BDK: కొత్తగూడెం నుంచి ఖమ్మం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన ఒక ప్రమాదకర మలుపు వరుస రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. ముఖ్యంగా షీ టీమ్ పోలీస్ స్టేషన్ ఎదురుగా హైవేపై ఏర్పాటు చేసిన ఈ మలుపు వాహనదారులకు ముప్పుగా మారింది. ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు ముందస్తు హెచ్చరిక బోర్డులు, లేని కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఇవాళ వాపోయారు.
TG: ఇంటర్ పరీక్షలు FEB 25 నుంచి జరగనున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు సెల్ ఫోన్లు, క్యాలిక్యులేటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లను పరీక్షా హాల్లోకి తీసుకెళ్లకూడదు. మాల్ప్రాక్టీస్కు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేస్తారు. పరీక్షల సమయంలో విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురైతే 14416 అనే టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించాలి.
AP: తాము చెప్పులు విడిచే నిరసన చేసినట్లు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. అసలు అపచారం చేస్తున్నది ఎవరు? అని ప్రశ్నించారు. ‘మేం దేవుడి ఫొటోలు విసిరేశామని అబద్ధాలు చెప్పారు. వాస్తవాలు తెలియాలంటే ఫుటేజ్ బయటకు రావాలి’ అని డిమాండ్ చేశారు. అలాగే, ‘సభ్యుల హక్కులు హరించేలా కౌన్సిల్ విధానాలు ఉన్నాయి. టీడీపీకి అనుకూలంగా ఉన్న వీడియోలో బయటకొచ్చాయి’ అని MLC తోట పేర్కొన్నారు.
MHBD: తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా ఊడుగుల ఐలయ్య యాదవ్ నియమితులయ్యారు. తీన్మార్ మల్లన్న ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పల్లెబోయిన అశోక్ ముదిరాజ్ రాష్ట్ర కార్యాలయంలో వారికి సోమవారం నియామక పత్రం అందజేశారు. పార్టీ బలోపేతం కోసం నిరంతరం కృషి చేస్తానని ఐలయ్య అన్నారు. నియామకానికి సహకరించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు.
AKP: అచ్యుతాపురం మండలం పూడిమడకలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బాల్య వివాహ నిర్మూలన అవగాహన కార్యక్రమం సోమవారం జరిగింది. గ్రామస్తులు, తల్లిదండ్రులు, అంగన్వాడీలు, మహిళా సంఘాలు, చిన్నారులు పాల్గొని బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ సుహాసిని బాలికల ఆరోగ్యం క్షీణించకూడదని, ఎవరు బాల్యవివాహాలను ప్రోత్సహించరాదు అని హెచ్చరించారు.
అనంతపురంలోని SSBN కళాశాల ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ జగదీష్ తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును ఆయన సమీక్షించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మాల్ ప్రాక్టీస్ జరగకుండా పకడ్బందీ నిఘా ఉంచాలని అధికారులకు సూచించారు.
TG: రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ విద్యార్థులకు పరీక్షలు జరగనున్నాయి. 9AM నుంచి 12PM వరకు పరీక్షలను నిర్వహించనున్నారు. మొత్తం పరీక్షా కేంద్రాల వద్ద నిఘా కోసం సుమారు 7,500 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు.
AP: P3తో సంపద సృష్టిస్తున్నాము కానీ ఆర్థిక అసమానతలు తగ్గించలేకపోతున్నామని CM చంద్రబాబు అన్నారు. ‘పీ4తో రాష్ట్రాభివృద్ధి జరుగుతుంది. దీంతో ఆర్థిక అసమానతలు తగ్గుతాయి. 2047 నాటికి భారత్ అగ్రదేశంగా తయారవుతుంది. స్వర్ణాంధ్రప్రదేశ్లో ఆర్థిక అసమానతలు ఉండొద్దని ఈ ప్రయత్నం చేస్తున్నారు. గత ఎన్నికల్లో 90 శాతం విజయాన్ని మనకు అందించిన ప్రజల కోసం మనం కృషి చేయాలి’ అని తెలిపారు.
GDWL: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 82 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదులను పెండింగ్ ఉంచకూడదని కలెక్టర్ సూచించారు.
MBNR: జిల్లా వ్యాప్తంగా పోలీస్ స్టేషన్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారంలో అధికారలు నిర్లక్ష్యం వహించకూడదని జిల్లా ఎస్పీ జానకి అన్నారు. పోలీసు ప్రజావాణి సందర్భంగా జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. నేడు పోలీసు ప్రజావాణికి 19 ఫిర్యాదులు వచ్చినట్టు ఎస్పీ వెల్లడించారు.
AP: తిరుమల లడ్డూ కల్తీ అంశంపై ఈ నెల 26న మండలిలో చర్చ జరుగుతుందని MLC బొత్స సత్యానారాయణ వెల్లడించారు. ఇందాపూర్ సంస్థ రూ.560 ఇచ్చే నెయ్యిని తిరుమలలో రూ.658లు ఇస్తున్నారు.హోల్సేల్ ధరతో పోలిస్తే తిరుపతి దేవస్థానానికి తక్కువ ధరకు రావాలి కానీ, రూ.100 అధికంగా ఎందుకు తీసుకుంటున్నారు. CM నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు చేసినందుకే మేము చర్చించాలని కోరుతున్నాం’ అని తెలిపారు.
BHPL: గోరికొత్తపల్లి మండల కేంద్రంలో కనీస వసతులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలం ఏర్పడి సంవత్సరకాలం దాటినా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ATM, బస్ సెంటర్ వంటి ప్రాథమిక సౌకర్యాలు ఏర్పాటు కాలేదు. వెంటనే స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ విషయాన్ని MLA దృష్టికి తీసుకెళ్లి కనీస వసతులు కల్పించాలని మండల ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
కాసేపట్లో మంత్రివర్గం భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రైతు భరోసా నిధులు విడుదలపై కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అలాగే, రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది.
దక్షిణాఫ్రికా చేతిలో భారత్ ఘోర ఓటమి పాలవ్వడంతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. ఈ ఓటమితో భారత్ -3.800 నెట్ రన్ రేట్తో గ్రూప్-1లో చివరి స్థానంలో ఉంది. దీనివల్ల భారత్ తన చివరి రెండు మ్యాచ్ల్లో గెలిచినప్పటికీ సెమీస్ చేరుతుందని ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే, వెస్టిండీస్ జట్టు దక్షిణాఫ్రికా, జింబాబ్వేలపై విజయం సాధించి మెరుగైన రన్ రేట్ సాధిస్తే సెమీస్ చేరుకుంటుంది.
ADB: నార్నూర్ మండల కేంద్రంలోని ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో వివిధ గ్రామాల నుంచి పలు సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను అధికారులు స్వీకరించారు. అన్ని సమస్యలను ఆయా శాఖల అధికారులకు వివరించి పరిష్కారమయ్యేలా చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో పుల్లారావు పేర్కొన్నారు.