అల్లూరి జిల్లాలోని, గ్రామ పంచాయతీల్లో ఇంటింటా చెత్త సేకరణ కోసం స్వచ్ఛభారత్-స్వచ్ఛాంధ్రలో భాగంగా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ నుంచి 4 ఈ-ఆటోలు, 25 ట్రై సైకిళ్లు జిల్లాకు వచ్చాయని అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్ శుక్రవారం తెలిపారు. ఐటీడీఏ కార్యాలయంలో ఆర్డీవో లోకేశ్వరరావు, స్వర్ణ గ్రామ-స్వర్ణ వార్డు శాఖ జిల్లా నోడల్ అధికారి పీఎస్ కుమార్తో కలిసి ప్రారంభించారు.
NZB: భీంగల్ మున్సిపల్ పట్టణంలో డ్రైనేజీలలో మురికి పేరుకుపోవడం వల్ల దోమల బెడద అధికమవుతోందని, దీనివల్ల ప్రజలు డెంగ్యూ వంటి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ కౌన్సిలర్లు తెలిపారు. ఈ నేపథ్యంలో వెంటనే డ్రైనేజీల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లేలా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పలు వార్డుల్లో చెత్త పేరుకుపోయి ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు.
ప్రకాశం: పామూరులో శుక్రవారం వాహనాలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. దర్శి మోటార్ వాహనాల తనిఖీ అధికారి రవికుమార్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో పత్రాలు సరిగా లేని వాహనాలను పరిశీలించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడుపుతున్న ఐదు ఎలక్ట్రిక్ ఆటోలకు పెనాల్టీ విధించి సీజ్ చేశారు. ఎంవీఐ రవికుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలన్నారు.
విశ్వక్ సేన్ ‘ఓరి దేవుడా’ సినిమాతో మిథిలా పాల్కర్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు ఆమె ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్తో ‘భూత్ బంగ్లా’లో నటించే చాన్స్ కొట్టేసింది. ఈ చిత్రంలో ఆమె తన చెల్లెలి పాత్రలో కనిపిస్తుందని అక్షయ్ తెలిపాడు. ప్రియదర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం మే 15న గ్రాండ్గా విడుదల కానుంది.
TG: మెదక్ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కౌడిపల్లి మండలి తిమ్మాపూర్ గేటు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఆ తర్వాత పక్కనే వెళ్తున్న బైకును ఢీకొట్టాయి. బైకుపై వెళ్తున్న దంపతులకు కాళ్లు విరిగాయి. పరిస్థితి విషమంగా ఉంది. రెండు కార్లలో ఉన్న 11 మందికి తీవ్ర గాయాలుకాగా.. వారిని నర్సాపూర్ ఆస్పత్రికి తరలించారు.
HNK: క్రీడలతోనూ ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ అన్నారు. వాగ్దేవి కళాశాల క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో క్రీడాకారులకు దిలీప్ రాజ్ టీ-షర్టులను అందజేశారు. విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉంటూ సరైన మార్గంలో ప్రయాణిస్తూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో ఉండాలని దిలీప్ రాజ్ అన్నారు.
VSP: భారతీయ రైల్వే వాల్తేయిర్ డివిజన్ ఆధ్వర్యంలో వైశాఖి రైల్వే కాలనీలో నిర్మించిన అధికారుల కొత్త వసతి గృహాన్ని డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా, జ్యోత్స్న బోహ్రా శుక్రవారం ప్రారంభించారు. నివాస సముదాయంలో నాలుగు టైప్–వీ, ఒక టైప్–VI క్వార్టర్ యూనిట్లు నిర్మించగా, సివిల్ ఇంజనీరింగ్ విభాగం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేసింది.
TPT: తిరుపతి పట్టణ ప్రణాళిక విభాగంలో పెండింగ్లో ఉన్న కోర్టు కేసులను త్వరగా పరిష్కరించాలని కమిషనర్ N. మౌర్య, అధికారులను ఆదేశించారు. శుక్రవారం జరిగిన సమావేశంలో, B.P.S, L.R.S దరఖాస్తులపై కూడా చర్చించారు. అలాగే పిటిషన్ దారులు, న్యాయవాదులతో సంప్రదింపులు జరపాలని కమిషనర్ సూచించారు.
CTR: కార్వేటి నగరంలో ఎమ్మెల్యే డాక్టర్ థామస్ శనివారం పర్యటిస్తారని ఆయన కార్యాలయం ఒక ప్రకటనలు తెలిపింది. పర్యటనలో భాగంగా ఉదయం 10 గంటలకు కార్వేటినగరం పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో స్వచ్ఛ రథం ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమానికి కూటమి నాయకులు హాజరై విజయవంతం చేయాలని కోరారు.
NZB: తెలంగాణ యూనివర్సిటీలో జరుగుతున్న బీటెక్ మొదటి సెమిస్టరు పరీక్షలు నేటితో ముగిశాయి. శుక్రవారం ఉదయం జరిగిన పరీక్షకు 71 మంది విద్యార్థులకు గాను 71 మంది విద్యార్థులు హాజరైనట్లు ఆడిట్ సెల్ డైరెక్టర్ ఆచార్య ఘంటా చంద్రశేఖర్ తెలిపారు. పరీక్షలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించడంలో కృషి చేసిన సిబ్బందిని వర్సిటీ ఉన్నతాధికారులు అభినందించారు.
కృష్ణా: పెనమలూరు బీసీ సెల్ అధ్యక్షుడు సంగేపు రంగారావు, ప్రధాన కార్యదర్శి వనకూరు విక్రమ్,కమిటీ సభ్యులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీసీ సెల్ కమిటీ ఆధ్వర్యంలో అవసరమైన ప్రతి ఒక్కరికి కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో చేరేలా కృషి చేయాలన్నారు.
NRPT: సంత్ సేవాలాల్ జయంతి సందర్భంగా ఊట్కూరు మండలంలోని తిమ్మారెడ్డిపల్లి తండాలో గిరిజనులు నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి వాకిటి శ్రీహరి, కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ వినీత్ రాజు పాల్గొన్నారు. మంత్రి మాట్లాడుతూ.. గిరిజన సమాజ అభ్యున్నతి కోసం సేవాలాల్ చేసిన కృషి ఎంతో గొప్పదని కొనియాడారు. ఈ ఉత్సవాల్లో భారీ సంఖ్యలో గిరిజనులు పాల్గొన్నారు.
KRNL: పేదల సంక్షేమానికి అత్యధికంగా నగదు బదిలీ పథకం విజయవంతంగా అమలు చేస్తున్న ఘనత ఏపీ రాష్ట్రానికే దక్కుతుందని ఆదోని MLA పార్థసారథి ఇవాళ అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు. సీఎం చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తొలి ఏడాదిలోనే అమలు చేసి చూపించారన్నారు. గత YCP ప్రభుత్వంలో జల్ జీవన్ మిషన్ కింద రూ. 26 వేల కోట్లు వృథా చేశారన్నారు.
టీ20 ప్రపంచకప్లో సెమీస్ చేరే జట్లేవో భారత్ మాజీ క్రికెటర్లు అంచనా వేశారు. భారత్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు సెమీస్కు చేరతాయని తెలిపారు. ప్రస్తుత ఆటగాళ్ల ఫామ్, టీమ్ బ్యాలెన్స్ ఆధారంగా ఈ నాలుగు జట్లు ఫేవరెట్లుగా కనిపిస్తున్నాయని వారు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా టీమిండియా ఈసారి కచ్చితంగా ఫైనల్ చేరుతుందని ధీమా వ్యక్తం చేశారు.
RR: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరిగూడ శివారులో నివసిస్తున్న పోచమ్మ గత కొద్ది రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు మహేష్ గౌడ్ వారి నివాసానికి వెళ్లి కుటుంబాన్ని పరామర్శించారు. పోచమ్మ అంత్యక్రియలకు రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు.