VSP: KGHలో పసికందు మృతదేహం లభ్యం కావడంతో వన్టౌన్ పోలీసులు విచారణ ప్రారంభించారు. పర్యవేక్షణ అధికారి కార్యాలయానికి సమీపంలోనే నవజాతి శిశువు గోని సంచులో కుళ్లిపోగా వాసన రావడంతో రోగులు, సిబ్బంది గమనించి పరిశీలించారు. వెంటనే KGH అధికారులు, వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సీఐ పూడి వరప్రసాద్ సీసీ ఫుటేజీ పరిశీలించారు.
కోనసీమ: మండపేట మండలం తాపేశ్వరం గ్రామంలో దేవుడు కాలనీ నందు జరుగుచున్న సీసీ రోడ్లు, డైన్ పనులను ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు శనివారం పరిశీలించారు. దేవుడు కాలనీలో పనులు జరుగుచున్న ప్రతీచోట తిరిగి డ్రైన్స్ లెవిలింగ్ను పరిశీలించారు. నాణ్యత లోపం లేకుండా పనులు త్వరగా పూర్తిచెయ్యాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, తదితరులు పాల్గొన్నారు.
KRNL: కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పై BJP నాయకులు దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని పెద్దకడబూరు కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఆనంద్ రాజ్ ఇవాళ అన్నారు. నిరుద్యోగంపై ప్రశ్నిస్తే దాడులు చేయడం సరైన పద్ధతి కాదని, అభివృద్ధి చేసి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న BJP పార్టీ అహంకార ధోరణితో వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు.
ELR: కైకలూరులోని పెట్రోలు బంకులలో పనిచేస్తున్న సిబ్బందిని ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ శనివారం సత్కరించారు. ఎస్పీ మాట్లాడుతూ.. ఆయా పెట్రోల్ బంకులలో ఉత్తమ సేవలు అందించిన మొత్తం తొమ్మిది మంది కార్మికులకు ప్రోత్సాహ బహుమతులు అందించామన్నారు. పెట్రోల్ బంకులో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందిస్తున్న వారిని గుర్తించి ప్రతి నెల నగదు ప్రోత్సాహాలు అందిస్తున్నామన్నారు.
అన్నమయ్య: శాసనమండలిలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై రాజంపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షులు సుగవాసి ప్రసాద్ బాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీవారి చిత్రపటాలను రాజకీయ నిరసనలకు వాడటం దైవద్రోహమని, భక్తుల మనోభావాలను దెబ్బతీసే చర్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాజకీయ లబ్ధి కోసం దైవాన్ని వాడుకోవడం మహా పాపమని హెచ్చరించారు.
W.G: ఏకీకృత కుటుంబ సర్వే పై సంబంధిత అధికారులతో పగో జిల్లా కలెక్టర్ నాగరాణి సమీక్షించారు. జిల్లాలో 6,30,947 కుటుంబాలను సర్వే చేయవలసి ఉండగా నేటి వరకు 4,73,506 కుటుంబాల సర్వేను వివిధ శాఖల సిబ్బంది పూర్తి చేయడం జరిగిందన్నారు. శాఖల వారీగా సూచించిన కుటుంబ సర్వే లక్ష్యాలను త్వరగా పూర్తిచేసి నివేదిక అందజేయాలని తెలిపారు.
KDP: జమ్మలమడుగు పట్టణంలో ప్రధాన రోడ్లపై చెత్త చెల్లాచెదురుగా పడిపోవడంపై DYFI జిల్లా కార్యదర్శి వీరణాల శివకుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. దాల్మియా సిమెంటు పరిశ్రమకు వ్యర్థాలను తరలిస్తున్న లారీలు పట్టణంలోకి ప్రవేశిస్తూ రోడ్లను అపరిశుభ్రం చేస్తున్నాయని ఆరోపించారు. చెత్త లారీలు బైపాస్ మార్గంలోనే వెళ్లేలా అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
AP: వైసీపీ నేత శ్రీఘాకోళ్లపు శివరామ సుబ్రహ్మణ్యం కుమారుడి వివాహ వేడుకకు మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. బెంగళూరులోని తిరుమేనహళ్లిలో జరిగిన ఈ వేడుకలో నూతన వధూవరులు నాగ ఉమా యజ్జిత, యశ్వంత్లను ఆయన ఆశీర్వదించారు. ఈ సందర్భంగా పెళ్లికి వచ్చిన అభిమానులు, పార్టీ కార్యకర్తలతో జగన్ ముచ్చటించారు.
AP: రాష్ట్రంలో ఎల్లుండి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 24 వరకు జరిగే ఈ పరీక్షల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 1,537 కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. మొత్తం 10.57 లక్షల మంది విద్యార్థులు హాజరుకానున్నారు. నిబంధనల ప్రకారం విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.
MHBD: గంగారం మండలం రెడ్యాల గ్రామానికి చెందిన మాజీ TPCC కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి, వెన్నం విజయ్ కాంత్ రెడ్డి తండ్రి రాఘవేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న MLC పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి మృతుడి నివాసానికి వెళ్లి ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.
భారత్ పర్యటనలో ఉన్న బ్రెజిల్ అధ్యక్షుడు లూలా డ సిల్వాతో ప్రధాని మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. కీలక ఖనిజాలు, భద్రత, వాణిజ్యంపై ఇరువురు నేతలు దృష్టి సారించారు. వచ్చే ఐదేళ్లలో ఇరు దేశాల మధ్య వాణిజ్యం 20 బిలియన్ డాలర్లకు మించి విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. లాటిన్ అమెరికాలో భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా బ్రెజిల్ ఉందని మోదీ పేర్కొన్నారు.
AP: బీజేపీ ఎస్సీ మోర్చా పదాధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ చీఫ్ మాధవ్ హాజరయ్యారు. బీజేపీ ఎస్సీ మోర్చా కార్యక్రమం భిన్నమైందన్నారు. ఎస్సీలను ఓటు బ్యాంక్గా చూసేవారికి బుద్ధి చెప్పాలని సూచించారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని తెలిపారు. అంబేద్కర్ వల్లే ఎస్సీలకు గౌరవం వచ్చిందని పేర్కొన్నారు.
NLR: బోగోలు మండలం కొండ బిట్రగుంట బిలకూట క్షేత్రంలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో నూతన రథశాల, కళ్యాణ మండపాలను కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు. స్వామివారిని దర్శించి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. ఈ నెల 26 నుంచి వచ్చే నెల 7 వరకు తిరుమల విధానంలో 11 రోజుల బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
HNK: నడికూడ (M) చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు అచ్చ సుదర్శన్, తెలుగు భాషా ఉపాధ్యాయులు పల్లె శ్రీనివాస్ మాట్లాడుతూ… ప్రపంచంలో చిన్న, పెద్ద భాషలను అన్నింటిని రక్షించుకోవాలన్నారు. మాతృభాష మృత భాష కాకూడదని అమృత భాష కావాలని కోరారు. ఉపాధ్యాయులు లకావత్ దేవ, రాజకుమార్ ఉన్నారు.
TG: పోలీసులు, ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖాకీ బుక్ కాంగ్రెస్కు చుట్టమైందన్నారు. రైతు బంధు పేరు చెప్పి మున్సిపల్ ఎన్నికల్లో ఓట్లు వేయించుకున్నారని.. ఇంతవరకు నిధులు విడుదల చేయలేదన్నారు. రైతు బంధు ఇవ్వకపోతే ప్రత్యక్ష పోరాటం చేస్తామన్నారు. సీఎం, వ్యవసాయశాఖ మంత్రి ఆఫీసు ముట్టడిస్తామని హెచ్చరించారు.