• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నూకాలమ్మ ఆలయం వద్ద వేలంపాట

AKP: గొలుగొండ మండలం లింగంపేట నూకాలమ్మ అమ్మవారి కొత్త అమావాస్య జాతర సందర్భంగా తలనీలాలు, కొబ్బరి ముక్కలు పోగు చేసుకునే హక్కుకు సంబంధించి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. దేవాదాయశాఖ పర్యవేక్షణ అధికారి డి ఉమాదేవి, ఈవో సాంబశివరావు సమక్షంలో ఈ బహిరంగ పాట జరిగింది. సిహెచ్. శ్రీను రూ.66వేలకు పాటను ఖరారు చేసుకున్నారు.

March 2, 2026 / 04:18 PM IST

‘పర్యావరణ హిత హోలీ నిర్వహించుకోవాలి’

SDPT: రసాయనిక రంగుల వల్ల కలిగే హానిని నివారించేందుకు గజ్వేల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయన శాస్త్ర విభాగం, ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలో విద్యార్థులు వివిధ రకాల పూలతో సహజ సిద్ధమైన రంగులను తయారు చేసి ప్రదర్శించారు. వైస్ ప్రిన్సిపాల్ గణపతిరావు మాట్లాడుతూ.. చర్మవ్యాధులకు కారణమయ్యే రసాయనాలకు దూరంగా ఉండాలన్నారు.

March 2, 2026 / 04:18 PM IST

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ అందజేత

KNR: పోగొట్టుకున్న మొబైల్‌ను CEIR టెక్నాలజీ ద్వారా కనుక్కొని బాధితునికి అందించినట్లు కరీంనగర్ రూరల్ సీఐ నిరంజన్ రెడ్డి తెలిపారు. జనవరి 28న గంగాధర తిరుపతి అనే వ్యక్తి తన ఫోన్‌ను తీగలగుట్టపల్లిలో పోగొట్టుకున్నానని ఫిర్యాదు చేశాడు. CEIR టెక్నాలజీ ద్వారా జగిత్యాలలో ఉన్నట్లు కనుక్కొని ఫోన్ యజమాని తిరుపతికి అందించారు.

March 2, 2026 / 04:17 PM IST

ఈనెల 4న బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో గోవుల వేలం

KRNL: ఎమ్మిగనూరు మండలం బనవాసి కృషి విజ్ఞాన కేంద్రంలో ఈనెల 4న ఉదయం 10:30 గంటలకు పశువుల వేలం నిర్వహిస్తామని ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రాఘవేంద్ర చౌదరి, పశు విభాగ శాస్త్రవేత్త ఎంవీ నిరంజన్ రెడ్డి ఇవాళ తెలిపారు. 3 ఆవులు, ఒక ఎద్దు వేలం వేస్తున్నామని చెప్పారు. ఆసక్తి కలిగిన రైతులు వేలం పాటలో పాల్గొనాలన్నారు.

March 2, 2026 / 04:17 PM IST

పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన ఆర్డీవో

MDK: నర్సాపూర్ డివిజన్ కేంద్రంలోని ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాలను ఆర్డీవో రామకృష్ణ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించిన ఆయన, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో పరీక్ష గదుల్లో నిరంతర విద్యుత్ సరఫరా, తాగునీరు, అత్యవసర వైద్య సదుపాయాలు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

March 2, 2026 / 04:17 PM IST

సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు: జగన్

AP: రాష్ట్రానికి చెందిన వేలాది మంది గల్ఫ్‌లో ఉన్నారని మాజీ సీఎం జగన్ అన్నారు. ‘అందరినీ ప్రభుత్వం సురక్షితంగా తీసుకురావాలి. దీనిపై కేంద్రంతో సమన్వయం చేసుకోవాలి. ప్రత్యేక కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసి.. హెల్ప్‌లైన్ నంబర్లు అందుబాటులోకి తేవాలి. సంక్షోభ సమయంలో రాజకీయాలు వద్దు’ అని పేర్కొన్నారు.

March 2, 2026 / 04:16 PM IST

గ్రహణం ప్రభావం.. మాస కళ్యాణం రద్దు

NLG: నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గుట్టపై ఉన్న హరి-హర క్షేత్రమైన శ్రీ వారిజాల వేణుగోపాల స్వామి, శ్రీ పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానాలు మార్చి 3వ తేదీ ఉదయం 8 గంటల నుంచి మార్చి 4 ఉదయం 6 గంటల వరకు మూసివేస్తారు. 3న జరిగే పౌర్ణమి కళ్యాణం రద్దు చేయబడిందని, ఇది తిరిగి చైత్ర మాసంలో జరుగుతుందని ఛైర్మన్ మోహన్ రెడ్డి తెలిపారు.  

March 2, 2026 / 04:16 PM IST

రత్నవరంలో సైన్స్ దినోత్సవ వేడుకలు

SRPT: నడిగూడెం మండలంలోని రత్నవరం గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం నడిగూడెం మండల శాఖ సౌజన్యంతో జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు.

March 2, 2026 / 04:15 PM IST

BRS ట్రాప్‌లో బండి సంజయ్ పడొద్దు: చామల

TG: BRS ట్రాప్‌లో కేంద్రమంత్రి బండి సంజయ్ పడొద్దని కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సూచించారు. BRS స్క్రిప్ట్‌ను బండి సంజయ్ చదువుతున్నారన్నారు. పదేళ్లు BRS దోచుకుంటే BJP మౌనంగా ఉందన్నారు. BRSలో కుటుంబపాలన తప్ప శిక్షణా తరగతులు ఉండవన్నారు. రాహుల్‌పై చిల్లర విమర్శలు మానుకోవాలన్నారు.

March 2, 2026 / 04:14 PM IST

డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొన్న కార్పొరేషన్ ఛైర్మన్

RR: తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షులకు, గత పది రోజులుగా వికారాబాద్ జిల్లా, అనంతగిరి హిల్స్‌లో జరుగుతున్న రాజకీయ శిక్షణ కార్యక్రమాల ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ ఛైర్మన్, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా నర్సింహా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబును కలిసి పార్టీ పటిష్టత గురించి చర్చించారు.

March 2, 2026 / 04:13 PM IST

‘అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్లు’

VZM: అర్హులైన పాత్రికేయులంద‌రికీ అక్రిడేష‌న్ల‌ను మంజూరు చేస్తామ‌ని క‌లెక్ట‌ర్ ఎస్‌.రాంసుంద‌ర్ రెడ్డి అన్నారు. మొద‌టి విడ‌త మంజూరు చేసిన అక్రిడేష‌న్ కార్డుల‌ను త‌మ ఛాంబ‌ర్లో అక్రిడేష‌న్ క‌మిటీ స‌భ్యుల‌కు సోమ‌వారం ఆయన అంద‌జేశారు. మిగిలిపోయిన పాత్రికేయుల‌కు రెండో విడ‌త‌లో అక్రిడేష&zwn...

March 2, 2026 / 04:13 PM IST

‘జిల్లాలో 438 మంది గైర్హాజరు’

TPT: జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు సోమవారం జరిగాయి. జిల్లా 98 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 21,693 మంది విద్యార్థులకు గాను 21,255 మంది హాజరైనట్లు RIO రాజశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 438 మంది విద్యార్థులు పరీక్ష రాయలేదని చెప్పారు.

March 2, 2026 / 04:13 PM IST

ఆలయ పునః నిర్మాణానికి రూ.1,16,222 విరాళం

కోనసీమ: పి.గన్నవరం మండలంలోని లంకల గన్నవరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయ పునః నిర్మాణానికి గ్రామానికి చెందిన దివంగత పంతాల భాస్కరరావు కుటుంబ సభ్యులు రూ.1,16,222 విరాళాన్ని సోమవారం అందజేశారు. దాత కుటుంబ సభ్యులు ముందుగా స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం దాత కుటుంబ సభ్యులను ఆలయ పునః నిర్మాణ కమిటీ సభ్యులు, గ్రామస్తులు సత్కరించారు.

March 2, 2026 / 04:13 PM IST

శ్రీపాదరావు సేవలు చిరస్మరణీయం: స్పీకర్

VKB: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సభాపతి స్వర్గీయ డి.శ్రీపాదరావు సేవలు మరువలేనివని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొనియాడారు. సోమవారం అసెంబ్లీ ఆవరణలో శ్రీపాదరావు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్పీకర్ మాట్లాడుతూ.. శ్రీపాదరావు అందించిన ఉన్నతమైన సేవలు ఎందరికో స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

March 2, 2026 / 04:12 PM IST

ఏపూర్ పాఠశాలలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం

SRPT: ఆత్మకూరు ఎస్.మండలంలోని ఏపూర్ ప్రాథమిక పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ఉపాధ్యాయులు, అధికారులుగా బాధ్యతలు చేపట్టి సత్తా చాటారు. ప్రధానోపాధ్యాయురాలిగా దడిగల శ్రీవర్ష, కలెక్టర్‌గా ఎల్లుట్ల అంజలి, డీఈవోగా కత్తుల శృతి, ఎంఈవోగా ఎరుకల విష్ణువర్ధన్ వ్యవహరించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అధ్యాపకులు బహుమతులు అందజేశారు.

March 2, 2026 / 04:11 PM IST