ASP: అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, మహిళ డిగ్రీ కళాశాలల్లో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా జీరో లిట్టర్ గవర్నెన్స్పై విద్యార్ధులకు అవగాహన కల్పించారు. చెత్త రహిత రాష్ట్రంగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యమని ప్రిన్సిపాల్స్ డా కేబీకే నాయక్, చలపతిరావులు తెలిపారు. పరిసరాలను శుభ్రపరిచే భాద్యత అందరిదీ అని అన్నారు.
SRPT: యూరియా యూప్ నిబంధనలకు వ్యతిరేకంగా పాలకవీడు పీఏసీఎస్ కార్యాలయం ముందు బీఆర్ఎస్ నాయకుడు నవీన్ కుమార్ రైతులతో కలిసి వినూత్న రీతిలో శనివారం నిరసన తెలిపారు. మెడకు ఉరితాడు వేసుకొని ప్రభుత్వం తెచ్చిన కొత్త విధానంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెంటనే ప్రభుత్వం యాప్ రద్దుచేసి పాత పద్ధతిలో రైతులకు యూరియా అందించాలన్నారు.
మదనపల్లి పట్టణం నక్కలదిన్నె బీటీ కళాశాల మైదానంలో రూ.5 కోట్లతో ఇండోర్ స్టేడియం, మహిళలు-పురుషులకు వాకింగ్ ట్రాక్, జిమ్, పిల్లల కోసం చిన్న పార్క్ ఏర్పాటుపై అన్నమయ్య జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే ఎం. షాజహాన్ బాషా పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్తో పాటు అధికారులు పాల్గొన్నారు. ప్రతిపాదిత పనులపై అధికారులకు అవసరమైన సూచనలు చేశారు.
NDL: ద్రోణాచలం సేవాసమితి ఆధ్వర్యంలో చిన్నారి పునర్విక చికిత్స కోసం సాంజో స్కూల్ విద్యార్థులు రూ.24,997 విరాళం శనివారం అందజేశారు. విద్యార్థులు తమ ఖర్చు డబ్బులు, పొదుపు మొత్తాలను చందాలుగా సమీకరించి పెద్ద మనసును చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి స్కూల్ ప్రిన్సిపల్ సిస్టర్ అనేట్, యాజమాన్యం, ఉపాధ్యాయులు సహకరించారు. సేవాసమితి సభ్యులు విద్యార్థులను అభినందించారు.
W.G: తణుకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో ఎమ్మెల్యే రాధాకృష్ణ పాల్గొని అక్కడ బయో మెడికల్ వ్యర్థాల నిర్వహణ గురించి పరిశీలించడం జరిగింది. నాలుగు రంగుల చెత్త బుట్టలు-ఎరుపు, పసుపు, నీలం, తెలుపు ఏర్పాటు చేసి వచ్చిన వ్యర్థాలను తదనుగుణంగా తీసి సరైన పద్దతిలో డిస్పోజ్ చేసే విషయం గురించి పరిశీలించారు.
కోనసీమ: రాష్ట్రాన్ని చెత్త రహితంగా తీర్చిదిద్దడం, ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా ‘స్వచ్ఛ రథం’ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు అన్నారు. స్వచ్ఛ ఆంధ్ర-స్వర్ణ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా అల్లవరంలో శనివారం స్వచ్ఛ రథాన్ని ఎమ్మెల్యే జెండా ఊపి ప్రారంభించారు.
ATP: గుంతకల్లులోని భాష్యం విద్యా సంస్థ ఎదుట ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి వెంకటేష్ నాయక్ మాట్లాడుతూ.. కోర్సుల పేరిట అధిక ఫీజులు వసూలు చేస్తున్న చైతన్య, నారాయణ లాంటి కార్పొరేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని వారి డిమాండ్ చేశారు.
MNCL: కాసిపేట్ మండలం కొండాపూర్ వద్ద శనివారం ట్రాక్టర్-బైక్ ఢీకొన్న ప్రమాదంలో తుడుంగూడకు చెందిన చాకటి ఇస్ఫతికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడికి కుడి కాలు, చేయి విరగడంతో స్థానికులు 108కి సమాచారం అందించారు. వెంటనే స్పందించిన 108 సిబ్బంది EMT ఆత్మారావు, పైలట్ కొమురయ్య ప్రథమ చికిత్స అందించి, చికిత్స నిమిత్తం మంచిర్యాల జిల్లా ఆస్పత్రికి తరలించారు.
సత్యసాయి: హిందూపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు బాబావలి ఆధ్వర్యంలో ‘చలో విజయవాడ’ పోస్టర్లను శనివారం విడుదల చేశారు. ఈ నెల 27న జరిగే కార్యక్రమానికి విద్యార్థులు భారీగా తరలి రావాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. విద్యా సమస్యల పరిష్కారం కోసం పోరాడుతామని తెలిపారు.
KRNL: మంత్రాలయంలో MPDO నూర్జహాన్, MRO రమాదేవి ఆధ్వర్యంలో మంచాల సొసైటీ చైర్మన్ రామకృష్ణ రెడ్డి ఇవాళ ‘స్వచ్ఛరథం’ వాహనాన్ని ప్రారంభించారు. ఈ వాహనం గ్రామాల్లో ప్లాస్టిక్, స్క్రాప్ వంటి వ్యర్థాలను సేకరించి పర్యావరణ పరిరక్షణకు దోహదపడనుందని పేర్కొన్నారు. ‘శుభ్రమైన మండలం-అభివృద్ధి చెందిన మంత్రాలయం’ లక్ష్యంతో ఈ పనులకు శ్రీకారం పుట్టినట్లు పేర్కొన్నారు.
KKD: SP బిందుమాధవ్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ‘స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర’ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోటార్ ట్రాన్స్పోర్ట్ విభాగంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా SP మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను వివరించారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలోనూ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
BHPL: మంచి చేసేవారికి భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయని శాసనసభ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. రేగొండ మండలం కోడవటంచ గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ పునఃప్రతిష్ఠ మహోత్సవంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేవాలయ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం రూ.12.15 కోట్లు మంజూరు చేసిందని అన్నారు. చిన్న జీయర్ స్వామి, MLA గండ్ర ఉన్నారు.
ప్రియాంక చోప్రా తన చిన్నతనంలో జరిగిన ఓ భయానక ఘటనను గుర్తుచేసుకుంది. ’11ఏళ్ల వయసున్నప్పుడు, ఢిల్లీలో అర్ధరాత్రి 11 గంటలకు తల్లితో కలిసి క్యాబ్లో వెళ్తుండగా డ్రైవర్ రూట్ మార్చాడు. వెంటనే అప్రమత్తమైన అమ్మ, డ్రైవర్ గొంతు పట్టుకుని హెచ్చరించి.. మరీ మెయిన్ రోడ్డుకు వచ్చేలా చేసింది. బిడ్డను రక్షించుకోవాలన్న తపనలో అమ్మ చూపిన ఆ ధైర్యం మరువలేనిది’ అని పేర్కొంది.
GNTR: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలోని ఇంజినీరింగ్ కాలేజీకి ఉన్న మాజీ సీఎం డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరు మార్చడం దారుణమని వైసీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అన్నారు. శనివారం ANUలో VC గంగాధరరావును కలిసి వినతిపత్రం ఇచ్చి, 2009 పాలకమండలి తీర్మానాన్ని గౌరవించాలని కోరారు.
SRPT: మునగాల మండలం జగన్నాథపురం ప్రాథమికోన్నత పాఠశాలలో శనివారం అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల తెలుగు ఉపాధ్యాయుడు భరత్ బాబు మాట్లాడుతూ.. మాతృభాషలో విద్యనభ్యసించడం వల్ల విద్యార్థులకు జ్ఞాన సముపార్జన సులువుగా జరుగుతుందని, తద్వారా సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని తెలిపారు.