• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘కాంగ్రెస్ పార్టీతోనే మున్సిపాలిటీ అభివృద్ధి సాధ్యం’

SRPT: కోదాడ మున్సిపాలిటీ పరిధిలో గల 35 వార్డులలో అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ, మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డితోనే సాధ్యం అవుతుందని మున్సిపల్ ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబు అన్నారు. శనివారం కోదాడ పట్టణ పరిధిలోని కేఎల్ఆర్ కాలనీవాసులు నూతనంగా ఎన్నికైన ఛైర్ పర్సన్ ఎర్నేని కుసుమ బాబును సన్మానించారు.

February 21, 2026 / 02:36 PM IST

ఇంటర్ విద్యార్థులకు సౌకర్యాలు కల్పించాలి: PDSU

SRPT: ఇంటర్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా పరీక్షా కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలని PDSU జిల్లా ప్రధాన కార్యదర్శి పిడమర్తి భరత్ డిమాండ్ చేశారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రాల్లో తాగునీరు, బెంచీలు, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫీజుల పేరుతో హాల్ టికెట్లు ఆపవద్దని కోరారు. 

February 21, 2026 / 02:36 PM IST

ప్రతి మండలానికి ఒక స్వచ్ఛరథం: సీఎం

AP: పల్నాడు జిల్లా వినుకొండలో సీఎం చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా స్వచ్ఛ రథాలను ఆయన ప్రారంభించారు. ప్రతి మండలానికి ఒక స్వచ్ఛరథం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పాత వస్తువులు ఇస్తే బదులుగా నిత్యావసరాలు ఇస్తామన్నారు. ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు ఇవ్వాలనేదే తన ఆలోచన అని పేర్కొన్నారు. ప్రతి ఇంటి దగ్గరకు వచ్చి చెత్తను సేకరిస్తామని వెల్లడించారు.

February 21, 2026 / 02:36 PM IST

శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్ గోడౌన్‌ సీజ్

VSP: యెద్దుల వెంకటరమణ రెడ్డికి చెందిన శాన్విరా ఇండస్ట్రీ లిమిటెడ్ గోడౌన్‌ను అధికారులు సీజ్ చేశారు. జీవీఎంసీకి సుమారు రూ.1.90 కోట్లు ఆస్తి పన్ను బకాయి ఉన్నట్లు గుర్తించిన అధికారులు ముందుగా నోటీసులు జారీ చేశారు. అయితే సంబంధిత సంస్థ నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో శనివారం రెవెన్యూ అధికారి రామ్ నారాయణ ఆధ్వర్యంలో ఆచ్ఐలు శివ, రెడ్డి మోహన్ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:36 PM IST

స్వచ్ఛ రథాన్ని ప్రారంభించిన చల్లా బాబు

CTR: రొంపిచర్ల మండలం బొమ్మయ్యగారి పల్లెలో స్వచ్ఛ రథాన్ని పుంగనూరు టీడీపీ ఇన్‌ఛార్జ్ చల్లా బాబు రెడ్డి ప్రారంభించారు. తడి చెత్త, పొడి చెత్త సేకరించిన వాహనాన్ని డంపింగ్ యార్డ్ వరకు నడిపారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతామని అందరి చేత ప్రమాణం చేయించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మధుసూదన్ రెడ్డి, రాష్ట్ర కురబ కార్పొరేషన్ డైరెక్టర్ ఉయ్యాల రమణ పాల్గొన్నారు.

February 21, 2026 / 02:35 PM IST

పోలీస్ కార్యాలయాల్లో ‘స్వర్ణాంధ్ర –స్వచ్ఛ దివస్’

అన్నమయ్య జిల్లాలో శనివారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించారు. సీఎం చంద్రబాబు పిలుపు మేరకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లు, కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది శ్రమదానంలో పాల్గొని ప్రాంగణాలను శుభ్రం చేశారు.

February 21, 2026 / 02:34 PM IST

మందకృష్ణపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు

కోనసీమ: భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగపై చర్యలు తీసుకోవాలని సఖినేటిపల్లి మండలం ఎస్సీ వెల్ఫేర్ సభ్యులు శనివారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లో ఎస్సై దుర్గా శ్రీనివాస్‌కు ఎస్సీ వెల్ఫేర్ అధ్యక్షుడు ప్రతాప్ పిర్యాదు చేశారు. మందకృష్ణపై వెంటనే కేసు నమోదు చేయాలని కోరారు.

February 21, 2026 / 02:34 PM IST

వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌ను పరిశీలించిన కలెక్టర్

TPT: స్వర్ణాంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లె లోని వ్యర్థ నిర్వహణ ప్లాంట్‌ను శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. వెంకటేశ్వర్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్లాంట్ పనితీరును పరిశీలించి, వ్యర్థాల వేరు వేరు సేకరణ, శుభ్రత పరిరక్షణపై అధికారులకు సూచనలు చేశారు. స్థానిక ప్రజలకు వ్యర్థాల వర్గీకరణ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

February 21, 2026 / 02:34 PM IST

టెక్నాలజీతో నేరాలకు చెక్: ఐజీ అశోక్ కుమార్

WG: పోలీస్ శాఖలో సిబ్బంది కొరత ఉన్నా సాంకేతికతతో అధిగమిస్తున్నామని ఏలూరు రేంజ్ ఐజీ జివిజీ అశోక్ కుమార్ తెలిపారు. శనివారం అచంటలో ఆయన మాట్లాడారు. నేరాల దర్యాప్తులో సీసీ కెమెరాలు, ఏఐ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతలు అదుపులోనే ఉన్నాయని, డ్రంక్ అండ్ డ్రైవ్, బైక్ చోరీలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు వెల్లడించారు.

February 21, 2026 / 02:34 PM IST

మేరికపూడిలో పొలంబడి కార్యక్రమం

GNTR: ఫిరంగిపురం మండలంలోని మేరికపూడి గ్రామంలో శనివారం పొలంబడి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి వాసంతి పాల్గొని రైతులకు పంట పరిరక్షణపై అవగాహన కల్పించారు. ఎంపిక చేసిన 30 మంది రైతులకు శనగ పంటలో కనిపించే ఎండు తెగులు, వివిధ చీడపీడల నివారణ చర్యలు, పోషక యాజమాన్యంపై సూచనలు చేశారు.

February 21, 2026 / 02:33 PM IST

టీమిండియా ఫాస్ట్ బౌలర్‌కు గాయం

టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ గాయపడ్డాడు. ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో పాండ్యా కొట్టిన బంతి.. సిరాజ్ ఎడమ మోకాలికి తగిలింది. దీంతో అతడు నొప్పితో విలవిల్లాడాడు. వెంటనే ఫిజియో అతడికి చికిత్సను అందించాడు. అనంతరం సిరాజ్ గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయాడు. అయితే, సిరాజ్ గాయం తీవ్రతపై ఇప్పటివరకు ఎలాంటి అప్‌డేట్ రాలేదు.

February 21, 2026 / 02:33 PM IST

కరెంటు షాక్‌తో అడవిపంది మృతి

KDP: మైదుకూరు మండలం గంజిగుంట ఫారెస్ట్ పరిధిలో విద్యుత్ షాక్‌తో అడవిపంది శనివారం మృతి చెందింది. ఫారెస్ట్ ఆఫీసర్ చలపతి నాయుడు ఘటనా స్థలాన్ని పరిశీలించగా, పంది కాళ్లు, మాంసం లభ్యమయ్యాయి. కరెంటు తీగలు అమర్చిన పొలం యజమానిని అధికారులు విచారిస్తున్నారు. రైతులు పొలాల వద్ద విద్యుత్ తీగలు ఏర్పాటు చేయరాదని, వన్యప్రాణులు మృతి చెందితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరు.

February 21, 2026 / 02:32 PM IST

రైతులకు నాణ్యమైన విద్యుత్ అందింపు

NRPT: గుండుమాల్ మండలం భక్తి మల్ల గ్రామంలో ఎస్ఈ నవీన్ కుమార్ శనివారం ‘ప్రజా బాట’ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామాల్లో విద్యుత్ అంతరాయం లేకుండా చూసి, రైతులకు నాణ్యమైన విద్యుత్తును అందించడం ప్రధాన లక్ష్యమని ఆయన తెలిపారు. సర్పంచ్ జ్యోతి శ్రీకాంత్, బానోదయ్, అరుణ్, గ్రామస్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

February 21, 2026 / 02:32 PM IST

క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న MLA

ASF: కాగజ్ నగర్ మండలం భట్టుపల్లిలో గత వారం రోజులుగా జరుగుతున్న ట్రై విలేజ్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు ఉత్సవాల్లో శనివారం MLA హరీష్ బాబు పాల్గొన్నారు. విన్నర్స్‌గా నిలిచిన అందవెల్లి, రన్నర్‌గా నిలిచిన భట్టుపల్లి జట్లకు బహుమతులు ప్రధానం చేశారు. మాజీ MPTC పిరిసింగుల తిరుపతి, కౌన్సిలర్ చిప్పకుర్తి శ్రీనివాస్, నాయకులు పాల్గొన్నారు.

February 21, 2026 / 02:31 PM IST

‘ఆశా కార్మికులకు పెండింగ్ వేతనాలు విడుదల చేయాలి’

ఖమ్మం జిల్లాలో ఆశా కార్యకర్తలకు పెండింగ్‌లో ఉన్న వేతనాలు, బిల్లులను వెంటనే చెల్లించాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు పిన్నింటి రమ్య డిమాండ్ చేశారు. డీఎంహెచ్‌వో రాంబాబుకు వినతిపత్రం అందజేసిన ఆమె.. పీహెచ్‌సీల్లో కొందరికే పారితోషికాలు ఇచ్చి, మిగిలిన వారిని విస్మరించడం సరికాదన్నారు. ఈ నెల 23న ‘చలో హైదరాబాద్’ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.

February 21, 2026 / 02:30 PM IST