శ్రీవారి భక్తుల మనోభావాలను అందరూ గౌరవించాలని గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు పేర్కొన్నారు. అసెంబ్లీలోకి స్వామివారి ఫొటోలు తీసుకురావడంపై ఆయన విచారం వ్యక్తం చేశారు. దేవుడి చిత్రపటాలను అవమానపరచకూడదని, ఇది భక్తుల నమ్మకాలకు సంబంధించిన విషయమని హితువు పలికారు. ముఖ్యంగా ప్రసాదాల నాణ్యత, పవిత్రత విషయంలో భక్తుల్లో పూర్తిస్థాయిలో విశ్వాసాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
NRML: ప్రజలు అపరిచిత వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని కడెం ఎస్సై సాయికిరణ్ సూచించారు. కడెం మండలంలోని అంబర్పేట్ గ్రామపంచాయతీ ఆవరణలో అపరిచితుల గురించి సైబర్ నేరాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఆయన మాట్లాడుతూ.. బైక్ నడిపేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని గ్రామంలోకి ఎవరైనా అపరిచిత వ్యక్తులు వచ్చినట్లయితే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.
NTR: మాచవరం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న దిలీప్ కుమారుడికి అనారోగ్యం నిమిత్తం ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఈ మేరకు 20 లక్షలు నగదు అవసరం అయింది. విషయం తెలుసుకున్న సెంట్రల్ ఏసీపీ దామోదర్ సజ్జ కిషోర్, చారిటబుల్ ట్రస్ట్తో మాట్లాడి ఏడు లక్షల నగదును శనివారం ఇప్పించారు. ఈ మేరకు బాలుడికి ఆపరేషన్ చేయించనున్నట్లు సమాచారం.
PPM: గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలో గల భద్రగిరి 50 పడకల ఆసుపత్రికి సీసీ రోడ్డు నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రూ.7 లక్షల 65 వేల NREGS నిధులతో చేపట్టిన రోడ్డు పనులు చివరి దశకు వచ్చాయని ఐటీడీఏ ఏఈఈ సింగంపల్లి అప్పారావు తెలిపారు. రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తున్నామని వెల్లడించారు. రహదారి పనులు పూర్తయిన వెంటనే ప్రారంభిస్తామన్నారు.
PLD: వినుకొండ విచ్చేసిన సీఎం చంద్రబాబుకు శనివారం ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. ముఖ్యంగా పట్టణంలో స్టేడియం నిర్మాణానికి రూ. 50 కోట్లు కేటాయించాలని, అలాగే పెండింగ్లో ఉన్న ఇతర సమస్యలను పరిష్కరించాలని సీఎంను కోరారు.
RR: శేరిలింగం పల్లి నియోజకవర్గం హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని అలీ తలాబ్ చెరువు వద్ద ఉన్న తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కాలేజీలో క్షత్రియ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో పదవ తరగతి, జూనియర్ ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షల కిట్ (జామెట్రీ బాక్స్, ప్యాడ్, కలములు) విద్యార్థులకు మాజీ కార్పొరేటర్ నర్నె శ్రీనివాస్ రావు అందచేశారు.
ASR: ముంచంగిపుట్టులోని స్థానిక వారపు సంతను అగ్రికల్చర్ మార్కెట్ ఛైర్మన్ బోరి బోరి లక్ష్మి శనివారం పరిశీలించారు. కనీస వసతులు లేక ఎండ, వానలకు ఇబ్బందులు పడుతున్నామని రైతులు, వ్యాపారులు ఆమె ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే సంతలో తాగునీరు, మరుగుదొడ్ల సౌకర్యం కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అప్పలస్వామి, పోతురాజు, సుబ్బారావు పాల్గొన్నారు.
VZM: టీడీపీ కార్యాలయంలో ఇవాళ కూటమి నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున మాట్లాడుతూ.. MLC బొత్స సత్యనారాయణ ఎపీ శాసన మండలిలో చెప్పులు వేసుకుని వెంకటేశ్వరస్వామి ఫోటోని చేత్తో పట్టుకున్నామని నిరూపిస్తే రాజీనామా చేస్తామన్నారు. కౌన్సిల్ వీడియో రికార్డ్లో అది నిరూపణ అయింది. కావున రాజీనామ చేయాలని వారు డిమాండ్ చేశారు
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి సమక్షంలో 21వ డివిజన్, ఎన్టీవో కాలనీకి చెందిన కోడూరు రవి, ఖాదర్ బాష, ప్రవీణ్ వారి మిత్రబృందం టీడీపీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కోటంరెడ్డి సోదరులు సాదరంగా ఆహ్వానించారు. నూతనంగా చేరిన వారికి తగు ప్రాధాన్యత ఉంటుందన్నారు
CTR: చిత్తూరు నగరంలోని నాగయ్య కళాక్షేత్రంలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన జాబ్ మేళాను ఎంపీ దగ్గుమళ్ళ ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ భవిష్యత్తుకు పునాది వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ అముద, చూడ ఛైర్పర్సన్ హేమలత తదితరులు పాల్గొన్నారు.
AP: వేంకటేశ్వరస్వామి తమ ఇంటి దైవమని సీఎం చంద్రబాబు తెలిపారు. వేంకటేశ్వరస్వామి స్వయంగా తనను కాపాడారని చెప్పారు. అలాంటి స్వామివారిని అపవిత్రం చేస్తే ఊరుకోనని తేల్చి చెప్పారు. లడ్డూ కల్తీ చేసి హెరిటేజ్ పేరు తీసుకొస్తున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. తాను ప్రాణం పోయినా తప్పు చేయనని తేల్చి చెప్పారు.
NZB: బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయంలో శనివారం ముగ్గురు బీజేపీ కౌన్సిలర్లు ప్రమాణ స్వీకారం చేశారు. సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఆధ్వర్యంలో 11వ వార్డు కౌన్సిలర్ కొలిపాక రేణుక బాలరాజు, 29వ వార్డు కౌన్సిలర్ రాజులదేవి లక్ష్మీ పూజిత పవన్ కుమార్, 33వ వార్డు కౌన్సిలర్ గుంత అబ్బవ్వ గంగాధర్ పదవీ బాధ్యతలు చేపట్టారు.
NZB: బోధన్ పట్టణంలోని ఫైర్ స్టేషన్ ఎదురుగా శనివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం ప్రకారం.. నిజామాబాద్ మాణిక్ బండార్కు చెందిన రాజ్ కుమార్ కాలినడకన వెళ్తుండగా వెనక నుంచి వచ్చిన ఆటో బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతడికి 108 సిబ్బంది ప్రాథమిక చికిత్స అందించి, జిల్లా ఆస్పత్రికి తరలించారు.
శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా సవరణలపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో పరిపాలన అధికారి లక్ష్మినారాయణ అధ్యక్షతన ఆర్డీవో కార్యాలయంలో శనివారం సమావేశం జరిగింది. ఆయన మాట్లాడుతూ మరణించిన , రెండుసార్లు నమోదైన 324 ఓట్లను ఫారం–7 ద్వారా తొలగించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
KDP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కడప జిల్లాలో పలుచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.