్లందకుంట పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు పారిశ్రామిక సంస్థల సందర్శనలో భాగంగా జమ్మికుంటలోని కాటన్ జిన్నింగ్ మిల్లులు, రైస్ మిల్లులు, ప్రకాశం కృషి విజ్ఞాన కేంద్రం, అగ్నిమాపక కేంద్రాన్ని సందర్శించారు. కాటన్ మిల్లులో ఉత్పత్తి విధానాలు, KVKలో సేంద్రియ ఎరువుల తయారీ, పంటల వైవిధ్యం గురించి తెలుసుకున్నారు.
కామారెడ్డి ఎంప్లాయిమెంట్ ఆఫీస్ దోమకొండ పోర్టు ఆధ్వర్యంలో ఈనెల 7న దోమకొండలో మెగా జాబ్ మేళా నిర్వహించబడుతోంది. 30కి పైగా ప్రముఖ కంపెనీలు ప్రత్యక్ష ఇంటర్వ్యూలతో పాల్గొంటున్నాయి. కావున నిరుద్యోగ యువతీ యువకులు పెద్ద ఎత్తున హాజరై ఉద్యోగమేలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
MBNR: డా. బీ.ఆర్.ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ గెజిటెడ్ అధ్యాపక సంఘం డైరీ, క్యాలెండర్ను ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జీ. సుకన్య బుధవారం ఆవిష్కరించారు. అధ్యాపకులు నిరంతరం కళాశాల అభివృద్ధికి కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యులు రాఘవేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు డా.నర్సింహులు, తదితరులు పాల్గొన్నారు.
ADB: శ్రీరామనవమి పురస్కరించుకుని భద్రాచలం వెళ్లలేని భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక సదుపాయం కల్పించిందని ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ ప్రతిమా రెడ్డి తెలిపారు. ఆర్టీసీ లాజిస్టిక్స్, దేవాదాయ శాఖ సహకారంతో సీతారాముల కళ్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటి వద్దకే చేరవేసే కార్యక్రమం చేపట్టామన్నారు. భక్తులు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చన్నారు.
NZB: కమ్మర్పల్లి మండలంలోని పలువురు లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు. హస కొత్తూరు 3, చౌటుపల్లి 2, బషీరాబాద్ 2, కొనసముందర్ 2, కోనాపూర్ 2 చెక్కులను ఆయా గ్రామ సర్పంచుల ఆధ్వర్యంలో ఎమ్మార్వో జీ . ప్రసాద్, ఆస్ఐ శరత్ అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు నలిమెల రేవతి గంగాధర్, మహబూబ్, బైకని జమున మహేశ్, కార్యదర్శులు పాల్గొన్నారు.
RR: రేపు రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడు విక్రమాదిత్య పెళ్లి సందర్భంగా ఈరోజు హైదరాబాద్ సీపీ సజ్జనార్, అధికారులతో కలిసి మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జ్ కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పనులను పరిశీలించారు. వీఐపీలు, సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
WNP: ఎయిడ్స్ పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అధికారులు మహానంది, ప్రతాపరెడ్డి అన్నారు. బుధవారం పట్టణంలోని ఉర్దూ మీడియం పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి పోస్టర్ను విడుదల చేశారు. ఎయిడ్స్ నియంత్రణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నిర్వహించిన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
RR: ప్రపంచ శాంతి కోసం కర్ణాటక నుంచి బౌద్ధ బైక్షువులు చేపట్టిన 450 కిలోమీటర్ల పాదయాత్ర ఎల్బీనగర్కు చేరుకుంది. ఈ సందర్భంగా మదర్ థెరిస్సా చారిటబుల్ సొసైటీ అధ్యక్షులు శంకర్ వారిపై పూల వర్షం కురిపించి ఘన స్వాగతం పలికారు. అనంతరం వారు మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడి శాంతి మార్గంలో ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కులాలకు మతాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని తెలిపారు.
SDPT: కొండపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని(PHC) కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అటెండెన్స్, ఓపీ రిజిస్టర్లను పరిశీలించి, రోగులకు అందుతున్న సేవలపై ఆరా తీశారు. మెడికల్ ఆఫీసర్ నుంచి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లోని సబ్ సెంటర్ల పనితీరుపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు.
MDK: రామాయంపేట పురపాలక సంఘం నూతన కమిషనర్గా బీ.శ్రావణ్ బుధవారం పదవీ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్-1 అధికారిగా ఎంపికైన ఆయనకు మున్సిపల్ కమిషనర్గా ఇది మొదటి పోస్టింగ్ కావడం విశేషం. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, పురపాలక సంఘం ద్వారా ప్రజలకు అందాల్సిన సేవలను ఎటువంటి జాప్యం లేకుండా సకాలంలో అందజేస్తాన్నన్నారు