• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూతన డైనింగ్ హాల్‌ను ప్రారంభించిన కలెక్టర్

CTR: బైరెడ్డిపల్లి మండలం, కమ్మనపల్లి గ్రామంలోని ప్రభుత్వ బాలుర రెసిడెన్షియల్ పాఠశాలలో ప్రభుత్వం తరఫున రూ.7 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన డైనింగ్ హాలును కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల అవసరాలకు అనుగుణంగా ప్రభుత్వం సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. విద్యార్థులు చక్కగా చదువుకోవాలన్నారు.

February 25, 2026 / 08:22 PM IST

అకాల వర్షాలతో మామిడి రైతు విలవిల

VKB: కుల్కచర్ల మండలంలో అకాల వర్షాంతో మామిడి రైతులు అవస్థలు పడుతున్నారు. వేరుశనగ రైతులు పల్లికాయలకు నీరు సమృద్ధిగా అందుతుందని ఆనందం వ్యక్తం చేస్తుండగా.. మామిడి రైతులు మాత్రం దిగాలుగా ఉన్నారు. వేసవికాలంలో వర్షాలు కురుస్తుండటంతో తాము తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని బాధిత రైతులు వాపోతున్నారు.

February 25, 2026 / 08:21 PM IST

మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా

SRCL: మున్సిపల్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా నిర్వహించారు. 2009 నుంచి 2012 వరకు పెండింగ్లో ఉన్న 3 ఏళ్ల పీఎఫ్ బకాయిలను వెంటనే కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కమిషనర్ ఖదీర్ పాషా వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

February 25, 2026 / 08:18 PM IST

‘చిత్తడి నేలలను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దే అవకాశం’

NRML: చిత్తడి నేలల వల్ల భూగర్భ జలమట్టం పెరగడమే కాకుండా, జీవవైవిధ్యం పెంపొందుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అన్నారు. గురువారం ప్రకటనలో వారు మాట్లాడుతూ.. జిల్లాలో గుర్తించిన చిత్తడి నేలలను కేవలం పర్యావరణ దృక్కోణంలోనే కాకుండా, పర్యాటక కేంద్రాలుగా కూడా తీర్చిదిద్దే అవకాశం ఉందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు.

February 25, 2026 / 08:15 PM IST

లైఫ్ సర్టిఫికెట్ లేకుంటే పెన్షన్ కట్

VSP: జిల్లా పెన్షనర్లు తమ వార్షిక ధ్రువీకరణ సమర్పించేందుకు ఈనెల 28వ తేదీయే ఆఖరి గడువని జిల్లా ట్రెజరీ అధికారి కే. మోహన్ రావు ప్రకటించారు. గడువు దాటితే పెన్షన్ నిలిచిపోయే ప్రమాదం ఉందని, జిల్లాలో ఇంకా 2,476 మంది సర్టిఫికెట్లు అందజేయాల్సి ఉందని ఆయన తెలిపారు.

February 25, 2026 / 08:14 PM IST

వైసీపీ మాపై తప్పుడు ప్రచారం మానుకోవాలి: మంత్రి

AP: వైసీపీ తమపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని మంత్రి పార్థసారథి సూచించారు. ‘టీటీడీ పర్చేజ్ కమిటీ నిబంధనల మార్పుపై వైసీపీ వక్రభాష్యం చెబుతోంది. స్టార్టప్ డెయిరీలు కూడా టెండర్‌లో పాల్గొనేలా నిబంధనలు మార్చాం. కంపెనీల మధ్య పోటీతత్వం ఉండాలనే నిర్ణయం తీసుకున్నాం. పాలు లేకుండా, పామాయిల్‌తో కల్తీ చేసే వారిని అనుమతించాలని అనడం లేదు’ అని పేర్కొన్నారు.

February 25, 2026 / 08:14 PM IST

పారిశుద్ధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు: డీపీవో

JGL: గ్రామాల్లో పారిశుధ్యం పట్ల నిర్లక్ష్యం చేసే వారిపై చర్యలు తీసుకుంటామని జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ అన్నారు. బుధవారం పెగడపల్లి మండలం నర్సింహునిపేట గ్రామంలో పారిశుధ్య పనులను డీపీవో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో రోడ్లు, మురికి కాలువల పరిశుభ్రతను తరచూ చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో ప్రేమ్ సాగర్ పాల్గొన్నారు.

February 25, 2026 / 08:14 PM IST

విద్యార్థులకు బిగ్ అలర్ట్

మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పరీక్షల విభాగం కీలక సూచనలు చేసింది. నామినల్స్ రోల్స్‌లో విద్యార్థుల పేరు, పుట్టిన తేదీ వంటి వివరాల్లో తప్పులు ఉంటే సరిదిద్దుకోవచ్చని తెలిపింది. ఈనెల 26 నుంచి 28 వరకు అవకాశం కల్పించింది.

February 25, 2026 / 08:12 PM IST

‘కేవిటి కులాన్ని ఓబీసీ జాబితాలో చేర్చాలి’

SKLM: వజ్రపుకొత్తూరు మండలం నువ్వులరేవు గ్రామంలో ఉన్న కేవీటీల కులాన్ని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు న్యాయం చేయాలని పలాస జిల్లా సాధన కమిటీ కన్వీనర్ దువ్వాడ శ్రీధర్ బాబా బుధవారం ఒక ప్రకటనలో కోరారు. కేవీటీలకు రాష్ట్రం బీసీగా గుర్తింపు నిచ్చారు. అయితే కేంద్రం ఓబీసీ జాబితాలో చేర్చలేదని తెలిపారు. కేవిటి కులాన్ని కేంద్ర ఓ.బి.సి జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.

February 25, 2026 / 08:12 PM IST

చేనేతను ఆదరించండి: రామయ్య

KDP: చేనేత రంగాన్ని ప్రోత్సహించి నేతన్నల జీవితాల్లో వెలుగులు నింపాలని జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య అన్నారు. బుధవారం సిద్దవటం(మం) ఉప్పరపల్లిలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం యంత్రం నేసిన వస్త్రాల పోటీలో చేనేత రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని తెలిపారు. ప్రభుత్వం చేనేత కార్మికులకు మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని కోరారు.

February 25, 2026 / 08:11 PM IST

సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి సహకరిస్తా

SRD: సదాశివపేట మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు పూర్తి సహకారం అందిస్తానని జిల్లా ఇంఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు. టీజీఐఐసీ చైర్ పర్సన్ నిర్మల రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్మన్ అంజమ్మ వైస్ చైర్మన్ రేణుకలు ఇంఛార్జ్ మంత్రి వివేక్‌ను బుధవారం కలిశారు. మంత్రి మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో పెండింగ్ పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు.

February 25, 2026 / 08:11 PM IST

ఏడుగురు పేకాటరాయుళ్ల అరెస్ట్

సత్యసాయి: అమడగూరు మండలం కొట్టువారిపల్లి వద్ద పోలీసులు బుధవారం నిర్వహించిన మెరుపు దాడుల్లో ఏడుగురు పేకాటరాయులు పట్టుబడ్డారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో డ్రోన్ కెమెరా సాయంతో నిఘా ఉంచి ఈ ఆపరేషన్ చేపట్టారు. నిందితుల నుంచి రూ. 2.54 లక్షల నగదు, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆరు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.

February 25, 2026 / 08:10 PM IST

పుష్కరాలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలి: కలెక్టర్

PDPL: 2027లో జిల్లాలో నిర్వహించే గోదావరి పుష్కరాలకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీహర్ష ఆదేశించారు. బుధవారం ఆయన సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పుష్కర దేశాలలో ఘాట్ నిర్మాణం, రోడ్డు విస్తరణ, లైట్లు, ఆలయాల అభివృద్ధి ప్రతిపాదనలు కట్టుదిట్టంగా సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు

February 25, 2026 / 08:10 PM IST

రైస్ మిల్లును తనిఖీ చేసిన జేసీ రాహుల్

W.G: పాలకోడేరు(మం) శృంగవృక్షంలో శివ సాయిలక్ష్మి రైస్ మిల్లును బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. రిజిస్టరు “ఎ” లో నమోదు చేసిన ధాన్యానికి, రైస్ మిల్లులో భౌతికంగా ఉన్న ధాన్యానికి ఏమైనా తేడాలు ఉన్నయా అని పరిశీలించారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాల ప్రకారం పనిచేయాలని సూచించారు.

February 25, 2026 / 08:09 PM IST

‘హిందువులపై దాడులను కాంగ్రెస్ ప్రోత్సహిస్తుంది’

TG: హిందువులపై మజ్లిస్ నేతలు దాడులు చేస్తున్నారని బీజేపీ చీఫ్ రాంచందర్ రావు ఆరోపించారు. హిందూ ఆలయాలపై దాడుల వెనుక ఎవరున్నారు? అని ప్రశ్నించారు. దాడులను ప్రోత్సహిస్తున్నది కాంగ్రెస్ కాదా? అని నిలదీశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవన్నారు.

February 25, 2026 / 08:09 PM IST