TG: రాష్ట్రంలో మార్చి 2 నుంచి నాలుగు దశల్లో హెల్త్ మిషన్ -100ను ప్రభుత్వం స్పెషల్ డ్రైవ్గా నిర్వహించనుంది. విజన్ 2047 పాలసీలో భాగంగా యాక్షన్ ప్లాన్ తయారు చేశారు. మాతాశిశు, వృద్దుల ఆరోగ్యం, క్యాన్సర్ కేర్, వ్యాధులు, అర్బన్, ట్రైబల్ ఏరియాల్లో ఆరోగ్య సేవలపై దృష్టి సారించింది.
NLR: బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని 11 వార్డులో గుడిపల్లి కాలువపై నిర్మించనున్న కల్వర్టు రిటైనింగ్ వాల్ నిర్మాణానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పట్టణ నాయకులు స్వాగతం పలికారు. 50 లక్షల రూపాయలతో కల్వర్టు రిటైనింగ్ నిర్మిస్తున్నామని చెప్పారు. బుచ్చి పట్టణాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
VKB: అనంతగిరి రిజర్వ్ ఫారెస్ట్లో ఎండాకాలం ప్రభావంతో వన్యప్రాణులకు ఆహార కొరత తీవ్రంగా మారింది. అడవిలో తిండి దొరకక కోతులు గుంపులు గుంపులుగా రోడ్లపైకి చేరుతున్నాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని అటవీ మార్గాల్లో వాహనదారులు, పర్యాటకుల వద్ద ఆహారం కోసం అవి ఎదురుచూస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. మూగజీవాల రక్షణకు చర్యలు తీసుకోవాలని జంతు ప్రేమికులు కోరుతున్నారు.
KNR :గంగాధర మండలం ఉప్పరమల్యాల గ్రామ పంచాయితీలో గురువారం రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ రైతు గుర్తింపు కార్డు గురించి వ్యవసాయ అధికారులు రైతులకు అవగాహన కలిపించారు. వ్యవసాయ భూమి కలిగిన ప్రతి రైతు ఫార్మర్ రిజిస్ట్రీని ఫిబ్రవరి 28 వరకు నమోదు చేసుకోవాలని రైతులకు వ్యవసాయ అధికారులు సూచించారు. ఈ కార్యక్రమంలో AEO వెంకట్, సర్పంచ్ ముద్దం నగేష్, రైతులు పాల్గొన్నారు.
BPT: వీధి కుక్కల సమస్యపై వచ్చిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. కుక్కల సంఖ్య నియంత్రణ కోసం జంతు జనన నియంత్రణ (ABC) మరియు రేబిస్ నిరోధక టీకాలు (ARV) కార్యక్రమాలను వేగవంతం చేయాలని తెలిపారు.
MDCL: మేడిపల్లిలోని విష్ణుపురి కాలనీ పార్క్ నిరుపయోగంగా తయారైంది. పార్క్లో చిన్న పిల్లలు ఆడుకునే పరికరాలు విరిగిపోయి శిథిలావస్థకు చేరుకున్నాయి. పార్క్లో చెట్లకు నీరు లేక ఎండిపోయి, పార్క్ పరిసరాలు చెత్త చెదారంతో నిండిపోయి ఇబ్బందిగా తయారయ్యాయి. పార్క్ దుస్థితిని అధికారులు, పాలకులు పట్టించుకుని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.
SRD: సంగారెడ్డి జిల్లాలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో 5వ తరగతి ప్రవేశం కోసం ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కోఆర్డినేటర్ బహుమతి శుక్రవారం తెలిపారు. 4వ తరగతి చదువుతున్న విద్యార్థులు నేరుగా మైనార్టీ గురుకుల పాఠశాలలో దరఖాస్తులు చేసుకోవాలని చెప్పారు. 60 సీట్లు మైనార్టీలకు, 20 సీటు నాన్ మైనార్టీలకు కేటాయించినట్లు పేర్కొన్నారు.
AP: మున్సిపాలిటీలతోపాటు గ్రామ పంచాయతీలకూ LRS, BPSల కింద వచ్చిన ఆదాయంలో వాటా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. LRS కింద గ్రామాల్లో వచ్చే ఆదాయంలో పంచాయతీలకు 50%, పట్టణాభివృద్ధి, ప్రణాళికా విభాగాలకు 50% ఇవ్వనున్నారు. BPS కింద గ్రామీణ ప్రాంతాల్లో వచ్చిన ఆదాయంలో పంచాయతీలకు 70% ఇస్తారు.
SRPT: మునగాల మండలం గణపవరం గ్రామంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు నాయకులు వేదికపై కూర్చోగా.. కోదాడ ఆర్డివో సూర్యనారాయణకు మాత్రం కుర్చీ లేక వారి వెనక నిలబడాల్సి వచ్చింది. నాయకుల తీరుపై రెవెన్యూ అధికారులు నిరసన వ్యక్తం చేశారు.
NRPT: రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా మక్తల్లో ‘అరైవ్-అలైవ్’ రెండో విడత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఎస్ఐ భాగ్యలక్ష్మి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు 80 మంది ఆటో టాక్సీ డ్రైవర్లకు ఉచిత కంటి వైద్య పరీక్షలు చేశారు. డ్రైవర్లు ఆరోగ్యంపై ముఖ్యంగా కంటి చూపుపై శ్రద్ధ వహిస్తేనే ప్రమాదాలు తగ్గుతాయని ఎస్ఐ సూచించారు. భద్రతా నియమాలను కచ్చితంగా పాటించాలని ఆమె కోరారు.
సత్యసాయి: ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మంత్రి సత్యకుమార్ యాదవ్ అందజేశారు. మొత్తం 14 మంది బాధితులకు రూ. 6,49,171 విలువైన చెక్కులను పంపిణీ చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలకు ఈ నిధులు ఎంతో ఆసరాగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఈ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
కోనసీమ: వాడపల్లి శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శుక్రవారం ఉదయం ప్రకృతి రమణీయత భక్తులను మంత్రముగ్ధులను చేసింది. దట్టమైన మంచు తెరలను చీల్చుకుంటూ ఉదయించిన భానుడి తొలి కిరణాలు ఆలయ రాజగోపురం, శిఖరంపై పడి బంగారు వర్ణంలో ధగధగలాడాయి. ఈ అద్భుత దృశ్యాన్ని తిలకించిన భక్తులు తమ చరవాణుల్లో ఈ సుందర దృశ్యాలను బంధించి సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
BHNG: మోత్కూరు మండలంలోని బుజిలాపురం గ్రామ సమీప ప్రధాన రహదారిపై శుక్రవారం ఉదయం భారీ కొండచిలువ ప్రత్యక్షమై కలకలం రేపింది. సుమారు 20 కిలోల బరువున్న ఈ భారీ సర్పం రోడ్డుపై వెళ్తుండగా వాహనదారులు, స్థానికులు గమనించి భయాందోళనకు గురయ్యారు. ఈ సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
GDWL: అలంపూర్ నియోజకవర్గం వడ్డేపల్లి మండలం జూలకల్లు గ్రామ సమీపంలోని శివాలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది. తెలంగాణతో పాటు ఆంధ్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్సవంలో నంది కోళ్ల సేవ ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భక్తులను ఆకట్టుకుంది. గుంత రంగయ్య శెట్టి, రఘు యాదవ్, రాజశేఖర్ తదితరులు పాల్గొని స్వామివారికి సేవలు అందించారు.