SDPT: తెలంగాణ ఉద్యమంలో ప్రస్తుత మంత్రి పొన్నం ప్రభాకర్ క్రియా శ్రీలంక పాత్ర పోషించారు. 2009-2014 మధ్య కరీంనగర్ ఎంపీగా పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాదించారు. ‘సకల జనుల సమ్మె’, మిలియన్ మార్చ్లో పాల్గొంటూ, పార్టీలతో సంబంధం లేకుండా తెలంగాణ కోసం పోరాడిన నిజమైన ఉద్యమకారుడుగా నిలిచారు. లోక్సభలో తెలంగాణ బిల్లు ప్రవేశ పెడుతున్నప్పుడు గాయపడ్డారు.
సూపర్-8లో భాగంగా ఈనెల 21న భారత్, సౌతాఫ్రికా మ్యాచ్ జరగనుంది. ఈ నేపథ్యంలో సౌతాఫ్రికా దిగ్గజ ఆల్రౌండర్ షాన్ పొలాక్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రెండు జట్లలోనూ అద్భత ప్లేయర్లు ఉన్నారని చెప్పాడు. అయితే, బుమ్రా, వరుణ్ చక్రవర్తి టీమిండియాలో గేమ్ ఛేంజర్స్ అని వ్యాఖ్యానించాడు. సౌతాఫ్రికాతో పోలిస్తే భారత్ జట్టు కాస్తా మెరుగ్గా కనిపిస్తుందని అభిప్రాయపడ్డాడు.
శ్రీకాకుళం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించిన దివ్యాంగుల ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమానికి 13 దరఖాస్తులు వచ్చాయి. అర్జీలు పరిష్కారంలో జాప్యం జరగకూడదని డీఆర్డీఏ పీడీ కిరణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. వికలాంగులకు పింఛన్లు మంజూరు చేయాలని 8 మంది దరఖాస్తులు సమర్పించారు. బ్యాటరీ మోటార్ సైకిల్లు మంజూరు చేయాలని ఇద్దరు దరఖాస్తు చేశారని తెలిపారు.
అభిమానుల కోసం ఏడాదికి 3-4 మూవీలు చేస్తున్నా, ఒక్కటే విడుదలవుతోందని ప్రభాస్ అన్నాడు. ‘కపుల్ ఫ్రెండ్లీ’ చిత్రబృందంతో ముచ్చటించిన ఆయన.. తనకు అన్ని జానర్లు ఇష్టమని, ముఖ్యంగా మణిరత్నం అంటే ప్రత్యేకమైన అభిమానమని తెలిపాడు. ‘గీతాంజలి’ అంటే తనకెంతో ఇష్టమని, ‘కపుల్ ఫ్రెండ్లీ’ చూసినప్పుడు ఆ మూవీ ఫీల్ కలిగిందన్నాడు. అందుకే దీన్ని నాలుగు సార్లు చూడాలని నిర్ణయించుకున్నానని...
తమిళనాడు రాజకీయాల్లో సంచలనం చోటుచేసుకుంది. సీఎం స్టాలిన్తో మాజీ సీఎం ఒ. పన్నీర్ సెల్వం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా స్టాలిన్కు ఓపీఎస్ మద్దతు తెలిపారు. డీఎంకే ఐదేళ్ల పాలనను ఆయన పొగిడారు. వచ్చే ఎన్నికల్లో డీఎంకే మళ్లీ గెలుస్తుందని జోస్యం చెప్పారు. డీఎంకే పాలనపై ప్రజల్లో నమ్మకం ఉందని తెలిపారు.
VSP: ప్రచురిత కథనం తమ ప్రతిష్ఠకు భంగం కలిగించిందంటూ దాఖలైన పరువు నష్టం కేసులో ఓ దినపత్రికపై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో విశాఖ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు, ఐటీడీపీ రాష్ట్ర మాజీ అధికార ప్రతినిధి చింతకాయల విజయ్ విశాఖ జిల్లా కోర్టుకు శుక్రవారం హాజరయ్యారు. రాజకీయ కక్షసాధింపులో భాగంగా తప్పుడు కథనాలు ప్రచురించారని ఆరోపించారు.
MBNR: జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్లో తెలంగాణ ఉద్యమాకారుల సన్నాహాక సమావేశం జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ తొలి ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున నడిపిన ఘనత ఉద్యమకారులదన్నారు. గుర్తింపు కార్డులు, పెన్షన్, ఇందిరమ్మ ఇళ్లు, 25 లక్షల ఎక్స్గ్రేషియా తదితర హామీలు అమలు చేయాలన్నారు.
NTR: ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026లో పాల్గొనేందుకు వెళ్తున్న సీఎం చంద్రబాబును ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ వద్ద ఎంపీ కేసీనేని చిన్ని శుక్రవారం ఘనస్వాగతం పలికారు. దేశంలో కృత్రిమ మేధస్సు (AI) రంగంలో జరుగుతున్న పరిణామాలు, అభివృద్ధి అవకాశాలపై నిర్వహిస్తున్న ఈ సమ్మిట్లో పాల్గొనడం రాష్ట్రానికి ఎంతో ఉపయోగకరమని ఎంపీ తెలిపారు.
VZM: వైసీపీ సభ్యులు శాసనమండలిలో వెంకటేశ్వరుని ఫోటోలు తీసుకువచ్చి సభ్య సమాజం తలదించుకునేలా చేసారని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం జిల్లా TDP కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జగన్ అండ్ టీం బేషరతుగా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని, గౌరవ సభలో వైసీపీ సభ్యుల ప్రవర్తన తీరును మార్చుకోవాలని సూచించారు.
KRNL: తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారిని శుక్రవారం ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి, ఆయన సతీమణి బుసినే రామాంజినమ్మతో కలిసి దర్శించుకున్నారు. వైకుంఠం మల్లికార్జున చౌదరి కుటుంబ సభ్యులు, నూతన వధూవరులు హాజరయ్యారు. అనంతరం వారికి అర్చకులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
KDP: రేపు ఉదయం 10:30 గంటలకు ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశాన్ని నిర్వహించనున్నట్లు మున్సిపల్ ఛైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు సమావేశపు అజెండాను కౌన్సిలర్లు, సభ్యులకు పంపామన్నారు. సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు పూర్తి సమాచారంతో సమావేశానికి హాజరు కావాలని సూచించారు.
E.G: ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ అండగా ఉంటానని రూడా ఛైర్మన్, జిల్లా TDP అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి పేర్కొన్నారు. శుక్రవారం కోరుకొండ మండలం బూరుగుపూడిలో పలు సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ప్రతి సమస్యను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకునే దిశగా కృషి చేస్తామన్నారు.
ASR: పట్టాదారు పాసుపుస్తకాలు, పోడు పట్టాలు ఉన్న ప్రతిరైతూ ఫార్మర్ రిజిస్ట్రీ తప్పనిసరిగా చేయించుకోవాలని కొయ్యూరు మండల వ్యవసాయ అధికారి పీ. శివరామ్ ప్రసాద్ సూచించారు. డౌనూరు పంచాయతీలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రీ శుక్రవారం పరిశీలించారు. సిబ్బందితో కలిసి పలువురు రైతులకు స్వయంగా రిజిస్ట్రేషన్ చేశారు. ఈనెల 28లోగా రైతులు ఫార్మర్ రిజిస్ట్రీ చేయించుకోవాలని సూచించారు.
KMM: మధిర ప్రజలకు కావాల్సిన వైద్యం, రహదారులు, విద్యుత్, మంచినీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించి మధిర పట్టణాన్ని ప్రగతివైపు పరుగులు పెట్టిస్తానని మధిర మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత రామనాథం అన్నారు. 3 వార్డు కౌన్సిలర్ బెజ్జం రాజు శుక్రవారం మున్సిపల్ ఛైర్ పర్సన్ సామినేని సుజాతని కలిసి సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందించారు.
NZB: నిజామాబాద్ నగర పాలక సంస్థ మేయర్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరయ్యారు. శుక్రవారం హెలికాప్టర్ ద్వారా గిరిరాజ్ ప్రభుత్వ కళాశాల మైదానానికి చేరుకున్న వారికి స్థానిక నాయకులు ఘనస్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి, కార్పొరేటర్లు పాల్గొని నేతలకు పుష్పగుచ్ఛాలు అందజేశారు.