TG: రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రమాదంలో మరణించినవారికి రూ.కోటీ 25 లక్షలు ఇవ్వాలని, అలాగే 65 ఏళ్లలోపు ఏ ఉద్యోగైనా సహజ మరణంతో చనిపోతే వారికి రెగ్యులర్ బెనిఫిట్స్తో పాటు అదనంగా రూ.10 లక్షలు ఇచ్చే స్కీమ్ తీసుకురావాలని నిర్ణయించినట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు తెలిపారు.
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి తెరకెక్కిస్తున్న ‘ఫౌజీ’ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రం ఇప్పటికే 70 శాతం చిత్రీకరణను పూర్తి చేసుకుంది. రాబోయే షెడ్యూల్లో 20 నిమిషాల పాటు సాగే ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ను షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది సినిమాకే ప్రధాన హైలైట్గా నిలవబోతుందట. ప్రభాస్ ఆర్మీ ఆఫీసర్గా కనిపిస్తుండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి.
BDK: హైదరాబాద్ బంజారాహిల్స్ ఏసియన్ అరోరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దమ్మపేట మాజీ సొసైటీ ఛైర్మన్ యెల్లిన రాఘవరావుని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ సోమవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి వైద్యులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలను పరిశీలించారు. అత్యుత్తమ వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.
TG: ఉపకార వేతనాల మంజూరుకు ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. 2025-26కు సంబంధించిన దరఖాస్తు చేసుకున్న అర్హులైన విద్యార్థులు.. దరఖాస్తు ఫారాలను వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ అధికారి జిల్లా కార్యాలయాల్లో సమర్పించాలి.
ప్రకాశం: మార్కాపురం కలెక్టరేట్లో రోడ్డు ఏర్పాటుకై MRPS రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి సాలెంరాజ్ ఆధ్వర్యంలో సోమవారం నిరసన చేపట్టారు. కంభంలో 100 కుటుంబాలు నివాసముంటున్న మదర్ తెరిసా కాలనీకి రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కారం అయ్యేంతవరకు నిరసన ఆపేది లేదని అధికారులతో వాదించారు. కనిగిరి RDO ప్రాంతాన్ని పరిశీలిస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
NZB: రుద్రూర్ మండలం అంబంలోని మోడల్ స్కూల్లో అదనపు తరగతి గదులకు ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భూమి పూజ చేశారు. మోడల్ స్కూల్ భవన ప్రాంగణంలో నాలుగు అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేపట్టారు. ఈ కార్యక్రమంలో బోధన్ సబ్ కలెక్టర్, రుద్రూర్ తహ’సీల్దార్తో పాటు ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
GNTR: అమరావతి సచివాలయంలో కొత్తగా ఎంపికైన 31 మంది జూనియర్ అసిస్టెంట్లకు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న సిబ్బంది నిజాయితీగా, నిబద్ధతతో పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
కృష్ణా: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి నిత్యాన్నదాన పథకానికి గుంటూరు భక్తులు విరాళం అందచేశారు. చెన్నంశెట్టి వెంకటేశ్వరరావు రూ.1,02,555లు చెక్కు రూపంలో దేవస్థానం సూపరింటెండెంట్ అచ్యుత మధుసూధనరావుకు అందచేశారు. దాతలను ఆలయ మర్యాదలతో సత్కరించారు.
శీతల పానీయాలు తాగడం వల్ల గ్యాస్ తగ్గుతుందని అనుకోవడం పొరపాటని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వీటిలోని చక్కెర, కెఫిన్ వల్ల ఆమ్లత్వం మరింత పెరుగుతుంది. కడుపు ఉబ్బరం తగ్గాలంటే కూల్డ్రింక్స్కు దూరంగా ఉండాలి. దీనికి బదులుగా చల్లని పాలు లేదా సోంపు గింజలు తీసుకుంటే గుండెల్లో మంట నుంచి ఉపశమనం లభిస్తుందని సూచిస్తున్నారు.
TG: తెలంగాణ మావోయిస్టు కేడర్ లొంగిపోయేందుకు సిద్ధమైంది. రేపు రాష్ట్ర DGP శివధర్ రెడ్డి ఎదుట దేవోజీ@తిప్పిరి తిరుపతి, మల్లారాజిరెడ్డి చుక్కారావు@దామోదర్, నున్నె నరసింహారెడ్డి సహా మొత్తం 18 మంది ఆయుధాలను విడిచిపెట్టనున్నారు. దీంతో తెలంగాణ మావోయిస్టు రహిత రాష్ట్రంగా మారనుండగా.. దీనిపై రేపు DGP అధికారిక ప్రకటన చేయనున్నారు.
NGKL: అర్హులైన ప్రతి జర్నలిస్టుకు షరతులు లేకుండా, పారదర్శకంగా అక్రిడిటేషన్ కార్డులు మంజూరు చేయాలని TWJF జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ బదవత్ సంతోష్కు సోమవారం వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టుల సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా అధ్యక్షుడు పరిపూర్ణం, వెంకటస్వామి, పరమేశ్ కోరారు.
పైనున్న చిత్రం భాగ్యనగరపు నడిబొడ్డున వెలిసిన అందమైన దృశ్యంలా ఉంది. చారిత్రక చార్మినార్ రాత్రివేళ కాంతులతో మెరిసిపోతుంటే, దాని ముందు గాలిలో తేలుతున్న ఎర్రని బెలూన్లు ప్రేమానురాగాలకు సజీవ సాక్ష్యంగా నిలుస్తున్నాయి. చీకటిని చీల్చుకుంటూ ఆ బెలున్లు పాతబస్తీ సంస్కృతికి ఆధునిక ప్రేమ సందేశాన్ని జోడించాయి. ఈ చిత్రం HYD ఆప్యాయతను, చారిత్రక సౌందర్యాన్ని ఒకే ఫ్రేమ్లో బంధించింది.
RR: హైడ్రా ప్రజావాణి కార్యక్రమంలో పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాల ఆక్రమణలపై ప్రజల నుంచి సోమవారం మొత్తం 59 వినతులు అందాయి. హయత్నగర్, అమీన్పూర్, మియాపూర్ వంటి ప్రాంతాల్లో లేఅవుట్ స్థలాలను ప్లాట్లుగా మారుస్తున్నారని బాధితులు కమిషనర్ రంగనాథ్కు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులపై తక్షణమే స్పందించిన కమిషనర్, సంబంధిత అధికారులకు విచారణకు ఆదేశించారు.
ఖమ్మం నగరపాలక సంస్థలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం ద్వారా పౌర కేంద్రీకృత పాలన దిశగా కీలక అడుగు పడింది. గౌరవ మేయర్ నీరజ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి ఫిర్యాదులను నేరుగా స్వీకరించి, వాటిని సమర్థవంతంగా పరిష్కరించడంపై దృష్టి సారించారు. ప్రజలతో స్వయంగా ముఖాముఖి నిర్వహించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
TG: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తమిళనాడులో పర్యటించారు. ఈ సందర్భంగా మైన్ క్లోజర్ జాతీయ సదస్సులో పాల్గొన్నారు. నేవేలీ లిగ్నయిట్ కార్పొరేషన్ ఇండియాను సందర్శించారు. అలాగే బటర్ఫ్లై పార్కును ప్రారంభించారు. అనంతరం శాస్త్రవేత్తలతో రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తవ్వకంపై చర్చించారు. మైన్ క్లోజర్ జాతీయ ప్రాధాన్యత అంశం అని పేర్కొన్నారు.