NRPT: రాష్ట్ర స్థాయిలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో జిల్లాకు బెస్ట్ ప్రాక్టీసింగ్ అవార్డు లభించిందని జిల్లా విద్యాశాఖ అధికారి గోవిందరాజు తెలిపారు. FLN AI AXL కార్యక్రమాన్ని జిల్లాలోని పాఠశాలలో సమర్థవంతంగా నిర్వహించడం ద్వారా అవార్డు లభించిందన్నారు. గణన సామర్థ్యాల బలోపేతం దిశగా జిల్లాలో ప్రణాళికాబద్ధమైన చర్యలు చేపట్టడంతో అవార్డు సాధ్యమైందని అన్నారు.
WNP: సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని బుసిరెడ్డిపల్లి ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు శ్రీ విద్య ఆధ్వర్యంలో నిర్వహించారు. విద్యార్థులు రూపొందించిన సైన్స్ నమూనాలను సర్పంచ్ తలకంటి ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. సైన్స్ అభివృద్ధికి సహకరిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
MLG: వాజేడు మండలం పెనుగోలు కాలనీ పుసురు బీట్ పరిధిలో శనివారం అటవీశాఖ ఆధ్వర్యంలో వేసవి కాలంలో అటవీ అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీశాఖ అధికారులు గ్రామస్థులకు అగ్ని ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనుమానాస్పద ఘటనలు గమనిస్తే వెంటనే అటవీశాఖకు సమాచారం అందించాలని సూచించారు.
KNR: HYDలోని రెండు ఆసుపత్రుల్లో రోగి మృతికి వైద్యులే కారణమంటూ బంధువులు ఆసుపత్రి సిబ్బంది, సామగ్రిపై దాడి చేసిన ఘటనను ఖండిస్తూ జమ్మికుంట, హుజురాబాద్ ఐఎంఏ ఆధ్వర్యంలో జమ్మికుంటలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ తిరుపతి మాట్లాడుతూ.. ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు అహర్నిశలు కృషి చేస్తారని, అనూహ్య మరణాలపై దాడులు చేయడం సరైంది కాదన్నారు.
NZB: ఒకవైపు ప్రకృతి కన్నెర్ర.. మరోవైపు ప్రభుత్వ ఉదాసీనతతో రైతాంగం అల్లాడిపోతోందని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు గుమ్ముల గంగాధర్, నడిపి నాగన్న ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం బోధన్ సబ్ కలెక్టరేట్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. డివిజన్ వ్యాప్తంగా నెలకొన్న సాగు సమస్యలను వివరించారు.
NLG: కుమ్మెరలో అగ్రకుల అహంకారానికి బలైన పసిపాప మృతికి DYFI ఆధ్వర్యంలో నల్గొండ, క్లాక్ టవర్ వద్ద ఇవాళ కొవ్వొత్తులతో నివాళి అర్పించారు. నిమ్న కులస్తులనే నెపంతో దర్శనానికి అడ్డుపడి, బాధితులపై దాడి చేసి రెండు నెలల పాప మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ డిమాండ్ చేశారు.
HNK: ఆత్మకూరు మండలం తిరుమలగిరి సమీపంలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు ‘అరైవ్-అలైవ్’ కార్యక్రమంలో భాగంగా ట్రాఫిక్ నియమ నిబంధనలపై పోలీసులు అవగాహన కల్పించారు. ట్రాఫిక్ నియమ నిబంధనలపై విద్యార్థినిలు అవగాహన కలిగి ఉండి తల్లిదండ్రులకు సూచనలు చేయాలని, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని పోలీసులు సూచించారు.
NGKL: జిల్లా పెద్దకొత్తపల్లి మండలం నాయనపల్లి జాతర సందర్భంగా పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆదివారం జాతర నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు పెద్దకొత్తపల్లి ఎస్సై సతీష్ కుమార్ ఆధ్వర్యంలో డివిజన్ పోలీసులు మోహరించారు.
MHBD: తొర్రూర్ పట్టణ కేంద్రంలోని వికాస్ కళాశాలలో మేర యువ భారత్ వరంగల్ కేంద్రం ఆధ్వర్యంలో శనివారం సి.వి. రామన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోఆర్డినేటర్ నవిన్ యాదవ్ మాట్లాడుతూ.. సి.వి. రామన్ ఆవిష్కరణలతోనే ప్రపంచం ముందుకు సాగుతోందని, యువత కూడా కొత్త ఆవిష్కరణల్లో భాగస్వామ్యం కావాలని, నిరంతరం ఆవిష్కరణ దిశగా అడుగులు వేయాలని పిలుపునిచ్చారు.
ADB: తెలంగాణ విద్యావిధానం-2026 నివేదికలో విద్య కమిషన్ తమ పరిధి దాటి ఉపాధ్యాయుల వేతనాలు, ప్రమోషన్లు, నియామకాల గురించి మాట్లాడడం ఉపాధ్యాయుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని PRTU తెలంగాణ సంఘం జిల్లాధ్యక్షుడు ఆడే నూర్ సింగ్ నాయక్ అన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రకటించారు. ఉపాధ్యాయులను గౌరవించాలని పేర్కొన్నారు.
JGL: విద్యార్థులు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా ఎదగాలని కోరుట్ల ఎస్సై చిరంజీవి అన్నారు. పట్టణంలోని కేరళ హై స్కూల్లో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు విద్యార్థులు పలు అంశాలపై చెపట్టిన ప్రాజెక్టులను ఎస్సై సందర్శించారు. ఈ సందర్బంగా ఎస్సై మట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలన్నారు.
HYD: గ్రేటర్ పౌరుల ప్రాపర్టీ ట్యాక్స్ సంబంధిత సమస్యలకు వేగవంతమైన పరిష్కారం కల్పించేందుకు జీహెచ్ఎంసీ చర్యలకు దిగింది. ‘ప్రాపర్టీ ట్యాక్స్ పరిష్కారం’ (PTP) కార్యక్రమాన్ని వచ్చే మార్చి నెలలో ప్రతి ఆదివారం నిర్వహించనున్నట్లు కమిషనర్ ఆర్వీ కర్ణన్ వెల్లడించారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అన్ని సర్కిల్ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం ఉంటుందన్నారు.
MLG: మేడారం మహా జాతర విజయవంతానికి అందరూ పట్టుదలతో కృషి చేశారని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. ఇవాళ సాయంత్రం మేడారంలో జాతర అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పంతో 251 కోట్లతో చేపట్టిన పనుల్లో 95% పూర్తయ్యాయని, మిగిలిన 5% పనులను త్వరలో నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
MHBD: జిల్లా హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లను మాజీ మంత్రి ఎర్రబెల్లి శనివారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో హ్యూమన్ రైట్స్ కోసం నిరంతరం సేవలు అందిస్తున్న సంస్థ, టీం సభ్యులు, బాధితుల పక్షాన నిలబడి న్యాయం చేస్తున్న వారి సేవలు మరవలేనివని అన్నారు.
JN: సాగరం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు గాద ఇన్నయ్య తండ్రి సాల్మన్ రెడ్డి మరణించగా నేడు వారి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కార్యక్రమంలో మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యేలు రాజయ్య, సుదర్శన్ రెడ్డి, రమేష్, తదితరులు ఉన్నారు.