• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »తెలంగాణ

తప్పిదాలకు తావివ్వకుండా పరీక్షలు నిర్వహించాలి: కలెక్టర్

RR: రేపటి నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను ఎలాంటి తప్పిదాలకు తావివ్వకుండా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారుల ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ భవనంలోని సమావేశం మందిరం నుంచి సంబంధిత అధికారులతో టెలికాన్ఫరెన్స్ సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్ష విధులు నిర్వహించే ప్రతి అధికారి బాధ్యతగా పనిచేయలన్నారు.

February 24, 2026 / 05:41 PM IST

‘పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలి’

ASF: ఇంటర్మీడియట్, పదవ తరగతి పరీక్షలను ఎటువంటి లోటుపాట్లు లేకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు అన్నారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా టెన్త్, ఇంటర్ పరీక్షలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ హరిత పాల్గొన్నారు. సమావేశంలో DIEO, DEO తదితర అధికారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 05:37 PM IST

‘ఇంటర్ పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వర్తించాలి’

KNR: ఇంటర్ పరీక్షలను రాష్ట్రంలో కట్టుదిట్టంగా నిర్వహించాలని సీఎస్‌కే రామకృష్ణారావు సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం సీఎస్ కే. రామ కృష్ణ రావు ఇంటర్ పరీక్షల నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్‌లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. కరీంనగర్ కలెక్టరేట్ నుంచి ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అదనపు కలెక్టర్ అశ్విని పాల్గొన్నారు.

February 24, 2026 / 05:36 PM IST

‘ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం’

MBNR: మిడ్జిల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చీఫ్ సూపరింటెండెంట్ విజయంతి తెలిపారు. మొత్తం 216 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్ష ఉదయం 9 గంటలకు ప్రారంభమవుతుందని, విద్యార్థులు గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యం 5 నిమిషాలకు మించితే లోపలకి రానివ్వమన్నారు.

February 24, 2026 / 05:32 PM IST

ఇంటర్ పరీక్షలకు సర్వం సిద్ధం: షేక్ సలాం

KMR: జిల్లాలో ఇంటర్ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఇంటర్ విద్యాశాఖ అధికారి షేక్ సలాం తెలిపారు. రేపటి నుంచి మార్చి 17 వరకు ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరుగుతాయని చెప్పారు. జిల్లాలో 37 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా 17,953 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలు, మంచినీటి వసతి కల్పించామన్నారు.

February 24, 2026 / 05:32 PM IST

అజీమ్ ఖాన్ మృతికి ఎమ్మెల్యే కోరం నివాళి

BDK: ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డుకు చెందిన అజీమ్ ఖాన్ గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య అజీమ్ ఖాన్ భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం ద్వారా అన్నివేళలా అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 05:31 PM IST

బోర్డు పరీక్షలపై సమీక్ష నిర్వహించిన కలెక్టర్

KMM: ఖమ్మం జిల్లాలో పదవ తరగతి, ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం, విద్యాశాఖ అధికారులతో సమీక్షా సమావేశంలో మాట్లాడుతూ.. విద్యార్థులు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ లోపు కేంద్రానికి చేరుకోవాలన్నారు.

February 24, 2026 / 05:30 PM IST

పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపన

WNP: మంత్రి జూపల్లి కృష్ణారావు పానగల్ మండలంలోని బహదూర్ గూడెంలో నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. అనంతరం కొత్తపేటలో మహిళా సమైక్య భవనానికి శంకుస్థాపన ఆయన చేశారు. మహ్మదాపూర్, కొత్తపేటల్లో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకలకు మంత్రి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.

February 24, 2026 / 05:30 PM IST

‘ఆశ వర్కర్ల పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి’

WGL: ఆశ వర్కర్ల పెండింగ్‌లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని BRTU ఆధ్వర్యంలో ఇవాళ జిల్లా వైద్య కార్యాలయం సూపర్డెంట్‌కి వినతిపత్రం అందజేశారు. అనంతరం యూనియన్ నాయకుడు యువరాజ్ మాట్లాడుతూ.. ప్రతి నెల ఒకటో తారీకు జీతం అందిస్తామని ప్రభుత్వం చెప్పి ఇప్పటి వరకు వేతనాలు అందించడం లేదని అన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్లో ఉన్న వేతనాలు విడుదల చేయాలని కోరారు.

February 24, 2026 / 05:27 PM IST

‘రోడ్డు భద్రతలో మహిళల పాత్ర కీలకం’

ADB: ప్రతి కుటుంబం సురక్షితంగా ఉండాలంటే మహిళలు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కలిగి ఉండాలని సిరికొండ ఎస్సై పూజ అన్నారు. “అరైవ్ ఆలైవ్” కార్యక్రమంలో పోలీస్ స్టేషన్లో స్వయం సహాయక సంఘాల మహిళలతో అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఇంట్లోని వారు వాహనాలు నడిపేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా మహిళలు ప్రోత్సహించాలని కోరారు.

February 24, 2026 / 05:27 PM IST

బాధిత కుటుంబానికి యువ నేత భరోసా

MLG: మండలంలోని చేరుపల్లి (కొత్తపేట) గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ బాబాయి సోదరుడు, పార్టీ నాయకుడు ముత్తినేని వసంతరావు అనారోగ్యంతో మృతి చెందారు. సోమవారం దశదిన కర్మకు కాంగ్రెస్ యువ నేత కుంజా సూర్య హాజరై చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. పార్టీ కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

February 24, 2026 / 05:26 PM IST

దాడులకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి: BJP

NZB: జిల్లాలో ఇటీవల జరుగుతున్న దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ BJP జిల్లా అధ్యక్షుడు దినేశ్ కులాచారి కోరారు. ఆయన ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు పోలీస్ కమీషనర్ సాయి చైతన్యను కలిసి వినతిపత్రం అందజేశారు. నగరంలోని మిర్చి కాంపౌండ్, తదితర ప్రాంతాల్లో అమాయక ప్రజలపై జరుగుతున్న దాడులపట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.

February 24, 2026 / 05:21 PM IST

‘ఇందిరమ్మ ఇళ్ల పనులు వేగవంతం చేయండి’

SRPT: రాష్ట్ర చరిత్రలో ఒకే చోట 2,160 ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి పేదలకు అందిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం హుజూర్ నగర్‌లోని రామస్వామి గుట్ట వద్ద 110 ఎకరాలలో రూ. 125 కోట్లతో నిర్మిస్తున్న ఇందిరమ్మ ఇళ్ల ప్లాట్లను రాష్ట్ర హోజింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 05:21 PM IST

‘అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి’

KMM: వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలోని సమస్యల వారీగా వివరించారు. అలాగే అభివృద్ధి నిధులు మంజూరు చేయాలని కోరారు. సానుకూలంగా స్పందించిన వారు అభివృద్ధికి కావలసిన ప్రణాళిక రూపొందించుకొని త్వరితగతంగా నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.

February 24, 2026 / 05:16 PM IST

‘సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు’

PDPL: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తుందని ఎమ్మెల్యే విజయ రమణారావు పేర్కొన్నారు. మంగళవారం ఆయన సుల్తానాబాద్ పట్టణంలో 99 మంది లబ్ధిదారులకు రూ. 99,11,484 విలువైన కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

February 24, 2026 / 05:11 PM IST