• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

శాసనమండలిలో గందరగోళం

AP: శాసనమండలిలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది. మహిళలకు రూ.1500 ఇచ్చే స్త్రీ నిధి పథకం ఏమైందని వైసీపీ ప్రశ్నించింది. ఈ సందర్భంగా MLC వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలకు ఏడాదికి రూ.18 వేలు ఏమయ్యాయని ప్రశ్నించింది. దీనికి ప్రభుత్వం తరపున మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమాధానమిస్తూ.. సూపర్ సిక్స్ హామీలను ప్రభుత్వం అమలు చేస్తోందని, ఒక్కొక్కటిగా అన్ని హామీలు అమలు చేస్తామన్నారు.

February 25, 2026 / 03:20 PM IST

మహా నగరానికి ‘ఆరెంజ్ అలర్ట్’

HYD: నగరంలో వాతావరణం మారిపోయింది. బుధవారం ఉదయం భానుడు ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నానికి ఆకాశం మేఘావృతమై వర్షం కురిసే సంకేతాలు కనిపిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో నగరానికి వాతావరణ శాఖ ‘ఆరెంజ్ అలర్ట్’ జారీ చేసింది. ఉష్ణోగ్రత 29°Cగా నమోదైనట్లు తెలిపింది. సాయంత్రం వేళ వర్షం పడే అవకాశం ఎక్కువగా ఉంది.

February 25, 2026 / 03:20 PM IST

భక్తి మార్గంలో పయనించాలి: MLA

ADB: చెడు వ్యసనాలకు దూరంగా ఉండి భక్తి మార్గంలో పయనించాలని MLA అనిల్ జాదవ్ కోరారు. గుడిహత్నూర్ మండలంలోని పలు గ్రామాల్లో బుధవారం నిర్వహించిన బోగ్ బండార కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై స్థానికులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్తులందరూ కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం గొప్ప విషయమని అనిల్ జాదవ్ పేర్కొన్నారు.

February 25, 2026 / 03:20 PM IST

రైలు నుంచి జారిపడి వృద్ధురాలు మృతి

TPT: నాయుడుపేట, దొరవారిసత్రం రైల్వే స్టేషన్ల మధ్య బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వృద్ధురాలు ప్రమాదవశాత్తు జారిపడి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న తిరుచ్చి టికెట్ ఆధారంగా ఆమెది తమిళనాడుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

February 25, 2026 / 03:20 PM IST

గ్రామాలలో ఎఫ్ఎల్ఎన్ సర్వే

MNCL: లక్షెట్టిపేట మండలంలోని ఎల్లారం, వెంకట్రావుపేట, చందారం గ్రామాలలో రెండో తరగతి విద్యార్థులకు ఎఫ్ఎల్ఎన్ అసైన్మెంట్ సర్వేను నిర్వహించారు. బుధవారం ఫీల్డ్ విజిటర్లు ఆయా గ్రామాలలో పర్యటించి సర్వేను చేపట్టారు. కార్యక్రమంలో వెంకట్రావుపేట కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయురాలు పర్వీన్ సుల్తానా, ఉపాధ్యాయురాలు శ్రీదేవి, సిఆర్పి విద్య, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లు ఉన్నారు.

February 25, 2026 / 03:20 PM IST

ఘనంగా ప్రారంభమైన పారా బాడ్మింటన్ పోటీలు

VZM: పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 7వ రాష్ట్ర స్థాయి పారా బాడ్మింటన్ పోటీలు బుధవారం స్థానిక రాజీవ్ ఇండోర్ స్టేడియంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ పోటీలకు ముఖ్య అతిధిగా రోటరీ మాజీ గవర్నర్ డాక్టర్. ఎం. వెంకటేశ్వరరావు హాజరై పోటీలను ప్రారంభించారు. వైకల్యం శరీరానికే తప్పా సంకల్పానికి కాదని దివ్యాంగ క్రీడాకారులు నిరూపిస్తున్నారని అన్నారు.

February 25, 2026 / 03:19 PM IST

‘జిల్లాలో ఇంటర్ పరీక్షకు 97 శాతం హాజరు’

PDPL: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం మొదటి రోజు పరీక్షకు 97 శాతం మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి కల్పన తెలిపారు. మొత్తం 5419 మంది విద్యార్థులు హాజరు కావలసి ఉండగా 5271 మంది విద్యార్థులు హాజరైనట్లు తెలిపారు. 148 మంది గైర్హాజర్ అయినట్లు పేర్కొన్నారు. పరీక్ష ప్రశాంతంగా జరిగిందని తెలిపారు.

February 25, 2026 / 03:19 PM IST

అధ్వానంగా ఏకమామిడి రహదారి

VKB: ఏకమామిడి గ్రామ రహదారి అధ్వానంగా మారడంతో ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తున్నారు. కంకర తేలిన రోడ్డుపై వాహనాలు వెళ్లే సమయంలో విపరీతమైన దుమ్ము లేస్తోంది. దీనివల్ల వాహనదారులు ప్రమాదాలకు గురవ్వడమే కాకుండా స్థానికులు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి గుంతలమయమైన ఈ రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని, వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.

February 25, 2026 / 03:19 PM IST

మొదటిరోజు ఎందరు హాజరయ్యారంటే..?

VKB: తాండూరులో ఇంటర్ పరీక్షలు మొదటి రోజు ప్రశాంతంగా జరిగాయి. ఇవాళ 2,553 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 57 మంది గైర్హాజరైనట్లు కస్టోడియన్లు మల్లినాథప్ప, కృష్ణయ్య తెలిపారు. మిగతా 2,496 మంది విద్యార్థులు పరీక్షలు రాశారన్నారు. జనరల్ విభాగంలో 1,969 మందిలో 33 మంది గైర్హాజరుతో 1,936 మంది పరీక్షలు రాశారు.

February 25, 2026 / 03:18 PM IST

పారిశుధ్య పనులను తనిఖీ చేసిన మున్సిపల్ కమిషనర్

KMM: ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య నగరంలోని అల్లిపురం తదితర ప్రాంతాల్లో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ (UGD) పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పనుల్లో నాణ్యత, మన్నిక విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని తెలిపారు.

February 25, 2026 / 03:18 PM IST

‘మీటర్ రీడర్స్‌కు న్యాయం చేయండి’

W.G: విద్యుత్ మీటర్ రీడర్స్‌కు ఎస్ర్కో అకౌంట్ ద్వారా వేతనాలు చెల్లించాలని, విద్యుత్ మీటర్ రీడర్స్‌కు పీఎఫ్, ఇఎస్ఐ అమలు చేయాలని కోరుతూ.. ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జేసీకి వినతి పత్రం అందచేశారు. వేతనాల చెల్లింపులో పీఎఫ్, ఇఎస్ఐ అమలులో కాంట్రాక్టర్లు తీవ్ర అవినీతికి పాల్పడుతూ మీటర్ రీడర్స్‌కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని పేర్కొన్నారు.

February 25, 2026 / 03:18 PM IST

27న నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం

E.G: ఈ నెల 27న నిడదవోలు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఛైర్మన్ భూపతి ఆదినారాయణ బుధవారం తెలిపారు. ఈ సమావేశం ఆరోజు ఉదయం 11 గంటల నుంచి ప్రారంభమవుతుందన్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించిన వివిధ అంశాలను ఎజెండా రూపంలో సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. సభ్యులు వివిధ శాఖల అధికారులు హాజరు కావాలని కోరారు.

February 25, 2026 / 03:17 PM IST

ఇంటర్ పరీక్షకు 96.51% హాజరు

SKLM: జిల్లాలో బుధవారం నిర్వహించిన ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఇంగ్లీష్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఈ పరీక్షకు మొత్తం 21,101 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా, 20,364 మంది విద్యార్థులు హాజరైనట్లు జిల్లా ఆర్ఎ ఓ ఆర్. సురేష్ తెలిపారు.మొత్తం 737 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షకు 96.51 శాతం హాజరు నమోదైందని వెల్లడించారు.

February 25, 2026 / 03:16 PM IST

గుండెపోటుతో రైతు మృతి

KNR: జమ్మికుంట మండలం జగ్గయ్యపల్లి గ్రామంలో బుధవారం విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన రైతు గుజ్జ గోపాలరావు (45) తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి నీటి పరిస్థితిని పరిశీలిస్తున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటుకు గురయ్యాడు. ఈ క్రమంలో పొలంలోనే కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు వెళ్లేసరికే ప్రాణాలు వదిలాడు.

February 25, 2026 / 03:15 PM IST

జమ్మలమడుగులో బైక్ దొంగలు అరెస్ట్

KDP: బైక్ దొంగలను అరెస్ట్ చేసి, వారి నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని రూరల్ సీఐ భాస్కర్రెడ్డి తెలిపారు. స్థానిక అర్బన్ పోలీస్టేషన్‌లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. కోవెలకుంట రోడ్డులో వాహనాల తనిఖీ చేస్తుండగా అనుమానంగా ఉన్న వ్యక్తులను పట్టుకుని విచారించామన్నారు. ఈ సందర్భంగా వారి వద్ద నుంచి 16 బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

February 25, 2026 / 03:14 PM IST