• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

JGL: భీమారం మండలం కమ్మరిపేట గ్రామానికి చెందిన కోటగిరి రాజేందర్ అనే వ్యక్తి ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. 15 సంవత్సరాలుగా కడుపు నొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుని భార్య భారతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

February 28, 2026 / 05:46 AM IST

గణితాన్ని సులువైన పద్ధతిలో బోధించాలి: రాజర్షి షా

ADB: గణితాన్ని సులువైన పద్ధతిలో బోధిస్తే విద్యార్థులు ఆసక్తి చూపుతారని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ పాఠశాలలో ‘ఫస్ట్ ఇన్ మ్యాథ్స్’ పేరుతో వినూత్న పైలెట్ ప్రాజెక్టును ఆయన నిన్న ప్రారంభించారు. విద్యార్థులు లెక్కలను కేవలం పరీక్షల కోసం కాకుండా, జీవిత నైపుణ్యాలుగా అభివృద్ధి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

February 28, 2026 / 05:41 AM IST

కల్తీ పాల ఘటన.. 11మంది పరిస్థితి విషమం

E.G: కల్తీ పాల ఘటనలో రాజమండ్రిలోని వివిధ హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్న 15 మందిలో 11 మంది బాధితుల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ మేరకు శుక్రవారం రాత్రి వైద్య ఆరోగ్యశాఖ తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. నలుగురు రోగుల పరిస్థితి సాధారణంగానే ఉన్నట్లు వెల్లడించింది. కాగా 11 మంది రోగులకు ఇప్పటికీ వెంటిలేటర్ పైనే చికిత్స అందిస్తున్నట్లు పేర్కొంది.

February 28, 2026 / 05:30 AM IST

తాడిపత్రి అభివృద్ధిపై సీఎం అభినందన

ATP: తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్‌ను కలిశారు. మున్సిపాలిటీలో సోలార్ ప్లాంట్ ద్వారా నెలకు రూ. 22 లక్షల విద్యుత్ బిల్లు ఆదా అవుతున్నట్లు వివరించారు. స్మశానవాటిక అభివృద్ధి, నూతన షాపింగ్ కాంప్లెక్స్ పనుల నమూనాలను అందజేయగా, సీఎం అభినందించారు.

February 28, 2026 / 05:30 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 13 మందికి జైలు శిక్ష

కాకినాడ ట్రాఫిక్ 1,2 పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి 41 మంది మద్యం తాగినట్లు గుర్తించామని ట్రాఫిక్ వన్ సీఐ నూని రమేష్ తెలిపారు. వీరిని శుక్రవారం కాకినాడ కోర్టులో ప్రవేశపెట్టినట్లు తెలిపారు. వీరిలో 13 మందికి రెండు నుంచి ఐదు రోజుల జైలుశిక్ష, 28 మందికి రూ.10వేల వంతున జరిమానా విధించారని సీఐ తెలిపారు.

February 28, 2026 / 05:30 AM IST

కాళేశ్వరంపై విచారణకు లేఖ రాయాలని డిమాండ్

KNR: కాంగ్రెస్, మజ్లిస్ పార్టీలు పైకి వేరుగా కనిపించినా లోపల ఒకటేనని బండి సంజయ్ విమర్శించారు. కరీంనగర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల ముందు కాళేశ్వరం అవినీతి గురించి మాట్లాడిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ విచారణ ప్రారంభించలేదన్నారు. రాష్ట్రం విచారణకు సిద్ధమైతే కేంద్రం ముందుకు వస్తుందని, సీఎం అధికారికంగా లేఖ రాయాలని కోరారు.

February 28, 2026 / 05:29 AM IST

మరణంలోనూ ఇద్దరికీ పునర్జన్మ

JGL: రాయికల్ పట్టణం శివాజీ నగర్‌కు చెందిన చొప్పదండి నర్సయ్యను ఈనెల 23న గుర్తు తెలియని వాహనం ఢీకొనగా, చికిత్స నిమిత్తం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన ‘బ్రెయిన్ డెడ్’కు గురయ్యారు. మృతుడి భార్య ఆండాలు, కుమారుడు సురేశ్ అంగీకారంతో నర్సయ్య కు చెందిన లివర్, ఊపిరితిత్తులను దానం చేసి, మరణంలోనూ నర్సయ్య మరో ఇద్దరి ప్రాణాలకు జీవం పోశారు.

February 28, 2026 / 05:15 AM IST

ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌గా శ్రీనివాస్

KNR: ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పెద్దపల్లి జిల్లా కన్వీనర్‌గా కొలిపాక శ్రీనివాస్ ను నియమించినట్లు రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజి రెడ్డి ప్రకటించారు. ఈ నియామకం తక్షణ ప్రభావంతో అమల్లోకి వచ్చిందని, పార్టీ బలోపేతం లక్ష్యంగా ఈ నియామకం చేపట్టినట్లు పేర్కొన్నారు. మండల, పట్టణ, గ్రామ స్థాయి కమిటీలను సమన్వయం చేసి పార్టీ కార్యక్రమాలను వేగవంతం చేయాలన్నారు.

February 28, 2026 / 05:11 AM IST

‘మాదకద్రవ్యాల రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం’

సత్యసాయి: కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ అధ్యక్షతన జిల్లా స్థాయి ఎన్కార్డ్ సమీక్ష సమావేశం జరిగింది. ఎస్పీ సతీష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్న ఈ సభలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా నివారణపై చర్చించారు. యువతలో అవగాహన పెంచాలని, విద్యాసంస్థల్లో ప్రత్యేక నిఘా ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. ఆధునిక సాంకేతికతతో నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

February 28, 2026 / 05:09 AM IST

బి-జోన్ క్రికెట్ పోటీలు ఉత్కంఠ భరితం

PDPL: మంథని JNTU ఇంజనీరింగ్ కళాశాలలో బీ-జోన్ క్రికెట్ పోటీలు రెండో రోజు రసవత్తరంగా సాగాయి. కొత్తగూడెం అకిట్స్ ఇంజనీరింగ్ కళాశాల రెండు విజయాలతో సెమీఫైనల్కు అర్హత సాధించింది. బిట్స్పై లక్ష్యాన్ని ఛేదించి గెలిచిన అకిట్స్ జట్టు, ట్రినిటీపై కూడా ఆధిపత్యం చాటింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులను సింగరేణి ఆర్జీ3 ఏరియా పర్యావరణాధికారి రాజిరెడ్డి ప్రదానం చేశారు.

February 28, 2026 / 04:58 AM IST

అన్నదాతలకు యాప్ కష్టాలు

SRCL: గంభీరావుపేట మండలంలోని రైతులను యూరియా ‘యాప్’ కష్టాలు వెంటాడుతున్నాయి. సాంకేతిక ఇబ్బందులతో యూరియా దొరక్క అన్నదాతలు అల్లాడుతున్నారు. స్మార్ట్ ఫోన్లు లేకపోవడం ఒక సమస్య అయితే, పట్టాదారు పాస్బుక్కులకు ఫోన్ నంబర్లు అనుసంధానం కాకపోవడం మరో అడ్డంకిగా మారింది. యాప్ ద్వారా ఎరువులు ఎలా పొందాలో తెలవక ఇబ్బందులు పడుతున్నారు.

February 28, 2026 / 04:41 AM IST

ఓల్డ్ హై స్కూల్ విద్యార్థి అక్షయ్ ప్రతిభ

KNR: కౌమార విద్య, HIV, AIDS పైన విద్యార్థులలో అవగాహన కల్పించుటకు జిల్లా స్థాయిలో నిర్వహించిన పోస్టర్ మేకింగ్ పోటీలలో కరీంనగర్ ప్రభుత్వ పురాతన ఉన్నత పాఠశాల 9th విద్యార్థి కుంచం అక్షయ్ కుమార్ ద్వితీయ బహుమతి సాధించారు. జిల్లా అదనపు పరిపాలనాధికారి అశ్వినీ తానాజీ వాకడే, క్వాలిటీ కో ఆర్డినేటర్ అశోక్ రెడ్డి, జిల్లా సైన్స్ అధికారి చేతుల మీదుగ అందుకున్నారు.

February 28, 2026 / 04:26 AM IST

ప్రేమ పేరుతో మోసం

SRCL: సోషల్ మీడియా పరిచయం పెళ్లి మోసానికి దారి తీసిన ఘటన వేములవాడ పట్టణంలో చోటుచేసుకుంది. శుక్రవారం పట్టణ సీఐ బి. వీరప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన ఓ మహిళకు విజయవాడకు చెందిన వంశీ అనే వ్యక్తి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయమై పెళ్లి చేసుకుంటానని నమ్మబలికాడు. అనంతరం ఇద్దరూ వేములవాడకు వచ్చి ఓ లాడ్జ్‌లో గది తీసుకున్నారు.

February 28, 2026 / 04:15 AM IST

బీజేపీలో చేరిన సీనియర్ వైద్యులు

JGL: కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ వైద్యులు, డాక్టర్ వై. అనూప్ రావు భారతీయ జనతా పార్టీలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అర్వింద్, JGL అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబుల సమక్షంలో శుక్రవారం చేరారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో చేపట్టిన కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పార్టీ కండువా కప్పుకున్నారు.

February 28, 2026 / 04:12 AM IST

ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ‘శుక్రవారం’ సభ

KNR: చొప్పదండి మండలం పెద్దకుర్మపల్లె అంగన్వాడీ సెంటర్‌లో ఐసీడిఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. సర్పంచ్ మవురం సుగుణ అధ్యక్షత వహించగా సీడీపీఓ నర్సింగరాణి హాజరై మాట్లాడుతూ.. ఎత్తుకు, వయసుకు తగ్గ బరువు లేని పిల్లలకు పౌష్టికాహారం అందించాలని తల్లులకు వివరించారు. అనంతరం గర్భిణీలకు సీమంతాలు నిర్వహించి మహిళా సాధికారత గురించి తెలిపారు.

February 28, 2026 / 04:06 AM IST