• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

మద్దిపి గ్రామంలో కాలుష్య నీరు సమస్య

సత్యసాయి: లేపాక్షి మండలం కంచి సముద్రం పంచాయతీ మద్దిపి గ్రామంలో చెరువు బోరులోని నీరు గత వారం నుంచి కలుషితమై మట్టి నీరు వస్తోంది. కనీసం కడుక్కోవడానికి కూడా వీలులేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వేసిన కొత్త బోరును ప్రారంభించి ట్యాంక్‌కు నీరు అందించి సమస్యను త్వరగా పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

February 20, 2026 / 02:30 PM IST

మూసీ సుందరీకరణ.. స్థానికుల సహాయ నిరాకరణ

HYD: గోల్కొండ, రాజేంద్రగనర్, గండిపేట మండలాల పరిధిలో మూసీ సుందరీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అక్కడ భూములు, స్థలాలు సేకరించాల్సి ఉంది. అయితే స్థానికులు ఇందుకు ససేమిరా అంటున్నారు. తమ స్థలాలు ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని స్థానికులు అధికారులకు తేల్చి చెబుతున్నారు. ఇదిలా ఉండగా భూముల సేకరణకు సంబంధించి రెవెన్యూ అధికారులు దాదాపు 1000 నోటీసులు ఇచ్చారు.

February 20, 2026 / 02:25 PM IST

కేసులకు భయపడను.. ఎక్కడా తగ్గను: అంబటి

GNTR: జైలు నుంచి విడుదలైన అనంతరం మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరులో శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ప్రతి ఒకరికి ఒక రోజు వస్తుంది తనకు కూడా రోజు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో ఎదిగిన తాను ఇటువంటి కేసులకు భయపడే ప్రసక్తే లేదని, ఎక్కడా తగ్గేది లేదని స్పష్టం చేశారు. అవసరమైతే ప్రాణాలు ఇస్తానని తెలిపారు.

February 20, 2026 / 02:25 PM IST

పార్టీ అధిష్టానానికి జగ్గారెడ్డి లేఖ

TG: కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి పార్టీ అధిష్టానానికి కీలక విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, PCC చీఫ్ మహేష్ గౌడ్‌కు లేఖ రాశారు. ‘మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎప్పటినుంచో కాంగ్రెస్‌లోనే ఉన్నారు. పరిస్థితులు అనుకూలించకే ఓడిపోయారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్న ఆయనకు అవమానం జరగకుండా చూడాలి. వారికి తగిన గౌరవం దక్కాలి’ అని అన్నారు.

February 20, 2026 / 02:25 PM IST

చికిత్స పొందుతూ మాజీ సర్పంచ్ మృతి

SRD: రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ కంగ్టి మండలం చుక్కలతీర్థం మాజీ సర్పంచ్ రమేష్ పాటిల్(49) ఇవాళ మృతి చెందారు. ఈ నెల 10న పొలం పనులపై రాసోల్ వెళ్లి తిరిగి రాత్రి తడ్కల్‌కు వెళ్తుండగా ముర్కుంజాల్ శివారులో బైకు అదుపుతప్పి ప్రమాదం జరిగి తీవ్ర గాయాలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సంగారెడ్డిలో ఆస్పత్రిలో బ్రెయిన్ ఆపరేషన్ చేసినా పరిస్థితి విషమించి మరణించారు.

February 20, 2026 / 02:25 PM IST

‘ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

KRNL: దేవనకొండ మండలంలో వరుస దొంగతనాలు, చైన్ స్నాచింగ్ ఘటనల నేపథ్యంలో సీఐ వేణుగోపాల్ ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని శుక్రవారం సూచించారు. అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీస్‌లకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. మహిళలు ఒంటరిగా ప్రయాణించవద్దని, బంగారు ఆభరణాలు బహిరంగంగా ప్రదర్శించరాదని CI వెల్లడించారు.

February 20, 2026 / 02:25 PM IST

నూతన ఛైర్ పర్సన్‌లను సన్మానించిన మంత్రి

NRPT: మక్తల్ మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా వాకిటి మానస హన్మంతు, వైస్ ఛైర్ పర్సన్‌గా కుమారి శైవీ రెడ్డి పదవీ బాధ్యతలు ఇవాళ స్వీకరించారు. ఈ కార్యక్రమానికి మంత్రి వాకిటి శ్రీహరి, ఆయన సతీమణి లలిత హాజరయ్యారు. కార్యాలయంలో పూజల అనంతరం ఇరువురినీ వారి వారి కుర్చీల్లో కూర్చోబెట్టి, సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు.

February 20, 2026 / 02:24 PM IST

సూపర్‌-8లోనూ విజయాలు సాధిస్తాం: రజా

టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వే సంచలన ప్రదర్శనతో సూపర్-8కు చేరుకుంది. ఈ క్రమంలో ఆ జట్టు కెప్టెన్ సికందర్ రజా మాట్లాడుతూ.. గ్రూప్‌ దశలో అజేయంగా నిలవడం గర్వంగా ఉందని తెలిపాడు. ఇదే ప్రదర్శనను సూపర్-8లో కొనసాగిస్తామని పేర్కొన్నాడు. S-8లో ఈనెల 23న వెస్టిండీస్‌తో జరిగే తమ తొలి మ్యాచ్‌లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశాడు.

February 20, 2026 / 02:23 PM IST

‘పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలి’

NTR: తిరువూరులో కృష్ణా జిల్లా కోఆపరేటివ్ బ్యాంకు ఉద్యోగుల నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ సమ్మెకు సీపీఎం జిల్లా కార్యదర్శి కృష్ణయ్య శుక్రవారం హాజరయ్యి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న పీఆర్‌సీని తక్షణమే చెల్లించాలన్నారు. 2019 నుంచి ఉద్యోగం చేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయాలని, ప్రభుత్వ హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

February 20, 2026 / 02:23 PM IST

మహిళ దీనస్థితిపై స్పందించిన లోకేష్

AP: కడప జిల్లా గోపవరం మండలం పి.పి కుంటకు చెందిన లక్ష్మీనారాయణమ్మ దీనస్థితిపై మంత్రి లోకేష్ స్పందించారు. ప్రసార మాధ్యమాల్లో ఆమె దీనస్థితిపై వచ్చిన కథనంపై జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌ను ఆయన అడిగి తెలుసుకున్నారు. వెంటనే ఆ కుటుంబానికి అవసరమైన సహాయం చేయాలని ఆదేశించారు.

February 20, 2026 / 02:23 PM IST

పెంటపాడులో కనకదుర్గాదేవి విగ్రహ ప్రతిష్ట

W.G: పెంటపాడు మండలం ఉమామహేశ్వరంలో శ్రీ కనక దుర్గా దేవి నూతన ఆలయ నిర్మాణం, విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ కో ఆర్డినేటర్ వడ్డీ రఘురాం నాయుడు పాల్గొన్నారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేేక పూజలు చేశారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

February 20, 2026 / 02:21 PM IST

‘ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం’

KMM: అధికారం అంటే గద్దె మీద కూర్చోవడం కాదు, ప్రజా సమస్యల పరిష్కారమేనని మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇంఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఏదులాపురం 22వ వార్డులో మున్సిపల్ ఛైర్‌పర్సన్ అనిత ఏర్పాటు చేసిన పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఏదులాపురం అభివృద్ధికి కృషి చేస్తూ, ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలని సూచించారు.

February 20, 2026 / 02:20 PM IST

నర్సీపట్నంలో లేగ దూడల ప్రదర్శన

AKP: నర్సీపట్నం(మం) చెట్టుపల్లిలో లేగ దూడల ప్రదర్శన కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ రాంబాబు మాట్లాడుతూ.. రైతుల్లో పాడి పశువుల పెంపకంపై అవగాహన పెంచుతున్నామన్నారు. మేలు రకము సంతతిని వృద్ధి చేయడానికి పశుసంవర్ధక శాఖ అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు.

February 20, 2026 / 02:20 PM IST

‘అత్యాచార నిరోధక చట్టం అమలు చేయాలి’

KRNL: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం అమలును అధికారులు సమర్థవంతంగా అమలు చేయాలని జేసి నూరుల్ ఖమర్ ఆదేశించారు. కర్నూలు కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. పలు అంశాలపై జేసీ అధికారులతో చర్చించారు. ఇందులో హౌసింగ్ పీడీ చిరంజీవి, కర్నూలు, పత్తికొండ RDOలు సందీప్, భరత్ ఉన్నారు.

February 20, 2026 / 02:19 PM IST

పోలీసుల సమస్యలపై అసెంబ్లీలో ప్రస్తావించిన ఎమ్మెల్యే

ప్రకాశం: కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహారెడ్డి అసెంబ్లీలో పోలీసు శాఖ సమస్యలపై ఇవాళ అసెంబ్లీలో ప్రస్తావించారు. పోలీసు సిబ్బంది ఎదుర్కొంటున్న పని భారం, సిబ్బంది కొరత, మౌలిక వసతుల లోపాలు వంటి అంశాలను సభ దృష్టికి తీసుకువచ్చారు. పోలీసులకు తగిన సదుపాయాలు కల్పించాలన్నారు. ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

February 20, 2026 / 02:19 PM IST