JGL: విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 17 నుంచి 19 తేదీ వరకు ఖమ్మంలో నిర్వహించిన ఆటల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లాకు మెడల్స్ తీసుకొచ్చిన జగిత్యాల జిల్లా ఉద్యో గులను SE బి.సుదర్శనం అభినందించారు. ఉద్యోగంలో రాణిస్తూ క్రీడల్లో ముందంజలో ఉండటం సంతోషమని అన్నారు. ఇలాగే జాతీయ స్థాయి పోటీల్లో కూడా మంచి ప్రతిభ కనబరచాలని ఆశాభావం వ్యక్తం చేశారు.
KNR: కరీంనగర్ జిల్లాలో జనవరి 31 నుంచి 84663 మంది రైతులు 301479 యూరియా బస్తాలను బుక్ చేసుకొని 269215 బస్తాలను కొనుగోలు చేశారని డీఏఓ భాగ్య లక్ష్మి తెలిపారు. జిల్లాలో 1510 మెట్రిక్ టన్నులు యూరియా అందుబాటులో ఉందన్నారు. జిల్లా రైతులు ఆందోళన చెందొద్దని స్పష్టం చేశారు. అవసరానికి తగ్గట్టుగా యూరియా సరఫరా చేస్తామని DAO పేర్కొన్నారు.
NZB: ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మీడియాతో మాట్లాడారు ఎమ్మెల్యే గూండాలా, రౌడీలా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన వ్యక్తి వయసు 65 ఏళ్లు ఉంటుందన్నారు.
KMR: పల్వంచ మండలం భవానీపేటలో మంగళవారం రేణుక ఎల్లమ్మ కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించారు. పల్వంచ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పల్లె రమేశ్ గౌడ్ హాజరయ్యారు. ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయంగా రూ.1,16,000 లక్షల విరాళం అందజేశారు. మాతమ్మ ఆలయానికి రూ.20,000 వేలు సహాయం ప్రకటించి చెక్కును గ్రామస్థులకు పంపిణీ చేశారు. గ్రామ అధ్యక్షుడు చాకలి రాజు కృతజ్ఞతలు తెలిపారు.
NZB: సామాజిక అంశాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని సీపీ సాయి చైతన్య సూచించారు. రోడ్డు భద్రత ప్రమాదాల నివారణపై విద్యార్థులు ఇతరులను చైతన్యవంతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాలు నివారించడం కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘అలైవ్- అరైవ్’ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
SRPT: మేళ్లచెరువు రామలింగేశ్వర స్వామి జాతర ద్వారా మొత్తం రూ. 45,43,657 లక్ష్లల ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో శంభిరెడ్డి మంగళవారం తెలిపారు. టికెట్ ద్వారా రూ. 15 లక్షలు, ఉండి ద్వారా రూ. 12 లక్షలు, వేలం పాటల ద్వారా రూ. 6 లక్షలు లభించాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఆదాయం రూ. 6 లక్షలు వరకు పెరిగిందని ఆయన తెలియజేశారు.
KNR: మానకొండూరు మండలం మద్దికుంట గ్రామపంచాయతీలో మంగళవారం శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఉజ్వల యోజన పథకం కింద ఐదుగురికి ఉచిత గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేశారు. నిరుపేద కుటుంబాలు కట్టెల పొయ్యి వాడకం వల్ల అనారోగ్యానికి గురవుతున్నాయని, పేదలను దృష్టిలో ఉంచుకుని పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి కవిత, ఉప సర్పంచ్ పాల్గొన్నారు.
BHNG: టూరిజం మాస్టర్ ప్లాన్ తయారీలో భాగంగా ఇవాళ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. టూరిజం మాస్టర్ ప్లాన్ రూపకల్పనలో రెండు రోజులలో ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. రాచకొండ, భువనగిరి ఫోర్ట్, మహదేవ్ పూర్, యాదాద్రి టెంపుల్, కొలనుపాకలను గుర్తించి ప్రణాళికలు రూపొందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
MDCL: ఉప్పల్ నుంచి చిలుకా నగర్ వెళ్లే మార్గంలో కావేరి నగర్ కమాన్ వద్ద పైపులైన్ కోసం తవ్వగా రోడ్డు అత్యంత ఇరుకుగా మారి పరిస్థితి, అధ్వానంగా మారింది. దీంతో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ ఏర్పడడం, ప్రమాదకరంగా వాహనదారులు అటువైపు వెళుతున్న పరిస్థితి. దీనిపై అనేక కథనాలు వెలువడినప్పటికీ, మున్సిపల్ అధికారులకు తెలిసినా నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు.
MDK: జిల్లాలో ఇంటర్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పేర్కొన్నారు. రామాయంపేట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ పరీక్షల ఏర్పాట్లను పరిశీలించారు. జిల్లావ్యాప్తంగా 28 ఇంటర్ పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు వివరించారు. సీసీటీవీ కెమెరాలు, త్రాగునీరు, విద్యుత్తు, మెడికల్ కిట్లు ఏర్పాటు చేశామన్నారు.
BDK: నూతనంగా ఎన్నికైన కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్ మూడ్ గణేష్ను మంగళవారం ప్రకృతి ప్రేమికులు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతి హరితదీక్ష ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. చిన్నతనం నుంచే మొక్కలు నాటడాన్ని అలవాటుగా చేసుకోవడం శుభపరిణామమని, నైనికను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని కోరారు.
MHBD: ఆకేరు వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్ సీజ్ చేసినట్లు పెద్దవంగర SI చిలువేరు ప్రమోద్ తెలిపారు. తొర్రూరు మండలంలోని బొంతుపల్లి తండాకు చెందిన గుగులోతు సురేష్ నెల్లికుదురు మండలంలోని బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలోని ఆకేరు వాగు నుంచి పెద్దవంగర మండలానికి ఇసుక తరలిస్తున్న క్రమంలో సీజ్ చేసి,అతనిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.
JN: పాలకుర్తి (M) కేంద్రంలోని గూడూరు గిరిజన బాలికల గురుకుల పాఠశాల & కళాశాలలో నిన్న జరిగిన సంఘటనపై గురుకులాల సెక్రటరీ, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇవాళ గురుకులాన్ని సందర్శించి విచారణ చేపట్టినట్లు DY సెక్రటరీ D.S వెంకన్న తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలలో భోజనం ఆలస్యం కావడం వలన విద్యార్థుల ధర్నా చేసినట్లు విచారణ తేలిందని తెలిపారు.
MDK: మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలగౌడ్ గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు బాల గౌడ్ ఇంటికి వెళ్లి తక్షణ సహాయంగా రూ. 10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. బాలా గౌడ్ ఆరోగ్యం బాగుపడేందుకు మెరుగైన చికిత్స కోసం తోడ్పాటు అందిస్తామని కుటుంబానికి హామీ ఇచ్చారు.
WGL: ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని మంత్రి కొండా సురేఖకు అధికారులు, అర్చకులు ఆహ్వానం అందజేశారు. భక్తులకు సౌకర్యాల కల్పన, భద్రతా ఏర్పాట్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని, దేవస్థానం అభివృద్ధి, భక్తుల సౌకర్యాల పెంపు కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి తెలిపారు.