SKLM: గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. ఆదివారం మంత్రి తన కార్యాలయంలో అధికారులతో మాట్లాడారు, అన్ని గ్రామాల్లో రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలు,తాగునీరు పథకం అమలులో ఎక్కడా ఆలస్యం జరగకుండా చూడాలని సూచించారు. ఇందులో ఆర్డీవో కృష్ణమూర్తి, అధికారులు సుదాకర్, తదితరులు పాల్గొన్నారు.
NZB: ధర్పల్లి మండల కేంద్రంలోని పెద్దిరాజు సహిత పెద్దమ్మతల్లి ఆలయ 27వ వార్షికోత్సవాలు మార్చి 11 నుంచి మూడు రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నట్లు ముదిరాజ్ సంఘం ప్రతినిధులు తెలిపారు. ప్రతి ఏడాది సంప్రదాయబద్ధంగా సాగే ఈ వేడుకలకు ముదిరాజ్ సంఘం సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. గ్రామస్థులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకోవాలన్నారు.
ATP: రైతులకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం అన్నారు. గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం రైతులు చేపట్టిన దీక్షకు ఆదివారం ఎమ్మెల్యే మద్దతు తెలిపారు. అసెంబ్లీలో గళం విప్పి 12 చెరువులకు నీరు తెప్పించే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. అనంతరం రైతులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.
BHPL: రేగొండ మండలంలోని ప్రసిద్ధ కోటంచ శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయాన్ని ఆదివారం BJP జిల్లా అధ్యక్షుడు నిషిధర్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం నూతనంగా ఆలయ ఛైర్మన్గా బాధ్యతలు చేపట్టిన సంపత్ రావును శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో BJP నేతలు తదితరులు ఉన్నారు.
VKB: దుద్యాల మండల కేంద్రం నుంచి సాగారంతండా వరకు రోడ్డు విస్తరణ పనులు చేపట్టిన అధికారులు అసంపూర్తిగా పనులు వదిలివేయడంతో ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. కంకర పరిచి వదిలివేయడంతో దుమ్మూధూళి కళ్లల్లో పడి ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. దీంతో అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులను వెంటనే పూర్తి చేయాలని కోరుతున్నారు.
NRML: కడెం మండలం ఉడుంపూర్ గ్రామాన్ని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ సందర్శించారు. వారికి కడం మండల బీజేపీ అధ్యక్షుడు కాశవేణి శ్రీనివాస్ యాదవ్, గ్రామ పెద్దలు సంప్రదాయ బద్ధంగా గొంగడి వేసి, గొర్రె పిల్లను అందించి ఘన స్వాగతం పలికారు. కడం నుంచి కల్లెడ గ్రామం వరకు ప్రతిపాదిత ఎత్తిపోతల పథకాన్ని ఉడుంపూర్ వరకు విస్తరించి నీటి సరఫరా కల్పించాలన్నారు.
MDK: తూప్రాన్ పట్టణ మున్సిపల్ పరిధి పడాలపల్లి (11వ వార్డు) యాదవ సంఘం అధ్యక్షుడిగా పెద్దగొల్ల లంబ మల్లేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. పడాలపల్లి యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నిక కార్యక్రమం చేపట్టారు. యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు గండి చిలుక మల్లేష్ యాదవ్ ముఖ్య అతిథిగా విచ్చేయగా ఎన్నిక కార్యక్రమం చేపట్టారు.
NDL: గోస్పాడు మండలం బాబానగర్ వద్ద 18 ఎకరాల్లో నిర్మించిన ‘శ్రీ గురురాజా ఇంటర్నేషనల్ స్కూల్’ను రాష్ట్ర మంత్రి ఎన్ఎండీ ఫరూక్ ఆదివారం ప్రారంభించారు. 24వ వార్షికోత్సవం ‘ప్రవాహ్’ సందర్భంగా జరిగిన ఈ కార్యక్రమంలో డా. పి.దస్తగిరి రెడ్డి మాట్లాడుతూ.. రాయలసీమ విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్య అందించడమే లక్ష్యమన్ని పేర్కొన్నారు.
SKLM: లావేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ పద్మావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆదివారం శ్రీకాకుళం లో డయేరియా కేసులపై పరిశీలించేందుకు వచ్చిన ఆమె తిరుగు ప్రయాణంలో అకస్మాత్తుగా లావేరు పీహెచ్సీని సందర్శించారు. స్థానిక కేంద్రాల్లో అందుబాటులో ఉన్న సేవలను మౌలిక వసతులను స్వయంగా పరిశీలించారు. రోగులకు సరైన సమయంలో సేవలు అందించాలన్నారు.
W.G: బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శిగా శృంగవృక్షం గ్రామానికి చెందిన సబ్బతి దానియేలు నియమితులయ్యారు. కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆదేశాలతో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి ఈ నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని దానియేలు పేర్కొన్నారు.
ASF: కాగజ్ నగర్ పట్టణంలోని గాయత్రి మందిరంలో గత 2 రోజులుగా జరుగుతున్న 24 కుండముల గాయత్రి మహా యజ్ఞ పూర్ణాహుతి కార్యక్రమంలో MLA హరీష్ బాబు ఆదివారం పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. గాయత్రి పరివారం గొప్ప ఆధ్యాత్మిక సమూహంగాఎదిగి ప్రజల్లో వైదిక, ఆధ్యాత్మిక సౌరభాలను పెంపొందిస్తుందని తెలియజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
PPM: అంగన్వాడీ ఉద్యోగుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రభుత్వ విప్, కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి తెలిపారు. వేతనాల పెంపు, గ్రాట్యుటీ, స్మార్ట్ఫోన్ల పంపిణీ, మినీ కేంద్రాల అప్గ్రేడ్ వంటి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని ఆమె వెల్లడించారు.
VZM: గజపతినగరం మండలంలోని గుడివాడ నీలగిరి తోటలో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామానికి చెందిన నడిమింటి గాంధీకి చెందిన తోటలో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 15 వేల రూపాయలు ఆస్తి నష్టం సంభవించింది. అజాగ్రత్తగా పొగ త్రాగడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. గజపతినగరం ఆగమాపకం అధికారి రవి ప్రసాద్ సిబ్బందితో వెళ్లి మంటల్లో అదుపు చేశారు.
NLG: ప్రజల హక్కుల కోసం నిరంతర పోరాటమే మార్గమని ఆదర్శంగా నిలిచిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి అని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు. ఆదివారం నాడు శ్రీనివాస్ రెడ్డి 44వ వర్ధంతి సందర్భంగా ఆయన స్థూపం వద్ద జరిగిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలో ఎర్రజెండాలతో ర్యాలీని శ్రీనివాస్ రెడ్డి స్తూపం వరకు నిర్వహించారు.