RR: షాద్నగర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో గ్రామపంచాయతీ పాలన-పంచాయితీ రాజ్ చట్టంపై వార్డు సభ్యులకు అవగాహన కల్పించేందుకు నేటి నుంచి శిక్షణా తరగతులను నిర్వహించనున్నట్లు ఎంపీడీవో బన్సీలాల్ తెలిపారు. ఈరోజు నుంచి మార్చి 23 వరకు 4 విడతలుగా శిక్షణ కొనసాగనుందని, వార్డు సభ్యులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన సూచించారు.
WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో నేటి నుంచి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభంకానున్నాయి. ఇవాళ అధ్యయనోత్సవంతో మొదలై, ఫిబ్రవరి 27న కల్యాణోత్సవం, మార్చి 3న బండ్ల ఊరేగింపు, మార్చి 7న రథోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆలయ అర్చకులు, కమిటీ నిర్వాహకులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలన్నారు.
WNP: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డికి అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ సమస్యల పరిష్కారం కోరుతూ ఆదివారం వినతి పత్రం అందజేశారు. ఎమ్మెల్యే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల మేరకు కనీస వేతనం కోసం సీఎంతో బడ్జెట్ సమావేశాల్లో మాట్లాడతానని, ఖాళీగా ఉన్న టీచర్లు, హెల్పర్స్ పోస్టులను భర్తీ చేయడానికి కృషి చేస్తానని, అన్ని సమస్యలను పరిష్కరించేలా చూస్తానని అన్నారు.
HNK: ఐనవోలు మండలం పన్నేలు గ్రామం వద్ద ఎలాంటి అనుమతులు లేకుండా సోమవారం ఇసుకను తరలిస్తున్న రెండు ట్రాక్టర్ను పోలీసులు పట్టుకున్నారు. కానిస్టేబుల్ ట్రాక్టర్ను ఆపి అనుమతిపత్రాలను పరిశీలించినప్పటికీ, సరైన అనుమతులు లేని కారణంగా ట్రాక్టర్ను స్టేషన్కు తరలించినట్లు, ట్రాక్టర్ డ్రైవర్,యజమానులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
KMM: అంబేద్కర్ సెంటర్ వద్ద BC, SC, ST జేఏసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిన్న రాత్రి స్థానిక కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెరలో రజకులపై జరిగిన దాడిలో 2 నెలల పసికందు మృతి చెందడాన్ని నిరసిస్తూ ఖమ్మం నగరంలో నిరసన జ్వాలలు మిన్నంటాయి. స్వాతంత్య్రం వచ్చి 7 దశాబ్దాలు దాటినా ఇంకా తాడులు ఆగలేదని JAC నేత రాంబాబు చెప్పారు.
KMR: బాన్సువాడలోని రిలయన్స్ మార్ట్ వద్ద జరిగిన ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో భారీ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. రాళ్లు విసిరిన ఘటనలో ఇప్పటివరకు 42 మందిని గుర్తించి కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెట్టే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
NRPT: ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ నెల సందర్భంగా నర్వ మండలంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. జామా మసీద్ను విద్యుత్ దీపాలతో అలంకరించారు. రంజాన్ ప్రార్థనల కోసం భక్తులు తరలవచ్చేలా రంగురంగుల వెలుగులతో మసీదు శోభాయమానంగా తీర్చిదిద్దబడింది. రాత్రి వేళల్లో మసీదు మెరిసిపోతోంది. ముస్లింలు ఉపవాస దీక్షలు, ప్రత్యేక నమాజ్లు నిర్వహిస్తున్నారు.
WGL: వరంగల్ పట్టణ కేంద్రంలోని శంభునిపేట కాలనీలోని వాటర్ ట్యాంక్ను నిన్న రాత్రి నగర మేయర్ గుండు సుధారాణి ఆకస్మికంగా తనిఖీ చేశారు. రానున్న వేసవి కాలంలో ప్రజలకు తాగునీటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, అంతరాయం లేకుండా సరఫరా కొనసాగేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో బల్దియా అధికారులు ఉన్నారు.
NZB: వర్ని మండలం అక్బర్ నగర్ టోల్ ప్లాజా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికుల వివరాల ప్రకారం.. ట్రాక్టర్- లారీ ఢీకొన్న ఘటనలో పాత వర్నికి చెందిన భూమయ్యకు గాయాలయ్యాయి. వర్ని 108 సిబ్బంది రామకృష్ణ, గౌస్ బాధితుడికి ప్రథమ చికిత్స చేసి నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: మూసీ అభివృద్ధి పేరుతో సీఎం రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. మూసీ ప్రాజెక్టు బాధిత కుటుంబాలను పరామర్శించిన ఆయన, అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, కానీ పేదల ఇళ్లు కూల్చడాన్ని అంగీకరించబోమని స్పష్టం చేశారు. సీఎం చేసే ప్రతి పని వెనుక భూముల పంచాయతీ, వ్యాపార ప్రయోజనాలే ఉంటున్నాయని ఆయన ఆరోపించారు.
PDPL: ముత్తారం మండలంలోని లక్కారంలో గ్రీన్ ఫీల్డ్ హైవే నిర్వాసితులు ఆందోళన కొనసాగిస్తున్నారు. తమకు రావాల్సిన నష్టపరిహారం చెల్లించే వరకు భూములు ఇచ్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అధికారులు కేవలం సర్వేలతో కాలయాపన చేస్తూ తమను మోసం చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలని, అప్పటివరకు పోరాటం ఆపేది లేదన్నారు.
MHBD: బయ్యారం మండలం బీరొనిమడుగు, పంది పంపుల, అల్లిగూడెం గ్రామాల్లో ఇవాళ తెల్లవారుజామున ఈదురు గాలులు తీవ్ర బీభత్సం సృష్టించాయి. దీంతో 30 ఎకరాలు మొక్కజొన్న పంట పూర్తిగా నేలమట్టం అయ్యింది. చేతికి వచ్చిన పంట నెల రావడంతో అన్నదాతలు కన్నీటి పరేమయ్యారు. ప్రభుత్వమే నష్టపరిహారం చెల్లించి తమను ఆదుకోవాలని రైతులు విజ్ఞప్తి చేశారు.
NLG: పెద్దఅడిశర్లపల్లి మండలం వద్దిపట్లలో ముత్యాలమ్మ విగ్రహానికి ఆ కాలనీ ప్రజలు భక్తి శ్రద్దలతో ఘనంగా విగ్రహ ప్రతిష్ట నిర్వహించారు. రానున్న రోజులలో గుడి నిర్మాణం చేసుకుని పెద్ద ఎత్తున జాతర కార్యక్రమాలు నిర్వహిస్తామని గ్రామ నాయకుడు దున్న ముత్యాలు అన్నారు. ఆ తల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ గ్రామంపై ఉండాలని అన్నారు. కార్యక్రమంలో దున్న ఆంజనేయులు పాల్గొన్నారు.
WGL: నల్లబెల్లి మండలం కేంద్రంలోని ముచింపుల గ్రామంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సొంతింటి కల నెరవేరిందని ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులు కవిత, దేవేందర్ తెలిపారు. అనంతరం వారు HIT TVతో మాట్లాడుతూ.. గత 10 సం,గా ఎదురుచూస్తున్న తమ సొంతింటి కల ప్రజాపాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సర్పంచ్ శేఖర్ గౌడ సహకారంతో నెరవేరిందని అన్నారు.
ADB: దైవారాధనతో మానసిక ప్రశాంతత కలుగుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదివారం గుడిహత్నూర్ మండల కేంద్రంలో సంత్ గాడిగే బాబా విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. బీజేపీ జిల్లాధ్యక్షుడు పతంగి బ్రహ్మానందంతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహాల ప్రతిష్టాపనతో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంటుందని పేర్కొన్నారు.