MNCL: మంచిర్యాలకు చెందిన బోడ ధర్మేందర్కు ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ నుంచి అత్యున్నత పురస్కారం వరించింది. ఈ ఏడాది ఉత్తమ సేవలు అందించినందుకు గాను ఆయనకు మంగళవారం రాత్రి హైదారాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రముఖ యాంకర్ సుమ చేతుల మీదుగా అవార్డు ప్రధానం చేశారు. ఈ సందర్భంగా ధర్మేందర్ను బ్యాంకు అధికారులు అభినందించారు.
ADB: ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్లో బుధవారం సీసీఐ పత్తి ధర క్వింటా రూ.8,010గా, ప్రైవేట్ పత్తి ధర రూ.7,100గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో ఎలాంటి మార్పు లేదు. ప్రైవేట్ ధర రూ.100 పెరిగినట్లు వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు తెలియజేశారు.
ASF: కెరమెరి మండలం గోయగాం సమీపంలో విషాదం చోటుచేసుకుంది. దాహం తీర్చుకోవడానికి చెరువు వద్దకు వచ్చిన ఓ కొండగొర్రెపై కుక్కలు దాడి చేశాయి. గమనించిన స్థానికులు దానిని రక్షించినప్పటికీ, తీవ్ర గాయాలవడంతో చికిత్స పొందుతూ మృతి చెందింది. FRO యోగేశ్ ఆధ్వర్యంలో మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దహనం చేశారు. అటవీ శాఖ అధికారులు వెంకట్, నజీర్ అలీ పాల్గొన్నారు.
SRCL: ఇంటర్ వార్షిక పరీక్షలు జిల్లా వ్యాప్తంగా బుధవారం ఉదయం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఇంటర్మీడియట్ పరీక్షలు 16 కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి. నిర్ణీత సమయం కంటే ముందుగానే పరీక్ష రాయడం పూర్తిచేసిన పరీక్ష సాయం ముగిసిన తర్వాతనే బయటకు పంపిస్తారు.
HNK: కాజీపేట పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో PMKVY 4.0 స్కీమ్ కింద ‘ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్’, ‘CNC ఆపరేటర్’ కోర్సుల్లో మూడు నెలల ఉచిత శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఆసక్తి గల నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
JGL: ధర్మారంలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్ష ఇవాళ ప్రశాంతంగా ప్రారంభమైంది. రెండు కేంద్రాలలో 571 మంది విద్యార్థులు పరీక్షకు హాజరవుతున్నారు. విద్యార్థులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం కేంద్రం లోపలికి అనుమతించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, విద్యుత్, ప్రథమ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఈ మేరకు పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు.
KNR: జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ సంవత్సర విద్యార్థులు ఉత్సాహంగా పరీక్షలకు హాజరయ్యారు. జిల్లాలోని 57 కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోలేదు. విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. సీసీ కెమెరా నిఘాలో పరీక్షలు కొనసాగనున్నాయి.
HYDలో కల్లు కాంపౌడ్లపై తనిఖీలు మున్నాళ్ల ముచ్చటగా మారాయి. కూకట్ పల్లి ఘటన తర్వాత హడావిడ చేసిన అధికారులు, నాణ్యతను గాలికొదిలేసరనే ఆరోపణలు వస్తున్నాయి. కల్తీ కల్లు తయారీలో అల్ప్రాజోలం వంటి మత్తు పదార్థాలు వినియోగిస్తారు. కానీ, ఇది ప్రాణాంతకం కాబట్టి అధిక మోతాదులో తీసుకుంటే శ్వాస ఆడకపోవడం, స్పృహ కోల్పోవడం, మరణం సంభవించే ప్రమాదం ఉందని డా.రవి అన్నారు.
MDCL: నాచారం సర్కిల్ పరిధిలో ఆస్తి పన్ను వసూళ్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు రూ.21 కోట్ల మేరకు పన్ను వసూలు కాగా, ఈ ఆర్థిక సంవత్సరానికి మొత్తం లక్ష్యం రూ.59.63 కోట్లుగా నిర్ణయించారు. లక్ష్య సాధన కోసం అధికారులు ప్రత్యేక సేకరణ డ్రైవ్లు చేపట్టారు. బకాయిలు ఉన్న ఆస్తి యజమానులకు నోటీసులు జారీ చేస్తూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
BHNG: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా విశేష ఘట్టమైన స్వామివారి ఎదుర్కోలు మహోత్సవం మంగళవారం రాత్రి కనుల పండువగా జరిగింది. స్వామివారి ప్రధానాలయ తూర్పు రాజగోపురం ఎదురుగా మాడ వీధుల్లో స్వామి, అమ్మవార్ల ఎదుర్కోలు మహోత్సవాన్ని వేద మంత్రాలతో సంప్రదాయ రీతిలో వైభవంగా నిర్వహించారు.
MHBD: మహబూబాబాద్ మున్సిపాలిటీ 2వ వార్డు పరిధిలోని జమాండ్లపల్లిలో ఈరోజు ఉదయం మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, కౌన్సిలర్ శివకుమార్ మార్నింగ్ వాక్ నిర్వహించి ప్రజలతో మమేకమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 2వ వార్డు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తానని, వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దే బాధ్యత నాది అని కౌన్సిలర్ అన్నారు.
HYD: తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి CRMP రెండో దశకు రూ.3,145 కోట్లతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఆమోదంతో మొత్తం 1,142 కిలోమీటర్ల రహదారుల అభివృద్ధి చేపట్టనున్నారు. రూ.3,145 కోట్ల వ్యయంతో రోడ్ల మరమ్మత్తులు, పునరుద్ధరణ పనులు, అవసరమైన చోట్ల కొత్త రోడ్ల నిర్మాణం చేపట్టి రవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని నిర్ణయించారు.
SRD: పట్టణం బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ ఉపాధి కార్యాలయంలో ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీల భర్తీకి 18 నుంచి 35 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 08455-271010 నంబర్కు సంప్రదించాలని కోరారు.
BDK: అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు బుధవారం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్రం వద్ద సిఐ అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయగా, విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే కేంద్రాల్లోకి అనుమతించారు.
GDWL: మున్నూరు కాపు సంఘం జిల్లా కమిటీ కాలపరిమితి ముగియడంతో జిల్లా అధ్యక్షుడు జి.వేణుగోపాల్ రాజీనామా చేశారు. తాత్కాలిక అధ్యక్షుడిగా కాపులకుంట సుధాకర్ రెడ్డి నియమితులయ్యారు. గౌరవాధ్యక్షుడు బాణాల కృష్ణమూర్తిని కలిసారు. సంఘ బలోపేతానికి కృషి చేసి, త్వరలో నూతన కమిటీ ఏర్పాటు చేయాలని సూచించారు.