ఏపీని తెలుగునాడుగా మార్చాలని ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు డిమాండ్ చేశారు. ‘కేరళను కేరళం అని మార్చినట్లే ఏపీని కూడా తెలుగునాడుగా మార్చాలన్నారు. తమిళనాడులా తెలుగునాడు అని మార్చేందుకు మాజీ సీఎం NTR ప్రయత్నించారు. కేరళ వాళ్లకున్న పట్టుదల మనలోనూ ఉంటే మన బతుకులు కూడా మారుతాయి’ అంటూ చెప్పుకొచ్చారు.
NDL: ఆత్మకూరు కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినిలకు చట్టాలపై అవగాహన సదస్సు ఇవాళ నిర్వహించారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ శరన్ ఆదేశాలతో డీఎస్పీ ఆర్.రామాంజి నాయక్, అర్బన్ సీఐ ఓ. మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి బంగారు భవిష్యత్తు సాధించాలని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని సూచించారు.సమస్యలు ఉంటే వెంటనే పోలీసులను సంప్రదించాలని తెలిపారు.
NLR: దుత్తలూరు మండలం నందిపాడు కస్తూర్భా పాఠశాల సమీప హైవే వద్ద ఆదివారం కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరికి గాయాలు అవ్వగా సమాచారం అందుకున్న 108 సిబ్బంది గాయపడిన వ్యక్తిని ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. కడప నుంచి పొదిలికి వెళ్తున్న కారు నందిపాడు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ఎవ్వరికి ప్రాణ హాని జరగలేదు.
SDPT: జగదేవ్పూర్ మండలం కొత్తపేట గ్రామ సమీపంలో పెద్ద పెద్ద బండ రాళ్ళ మధ్య పెద్ద రాయి పై కాల భైరవ స్వామి రూపం ఒకటి కనబడింది. గ్రామ పెద్దలు మాట్లాడుతూ.. పూర్వ కాలం నుంచి ఇక్కడున్న పెద్ద పెద్ద గుండ్లను బయన్న గుండ్లుగా పిలిచారని అన్నారు.పెద్ద రాయి పై చెక్క బడిన ఈ కాలభైరవుని రూపం బృహత్ శిలా యుగ కాలానికి ( క్రీ.పూ. 1000 సం.ల క్రితానికి) చెందినది అని తెలిపారు.
MNCL: లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని 12వ వార్డులో నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. ఆదివారం ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ఏర్పాటు చేయించారు. వార్డులో విద్యుత్ సమస్య లేకుండా ఉండేందుకు నూతన ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేయించినట్లు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఎండి.అరిఫ్ తెలిపారు.
KRNL: నగరంలోని APSP 2వ బేటాలియన్లో మాజీ సైనికులు, వీర నారీమణులు, వారి కుటుంబాల సంక్షేమం, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ మెగా ఈ.ఎం.ఎస్ ర్యాలీ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీ.జీ భరత్ , కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజుతో కలిసి పాల్గొన్నారు. వీర కుటుంబాల సంక్షేమానికి ప్రత్యేక చర్యలను తీసుకునే విధంగా కార్యాచరణను సమీక్షించారు.
W.G: కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన ప్రమాదానికి సంబంధించి అధికారులు అప్రమత్తం అయ్యారు. పెనుమంట్ర మండలంలో బాణసంచా దుకాణాలను పెనుగొండ సీఐ విజయ్ కుమార్ ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. యజమానులకు పలు సూచనలు అందచేశారు. నిబంధనలకు విరుద్ధంగా దుకాణాలు కొనసాగిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.
MBNR: శాంతిభద్రతల పరిరక్షణ కోసం జిల్లాలో మార్చి 1 నుంచి 30 వరకు 30, 30(ఏ) పోలీస్ యాక్ట్ అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ డి.జానకి తెలిపారు. పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా ధర్నాలు, రాస్తారోకోలు, నిరసనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె హెచ్చరించారు.
NRPT: మరికల్ మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి దేవాలయ అభివృద్ధి కమిటీని ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షులుగా శివప్రసాద్, చెన్నయ్య, అధ్యక్షులుగా కృష్ణయ్య, రాములు, ప్రధాన కార్యదర్శిగా ముకుంద రెడ్డి, రాజేష్, అయ్యప్ప, కోశాధికారిగా హరిప్రసాద్తో పాటు సంయుక్త కార్యదర్శి సలహాదారులుగా పలువురిని ఎన్నుకున్నారు.
GDWL: గద్వాల పట్టణంలోని ఆర్టీసీ పెట్రోల్ పంప్ పక్కన రహదారి చెత్తాచెదారంతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించే వారు తీవ్రమైన దుర్వాసనతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కొందరు వ్యక్తులు బాధ్యత లేకుండా రోడ్డుపైనే చెత్త పారేస్తున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్షణమే మున్సిపల్ అధికారులు స్పందించి, ఆ వ్యర్థాలను తొలగించాలని డిమాండ్ చేశారు.
అన్నమయ్య: ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ఆధ్వర్యంలో మార్చి 6న మదనపల్లె గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. AU Small Finance Bank, Apollo Pharmacy తదితర ప్రముఖ సంస్థలు పాల్గొంటున్నాయి. వివరాలకు 6301612761 నంబర్ను సంప్రదించవచ్చు.
AKP: నర్సీపట్నం ఎన్టీఆర్ ప్రభుత్వ ఆసుపత్రిని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రి మరమ్మతులు, రంగులు వేసే పనుల కోసం నాబార్డ్ కింద సుమారు రూ. 40 లక్షల నిధులను స్పీకర్ మంజూరు చేయించారు. పనులను కౌన్సిలర్ చింతకాయల పద్మావతితో కలిసి ఆయన పర్యవేక్షించారు. పనులు నాణ్యతపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
VZM: ఎస్ కోట మండలం గోపాలపల్లి ఎస్సీ కాలనీ వద్ద పశు మాంసాన్ని విక్రయిస్తున్న షేక్ బాషా, సుల్తాన్ను ఆదివారం ఎస్.కోట పోలీసులు అరెస్టు చేశారు. గొర్రెలు పెంపకం పేరుతో షెడ్డు వేసుకొని, పశువులను వధించి వాటి మాంసాన్ని విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు దాడులు నిర్వహించి, మాంసాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
GNTR: అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని అసోసియేషన్ రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి చంద్రశేఖరరావు స్పష్టం చేశారు. కొత్తపేటలో ఆదివారం మాట్లాడుతూ..యాజమాన్య కుట్రలను ఆయన తప్పుబట్టారు. బాధితులకు తక్షణమే చెల్లింపులు జరపాలని డిమాండ్ చేస్తూ, మార్చి 2 నుంచి విజయవాడ ధర్నా చౌక్లో చేపట్టే రిలే దీక్షలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
BDK: భద్రాచలం నియోజకవర్గం లో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ల సన్మాన సభ ఆదివారం ఘనంగా నిర్వహించారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికలైనా, పంచాయతీ ఎన్నికలు అయిన, మున్సిపల్ ఎన్నికలు అయిన వార్ వన్ సైడ్ గానే కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. ఇది జీర్ణించుకోలేని గత పాలకులు విషాన్ని చిమ్ముతున్నారన్నారు.