SRCL: చందుర్తి మండల కేంద్రంలో సోమవారం రాత్రి కామ దహనం ప్రజలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం హోలీ పండుగకు ఒక రోజు ముందు రాత్రి కాముని దహనం చేయడం ఆనవాయితీగా వస్తుంది పిడకలతో కట్టెలను పేర్చి కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాముని చుట్టూ ప్రదక్షిణలు చేసి ప్రత్యేక పూజలు చేసి శాస్త్రవేత్తంగా కామదాహనం నిర్వహించారు.
MLG: ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే 10వ తరగతి వార్షిక పరీక్షల సన్నాహాల పై MLG జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మహేందర్ జీ సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్ష కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్రశ్నాపత్రాలు, సమాధాన పత్రాల రవాణా పోలీసు భద్రతలోనే జరగాలని సూచించారు. విద్యార్థులకు అన్ని వసతులు కల్పించాలన్నారు.
MBNR: కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిర్వహించిన నిరసన కార్యక్రమంలో పాల్గొని అరెస్ట్ అయిన మహబూబ్ నగర్ వాస్తవ్యుడు నరసింహులు యాదవ్ కుటుంబాన్ని అఖిలభారత యాదవ మహాసభ నాయకులు పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను విడనాడాలన్నారు. యాదవులు పోరాట పట్టిమగలవారన్నారు.
BDK: చంద్ర గ్రహణం సందర్భంగా నేడు ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రామాలయ మూసివేస్తున్నట్లు ఆలయ సిబ్బంది తెలిపారు. ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా పసుపు కొట్టి రామయ్యని పెళ్ళికొడుకుని చేసి తలంబ్రాలు కలపడం ఆనవాయితీ. నేడు గ్రహణం కారణంగా ఈ క్రతువును బుధవారం నిర్వహించే విధంగా వైదిక సిబ్బంది నిర్ణయించారు. బుధవారం దేవస్థానం రామయ్య పెళ్లి పనులు ప్రారంభం.
NRML: కేతుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా బాసర జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయాన్ని మంగళవారం మూసివేశారు. ఉదయం 7 గంటలకు అమ్మవార్లకు అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ప్రధాన, ఉప ఆలయాలను అర్చకులు ద్వారబంధనం చేశారు. సాయంత్రం 7 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి సంప్రోక్షణ, మహాహారతి నిర్వహిస్తామని ఏఈఓ తెలిపారు.
ADB: గాదిగూడ మండలంలోని లోకారి గ్రామానికి వెళ్లే రహదారిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. గ్రామ సమీపంలో చిన్న వంకలు ఉండడంతో బ్రిడ్జి లేక నీరు రోడ్డుపైకి వస్తుంది. ఆ రహదారి మీదుగా రోజు పదుల సంఖ్యలో రాకపోకలు సాగిస్తుండగా వారికి ఆటంకం కలిగిస్తుంది. అధికారులు స్పందించి నూతన బ్రిడ్జి నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
NRPT: మరికల్ మండలంలోని ఎలిగేండ్ల గ్రామంలో సోమవారం రాత్రి కామ దహనాన్ని వైభవంగా నిర్వహించారు. మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా సోమవారం రోజు కామ దహనాలు నిర్వహించిన అనంతరం బుధవారం సహజసిద్ధమైన రంగులతో హోలీ నిర్వహించుకోవాలని గ్రామ సర్పంచ్ అశ్విని నరేష్ గౌడ్ గ్రామంలో చాటింపు వేశారు. యువత పెద్ద ఎత్తున కామదాన కార్యక్రమంలో పాల్గొన్నారు.
KNR: క్రీడాకారుల్లోని ప్రతిభను వెలికితీసేందుకు ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ‘సంసద్ ఖేల్ మహోత్సవం’ అద్భుత వేదికని డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియంలో అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అథ్లెటిక్స్ పోటీల్లో 200 మందికి పైగా క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
JGL: కథలాపూర్ మండలం గంభీర్పూర్ గ్రామంలో శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు, సోమవారం ఘనంగా నిర్వహించారు. దేవాలయంలో భక్తులు పూజలు చేసి కొబ్బరికాయాలు కొట్టి, స్వామివారి కళ్యాణం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గుంటుక మనోహర్, ఉపసర్పంచ్ గండి తిరుపతి, అర్చకులు మాధవచారీ, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
KMR: దోమకొండ కోటలో మార్చి 7వ తేదీ(శనివారం)ఉద్యోగ మేళా నిర్వహించనున్నారు. కామారెడ్డి ఎంప్లాయ్మెంట్ ఆఫీస్, డీఎంకే ఫోర్ట్ ట్రస్ట్, లైఫ్-ఎన్జీవో ఆధ్వర్యంలో జరుగనున్న ఈ మేళాలో 30కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొని ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. నిరుద్యోగ యువత బయోడేటాతో హాజరుకావాలని నిర్వాహకులు సూచించారు. వివరాలకు 9493143378 నంబర్కు సంప్రదించలన్నారు
MBNR: సాంప్రదాయబద్ధంగా హోలీ వేడుకలను నిర్వహించుకోవాలని మహబూబ్నగర్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ కార్పొరేటర్ గుండా సంతోష్ అన్నారు.హోలీ పండుగను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున కామ దహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు చిన్నారులు రసాయనిక రంగులు జల్లుకోకుండా సాంప్రదాయ బద్ధమైన రంగులను చల్లుకోవాలని సూచించారు.
WNP: గోపాల్ పేట మండలంలోని 15 గ్రామ పంచాయతీల వార్డు సభ్యులకు శిక్షణ శిబిరం ప్రారంభమైంది. సోమవారం ఎంపీడీవో ఆయుష్ అంజుమ్ కార్యాలయంలో శిక్షణ ప్రారంభమైంది. వార్డు సభ్యులు తమ వార్డులలో పథకాలు ప్రజలకు ఎలా చేరవేయాలో నేర్చుకుంటున్నారు. ఎంపీడీవో, గ్రామ కార్యదర్శి మరియు వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
SRD: ఉపాధ్యాయులకు కుల గణన రెమ్యూనరేషన్ వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సాయిలు డిమాండ్ చేశారు. సంగారెడ్డిలోని సంఘ భవనంలో సోమవారం సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు రెమ్యూనరేషన్ చెల్లించకపోవడం సరి కాదన్నారు. అధికారులు స్పందించకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
NZB: ఐటీఐ మైదానంలో మంగళవారం హోలీ వేడుకలు మిన్నంటాయి. వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో వాకర్లందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. సంగీతానికి అనుగుణంగా నృత్యాలు చేస్తూ కేరింతలు కొట్టారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.
NLG: జిల్లాలో రబీ సీజన్లో సాగు చేసిన పంటలు నీరందక ఎండిపోతున్న తరుణంలో నీటిపారుదల శాఖ అధికారులు సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 11వ తేదీ నుంచి డీ-25 కాలువ గేట్లను మూసివేయడంతో, కాలువ కింద ఉన్న పొలాలు బీటలు వారుతున్నాయి. రైతుల విజ్ఞప్తులు, పంటల పరిస్థితిని గమనించిన నీటిపారుదల శాఖ అధికారులు, డీ-25 కాలువ ద్వారా రేపటి నుంచి నీటిని వదలనున్నారు.