• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

గురుకులాల్లో సమస్యలను పరిష్కరించాలని వినతి

MHBD: గురుకులాల సమస్యలను వెంటనే పరిష్కరించాలని గురుకులాల సెక్రటరీ సీతాలక్ష్మికి DSFI నేతలు వినతిపత్రం అందజేశారు. DSFI రాష్ట్ర కార్యదర్శి సాయికుమార్, కోశాధికారి గుగులోతు సూర్య ప్రకాష్‌లు మాట్లాడుతూ.. గురుకులాల్లో సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యార్థులకు నాణ్యమైన విద్య, భోజనం అందించాలన్నారు.

February 25, 2026 / 04:19 PM IST

‘మట్టి పోసి ఈ రోడ్డు సమతుల్యం చేయండి’

RR: షాద్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని ఆర్టీసీ కాలనీ, అయ్యప్ప కాలనీ పార్క్, ఆనంద్ కాలనీ సమీపంలో ఇటీవల వేసిన రోడ్ల పనులు పూర్తిగా చేయకపోవడం వల్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డుకు ఇరుపక్కల మట్టి పోయకపోవడంతో వాహనాలు జారిపడి గాయాల పాలవుతున్నారని వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు పక్కన మట్టి పోసి సమతుల్యం చేయాలన్నారు.

February 25, 2026 / 04:16 PM IST

నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలి: మంత్రి

MLG: ములుగు కలెక్టరేట్ నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి సీతక్క అన్నారు. ములుగు కలెక్టరేట్ నిర్మాణ పనులను అధికారులతో కలిసి నేడు మంత్రి సీతక్క పరిశీలించారు. ములుగు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉండేలా భవనాన్ని సుందరంగా తీర్చిదిద్దాలని, పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.

February 25, 2026 / 04:11 PM IST

‘అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్లు మంజూరు చేస్తాం’

JGL: అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మెట్ పల్లి మున్సిపల్ ఛైర్మన్ మైలారపురి లింబాద్రి అన్నారు. మెట్పల్లిలోని ఏడో వార్డులో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాన్ని మున్సిపల్ ఛైర్మన్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన లబ్ధిదారుల కుటుంబానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రభుత్వం పేదల సంక్షేమమే లక్ష్యమన్నారు.

February 25, 2026 / 04:10 PM IST

ఉద్యోగాలు కల్పించాలని భూ నిర్వాసితుల ధర్నా

MNCL: కాసిపేట మండలంలోని దుబ్బగూడెం KK ఓసీ ఓపెన్ కాస్ట్ లో తమకు ఉద్యోగాలు కల్పించాలని ఓపెన్ కాస్ట్ సింగరేణి ముంపుకు గురైన భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. బుధవారం ఓపెన్ కాస్ట్‌లో విధుల సమయంలో వాహనాలు రాకపోకలను నిలిపివేసి ధర్నా చేశారు. సమస్యలను అతిత్వరలో పరిష్కారిస్తమని ఓపెన్ కాస్ట్ యాజమాన్యం చెప్పడంతో ధర్నా విరమించారు.

February 25, 2026 / 04:10 PM IST

ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు

NZB: ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన ఔషధాలు అందించేందుకే ఈ కార్యక్రమాన్ని ప్రధాని నరేంద్ర మోడీ నిర్వహింప చేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలోని శ్రీనగర్ కాలనీ, వినాయక్ నగర్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ప్రధాన్ మంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రారంభించారు.

February 25, 2026 / 04:06 PM IST

‘మహిళల ఫిర్యాదులపై వెంటనే స్పందించాలి’

KNR: మహిళల నుంచి వచ్చే ఫిర్యాదులపై అధికారులు వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఆదేశించారు. లైంగిక వేధింపుల నిర్మూలన చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. బుధవారం KNR కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహిళా సాధికారిత కేంద్రం ద్వారా అవగాహన శిబిరం నిర్వహించారు.

February 25, 2026 / 04:05 PM IST

‘విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనే ధ్యేయం’

KMR: పెద్ద కొడప్గల్ మండలం బాబుల్ గావ్ ప్రాథమిక పాఠశాలలో నూతన మరుగుదొడ్డి నిర్మాణానికి బుధవారం సర్పంచ్ రవి కుమార్ భూమి పూజ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ఈ పని చేపట్టినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బీర్ గోండా, కాంగ్రెస్ అధ్యక్షుడు విఠల్ రెడ్డి పాల్గొన్నారు.

February 25, 2026 / 04:04 PM IST

ఈనెల 27 నుంచి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం

PDPL: అంతర్గాం మండలం మూర్ముర్‌లో నిర్మించిన శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో ఈనెల 27న విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు గోపు ఐలయ్య యాదవ్ తెలిపారు. మార్చి 1, 2 తేదీలలో స్వామివారి కళ్యాణ మహోత్సవం, అనంతరం జాతర కొనసాగుతుందని పేర్కొన్నారు. గత 66 ఏళ్లుగా గోపు వంశీయులు కొమురన్న పేరుతో ఈ జాతరను నిర్వహిస్తున్నట్టు తెలిపారు.

February 25, 2026 / 04:03 PM IST

ఘనంగా బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన

VKB: చౌడాపూర్ మండలం పచ్చవుకుంట తండాలో శ్రీ బంగారు మైసమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. గ్రామాల్లో ఇలాంటి ధార్మిక కార్యక్రమాలు సామరస్యాన్ని పెంపొందిస్తాయని గ్రామప్రజలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అశోక్, సర్పంచ్ సవిత రాజు, చౌడాపూర్ సర్పంచ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ సలీమ్, రాము, గ్రామస్థులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:03 PM IST

అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్న మున్సిపల్ ఛైర్మన్

WNP: అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులకు, భక్తుల పిలుపు మేరకు అయ్యప్ప స్వామి దర్శనానికి విచ్చేసిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్‌కి ఘన స్వాగతం పలికారు. వనపర్తి అయ్యప్ప స్వామి ఆలయ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. విచ్చేసిన భక్తులకు, కమిటీ సభ్యులకు పేరుపేరునా ఆలయ కమిటీ తరఫున ప్రత్యేక ధన్యవాదములు తెలిపారు. నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:03 PM IST

ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని వినతి పత్రం

NLG: దేవరకొండ ఆర్టీసీ వెల్ఫేర్ కమిటీ మెంబర్ పాపారాజు, కార్మికులు కలిసి వారి సమస్యల గురించి ఎమ్మెల్సీ కోదండరామ్‌కు బుధవారం వినతిపత్రం అందజేశారు. ఆర్టీసీ కార్మికుల తరుపున సీఎం రేవంత్ రెడ్డి, రవాణా శాఖా మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. పూర్తి స్థాయిలో వారి సమస్యలను విని కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

February 25, 2026 / 04:02 PM IST

సిరిసిల్ల జిల్లాలో 119 మంది గైర్హాజరు

SRCL: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలకు తొలి రోజు 4209 మంది విద్యార్థులు హాజరైనట్లు సంబంధిత అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 16 పరీక్ష కేంద్రాలలో నిర్వహించిన తొలి రోజు పరీక్షలో 4046 మంది రెగ్యులర్, 283 మంది ప్రైవేటు విద్యార్థులు కలిపి 4328 మంది విద్యార్థులకు గాను, 4209 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారన్నారు. అలాగే 119 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు.

February 25, 2026 / 04:02 PM IST

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలి: కలెక్టర్

ADB: విద్యార్థులు ప్రాథమిక దశ నుంచి సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బుధవారం పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో ధ్యేయ లెర్నింగ్ సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న లెర్న్ స్మార్ట్ విత్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో విద్యార్థులకు కంప్యూటర్ జ్ఞానం పెరగడంతో పాటు విషయ పరిజ్ఞానం సైతం పెరుగుతుందన్నారు.

February 25, 2026 / 04:02 PM IST

మార్చి 28కి జాతీయ లోక్ అదాలత్ వాయిదా

ADB: జిల్లాలో మార్చి 14న జరగాల్సిన జాతీయ లోక్ అదాలత్ అదే నెల 28వ తేదీకి వాయిదా పడినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు వెల్లడించారు. అదనంగా లభించిన ఈ రెండు వారాల సమయాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. మార్చి 28న జరిగే అదాలత్లో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యేలా చూడాలని కోరారు.

February 25, 2026 / 04:02 PM IST