RR: రాజకీయాలకు డబ్బు జబ్బు పట్టుకుందని ఈ ధోరణిలో మార్పు రాకపోతే సామాన్యుడు రాజకీయాల్లోకి రాలేని దుస్థితి ఏర్పడుతుందని షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. ఓటు ప్రజలు బాధ్యతగా భావించాలని, కేవలం డబ్బుల కోసం ఓట్లు వేసే ధోరణికి దూరం కావాలని అన్నారు.
ATP: గుత్తి ఆర్టీసీ బస్టాండ్లో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. తాడిపత్రికి చెందిన మహిళా ప్రయాణికురాలు సంధ్యారాణి పత్తికొండ వెళ్లేందుకు బస్సు ఎక్కుతుండగా ఆమె బ్యాగ్లో ఉన్న నాలుగు తులాల బంగారు ఆభరణాలను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
HYD: మహిళల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. శనివారం మెప్మా అధికారులతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. నియోజకవర్గంలోని మహిళలకు ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంఘాలకు ప్రత్యేక రుణాలు ఇప్పించడం, వ్యాపార అవకాశాలను వారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు.
WNP: బంజారా సేవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ నాయక్ ఆధ్వర్యంలో సంత్ సేవాలాల్ మహారాజ్ విగ్రహ స్థాపన కోసం వనపర్తి జిల్లా కేంద్రంలో స్థలం కేటాయించాలని గిరిజనులు జిల్లా అదనపు కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అందుకు సానుకూలంగా స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి కృషి చేస్తామన్నారు. విగ్రహ స్థాపన ద్వారా గిరిజనుల గౌరవం పెరుగుతుందన్నారు.
NZB: విద్యార్థులకు తల్లిదండ్రులే మొదటి గురువులని ధర్పల్లి సర్పంచ్ సీహెచ్.శ్రీనివాస్ పేర్కొన్నారు. ధర్పల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం తల్లిదండ్రుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తల్లిదండ్రుల క్రమశిక్షణ, పాఠశాలలో ఉపాధ్యా యులు బోధించే పాఠ్యాంశాలు విద్యార్థుల్లో జ్ఞాన పరివర్తనకు దోహదం చేస్తాయని పేర్కొన్నారు.
NLR: సౌర వెలుగులతో గ్రామాలు వెలిగిపోనున్నాయి. PM సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లి యోజన సోలార్ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కలెక్టర్ హిమాన్షు శుక్లా శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని లేగుంటపాడు, బిట్రగుంట, మహిమలూరు, కలివెలపాలెం, మనుబోలు, కాకుపల్లి వంటి 5 వేల మందికి పైగా జనాభా కలిగిన గ్రామాలను ఎన్నుకొన్నారు. ఉత్తమ ప్రదర్శన కనబర్చిన గ్రామాలకు రూ. కోటి కేంద్ర మంజూరు చేస్తుంది.
WG: నరసాపురంలో విద్యుత్ శాఖ శనివారం సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. డ్రోన్ల సాయంతో 11 KV విద్యుత్ వైర్లను బిగించే పనులను అధికారులు విజయవంతంగా నిర్వహించారు. 10 మంది కార్మికులు చేయాల్సిన కఠినమైన పనిని, డ్రోన్ సాయంతో కేవలం ఇద్దరు కార్మికులు పూర్తి చేశారు. దీనివల్ల సమయం ఆదా అవ్వడమే కాకుండా, కార్మికులకు భద్రత పెరిగిందని ఈఈ మధుకుమార్ తెలిపారు.
KDP: లింగాల మండలం అక్కులగారిపల్లెలో హరిస్వామి ఆరాధన మహోత్సవాలను పురస్కరించుకొని శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ లాగుడు పోటీలు నిర్వహించనున్నారు. ‘న్యూ కేటగిరీ’ విభాగంలో జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన విజేతలకు ఆరు రకాల నగదు బహుమతులు అందజేయనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. పోటీలో పాల్గొనే రైతులు శనివారం లోపు తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు.
TPT: వెంకటగిరి నియోజకవర్గంలోని పలు గ్రామాల లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పంపిణీ చేశారు. అనారోగ్య కారణాలతో వైద్య ఖర్చులకు ఇబ్బంది పడుతూ సహాయ నిధికి దరఖాస్తు చేసుకున్న బాధితులకు ఈ సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి రూపాయి నేరుగా అర్హులైన బాధితులకు చేరేలా చర్యలు తీసుకుంటామన్నారు.
MBNR: హన్వాడ మండలం పెద్దదర్పల్లి గ్రామంలో దెబ్బడి బాలమ్మ, కృష్ణయ్య మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలమడ్డాయి. పాలమూరు డిప్యూటీ మేయర్ గణేశ్ సురేందర్ రెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అంత్యక్రియలకు తన వంతుగా రూ.20 వేల ఆర్థిక సాయం అందజేశారు. కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్ తదితరులు కూడా పాల్గొన్నారు.
BHNG: ఎం తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామానికి చెందిన కొరిమి నర్సయ్య ఇటీవల మృతి చెందాడు. మృతుని కుటుంబానికి గ్రామ సర్పంచ్ మన్నెపు రజిత-తిరుపతి రెడ్డి రూ.10 వేలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు మెండు నర్సిరెడ్డి, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
BPT: మార్టూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర- స్వర్ణ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పంచాయతీ సిబ్బందితో కలిసి ఆసుపత్రి పరిసరాలను, వార్డు గదులను శుభ్రం చేశారు. రోగులకు పండ్లు పంపిణీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోందని, ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఆయన కోరారు.
ప్రకాశం: దర్శి నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో చికెన్ పాక్స్ (ఆటలమ్మ) కేసులు వేగంగా పెరుగుతున్నాయి. చిన్నపిల్లలు,యువత ఎక్కువగా ప్రభావితమవుతుండటంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జ్వరం, దద్దుర్లు, తీవ్రమైన దురద వంటి లక్షణాలతో అనేక మంది బాధపడుతున్నారని సమాచారం. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, బాధితులకు వైద్యసహాయం అందించాలని ప్రజలు కోరుతున్నారు
TPT: పురమిత్ర యాప్ ద్వారా ప్రజల నుంచి వచ్చిన పిర్యాదులను వెంటనే పరిష్కరించాలని నగరపాలక కమిషనర్ ఎన్.మౌర్య, అధికారులను ఆదేశించారు. పురమిత్ర యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను ఆరోగ్య శాఖ అధికారులతో కలసి ప్రకాశం పార్క్, శివ శక్తి కళ్యాణ మండపం, తదితర ప్రాంతాలను కమిషనర్ పరిశీలించారు. స్వర్ణ వార్డులో కార్యదర్శుల హాజరు నమోదు రికార్డులను పరిశీలించారు.
BDK: డివిజన్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని కొత్తగూడెం మేయర్ గణేశ్ స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 20వ డివిజన్లో శనివారం పర్యటించారు. పారిశుద్ధ్య పనులను స్వయంగా పరిశీలించి, స్థానికులతో ముచ్చటించారు. బాధ్యతలు చేపట్టిన వెంటనే క్షేత్రస్థాయిలోకి వెళ్లడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.