• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఉమామహేశ్వర క్షేత్రానికి 1800 ఏళ్ల చరిత్ర

NGKL: అచ్చంపేట మండలంలో కొలువుదీరిన ఉమామహేశ్వర క్షేత్రం 1800 ఏళ్ల సుదీర్ఘ చరిత్రకు సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది. క్రీ.శ. 2వ శతాబ్దంలో మౌర్య చంద్రగుప్తుని కాలంలోనే ఈ ఆలయ నిర్మాణం జరిగినట్లు చరిత్రకారులు పేర్కొంటున్నారు. 13వ శతాబ్దంలో కాకతీయ సామంతుల కాలంలో ఈ ప్రాంతం మరింత ప్రాచుర్యం పొందింది. శ్రీశైల మల్లికార్జున స్వామికి ‘ఉత్తర ద్వారం’గా పేరుగాంచింది.

February 25, 2026 / 04:33 PM IST

మంత్రాలయంలో జనసేనలో 25 కుటుంబాల చేరిక

KRNL: కౌతాళం(మం) అగసులదిన్నె గ్రామానికి చెందిన 25 కుటుంబాలు ఇవాళ వాల్మీకి బీ.లక్ష్మన్న ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా లక్ష్మన్న పార్టీ కండువాలు వేసి సభ్యులను ఆహ్వానించారు. DY.CM పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి పార్టీలో చేరుతున్నట్లు వారు తెలిపారు. పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు.

February 25, 2026 / 04:32 PM IST

అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన ఎంపీడీవో

కృష్ణా: గుడ్లవల్లేరు మండలం కౌతవరం గ్రామం లోని అంగన్వాడీ కేంద్రాన్ని ఎంపీడీవో ఇమ్రాన్ బుధవారం సందర్శించారు. అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అందిస్తున్న పోషకాహారం, హాజరు నమోదు, శుభ్రత సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో ఎంపీడీవో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు, సహాయక సిబ్బంది పాల్గొన్నారు.

February 25, 2026 / 04:32 PM IST

‘అమ్మలాంటి తెలుగు భాషను మరవొద్దు’

GNTR: పిల్లలే రాష్ట్ర భవిత… రేపటి చరిత్ర సృష్టించేది నేటి విద్యార్థులే” అని విద్యా మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. అమ్మలాంటి మాతృభాష తెలుగును ఎప్పటికీ మరవొద్దని సూచించారు. అసెంబ్లీని సందర్శించేందుకు వచ్చిన సత్తెనపల్లి నియోజకవర్గం సుగాలి జెడ్పీ హైస్కూలు విద్యార్థులతో బుధవారం అసెంబ్లీ లాబీలో మంత్రి స్నేహపూర్వకంగా ముచ్చటించారు.

February 25, 2026 / 04:31 PM IST

‘పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి’

KNR: వచ్చే నెల 14 నుంచి పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ ఉంచాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే ఉపాధ్యాయులకు సూచించారు. చింతకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను బుధవారం అడిషనల్ కలెక్టర్ సందర్శించి 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. పరీక్షలు సమీపిస్తున్నందున రోజు విధిగా పాఠశాలకు రావాలని సూచించారు.

February 25, 2026 / 04:30 PM IST

ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తుంది

E.G: ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడిచేందుకు చూస్తుందని నిడదవోలు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మేడవరపు బద్రం దొర విమర్శించారు. బుధవారం నిడదవోలు మండలం కలవచర్లలో ఉపాధి హామీ కూలీలకు పథకం గురించి వివరించారు. ఉపాధి హామీ పథకాన్ని యధావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:29 PM IST

నాలుగు రాష్ట్రాల్లో కొత్త రైల్వే లైన్లు!

రైల్వే నెట్‌వర్క్ విస్తరణకు కేంద్ర ప్రభుత్వం రూ.9,072 కోట్లతో మూడు భారీ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. మహారాష్ట్ర, MP, బీహార్, జార్ఖండ్‌లలో 307 కి.మీ. మేర కొత్త ట్రాకులు నిర్మించనున్నారు. 2030-31 నాటికి వీటిని పూర్తి చేయాలనేది లక్ష్యం. దీనివల్ల కీలక మార్గాల్లో రైళ్ల రద్దీ తగ్గి, సరుకు రవాణా మరింత వేగంగా, సులభంగా మారుతుందని అధికారులు భావిస్తున్నారు.

February 25, 2026 / 04:28 PM IST

ఇప్పటి వరకు రూ.8.30 కోట్లతో అభివృద్ధి: కోటంరెడ్డి

నెల్లూరు: రూరల్ నియోజకవర్గంలో 247 పనులు ప్రారంభించామని, వాటిలో ఇప్పటికే 187 పనులు పూర్తి చేశామని టీడీపీ నేత గిరిధర్ రెడ్డి బుధవారం వెల్లడించారు. 23వ డివిజన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.8.30 కోట్లతో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామన్నారు. ఏమైనా సమస్యలు ఉంటే స్థానికులు తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు.

February 25, 2026 / 04:26 PM IST

కలెక్టరేట్ ముందు తెలంగాణ జాగృతి ధర్నా

KNR: కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ TG జాగృతి ఆధ్వర్యంలో KNR కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. నెలకు రూ.2500 ఆర్థిక సాయం, తులం బంగారం, విద్యార్థినులకు స్కూటీల పంపిణీ ఏమైందని నేతలు ప్రశ్నించారు. 26 నెలలు గడిచినా బడ్జెట్ సాకులు చెప్పడం సరికాదని, హామీలు నెరవేర్చకుంటే CM నివాసాన్ని ముట్టడిస్తామన్నారు.

February 25, 2026 / 04:26 PM IST

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెడతారా?: గెల్లు శ్రీనివాస్

ADB: కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అవినీతిని ప్రజల పక్షాన ప్రశ్నిస్తే బీఆర్ఎస్ పార్టీ నేతలపై కేసులు పెడతారా అని తెలంగాణ BRSV రాష్ట్ర నాయకుడు గెల్లు శ్రీనివాస్ అన్నారు. జిల్లా జైల్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను బుధవారం పరామర్శించిన అనంతరం ఆయన మాట్లాడారు. BRS నాయకులపై ఎన్ని కేసులు పెట్టిన వెనుకడుగు వేసేది లేదని హెచ్చరించారు.

February 25, 2026 / 04:25 PM IST

జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా: CM

AP: మార్కాపురం జిల్లా దోర్నాలలో సీఎం చంద్రబాబు పర్యటించారు. వెలిగొండ ప్రాజెక్ట్ ఫీడర్ కెనాల్ దగ్గర.. రూ.456 కోట్లతో ఆధునీకరించిన ఫీడర్ కెనాల్‌ను ప్రారంభించారు. అనంతరం సీఎం ఫీడర్ కెనాల్ వెంట నడుచుకుంటూ రైతులతో మాట్లాడారు. ‘మార్కాపురం జిల్లా చేస్తానని చెప్పా.. మాట నిలబెట్టుకున్నా. మార్కాపురం, మదనపల్లి, పోలవరం జిల్లాలు చేశాను’ అని పేర్కొన్నారు.

February 25, 2026 / 04:24 PM IST

దుప్పిని ఖననం చేసిన ఫారెస్టు అధికారులు

కడప-కర్నూలు జాతీయ రహదారిలోని చెన్నముక్కపల్లె వద్ద కారు ఢీకొని మృతి చెందిన దుప్పిని డీఎఫ్‌వో ఆదేశాల మేరకు ఎల్బీవో శాంతి మంగళవారం ఖననం చేశారు. పశువైద్య అధికారి ఎం.లక్షుమయ్య మరణించిన దుప్పికి పరీక్షలు నిర్వహించిన అనంతరం ఖననం చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్వాచర్ నవీన్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

February 25, 2026 / 04:23 PM IST

భక్తుల మనోభావాలను గౌరవిస్తాం: కేంద్ర మంత్రి

BDK: మణుగూరులోని చారిత్రాత్మక శ్రీ కాళీమాత ఆలయ తరలింపు మరియు పునఃప్రతిష్ఠా పనులపై కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి బుధవారం సానుకూలంగా స్పందించారు. BTPS రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా 55 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయం తొలగింపుకు గురవుతున్న నేపథ్యంలో, ఆలయ కమిటీ విన్నపాన్ని పరిశీలించి ఆలయ తరలింపుకు అయ్యే ఖర్చులు నిబంధనల ప్రకారం అందిస్తామని సూచించారు.

February 25, 2026 / 04:22 PM IST

తిరుమల శ్రీవారి వస్త్రాలు ఈ-వేలం

TPT: తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన పవిత్ర వస్త్రాలను టీటీడీ మార్చి 02 నుంచి ఆన్‌లైన్‌లో ఈ-వేలం వేయనుంది. ఈ వేలం మార్చి 09 వరకు కొనసాగుతుంది. వివిధ రకాల వస్త్రాల 287 లాట్లను కొనుగోలు చేయడానికి భక్తులు https://konugolu .ap.gov.in వెబ్సైట్ ద్వారా పాల్గొనవచ్చు. మరిన్ని వివరాలకు టీటీడీ కార్యాలయంలో సంప్రదించవచ్చు.

February 25, 2026 / 04:22 PM IST

ఉచిత మెగా వైద్య శిబిరం

SDPT: కోహెడ మండలంలోని తంగళ్లపల్లిలో నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకున్నారని సర్పంచ్ బోయిని సంపత్ తెలిపారు. 250 మందికి బీపీ, షుగర్ పరీక్షలు చేసి దాదాపు రూ.20 వేల విలువైన మందులు ఉచితంగా పంపిణీ చేశారు. డా. జయంత్, డా. సాయి శ్రీ ఆధ్వర్యంలో పరీక్షలు జరిగాయి. అనంతరం హాస్పిటల్ యాజమాన్యాన్ని సన్మానించారు.

February 25, 2026 / 04:21 PM IST