• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘సీపీఐ జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలి’

KRNL: మంత్రాలయంలో మార్చి 1,2,3 తారీఖులలో జరిగే సీపీఐ జిల్లాస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గిడ్డయ్య, సహాయ కార్యదర్శి మునెప్ప పిలుపునిచ్చారు. శుక్రవారం మంత్రాలయంలో ఇందుకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హిందూ ముస్లింల మధ్య ఘర్షణ పెట్టేందుకు కుట్రలు చేస్తున్నాయని విమర్శించారు.

February 20, 2026 / 03:53 PM IST

6వ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

NDL: మహానంది మండలం తిమ్మాపురం ఆదర్శ పాఠశాలలో ఆరవ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు. ఈ నెల 23న ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతుందని వెల్లడించారు. మార్చి 31వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఏప్రిల్ 12వ తేదీన ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

February 20, 2026 / 03:52 PM IST

బ్రాహ్మణచెరువులో ఫ్రైడే -డ్రై డే కార్యక్రమం

W.G: పెనుగొండ మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో శుక్రవారం ‘ఫ్రైడే డ్రైడే’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మీ, మేల్ అసిస్టెంట్ నాగ భూషణం, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి నిల్వ ఉన్న నీటిని, వ్యర్థాలను తొలగించాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. దోమల వ్యాప్తి ద్వారా వచ్చే డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 20, 2026 / 03:52 PM IST

జీవన్ రెడ్డికి అభిమానం జరగకుండా చూడాలి: జగ్గారెడ్డి

SRD: మాజీ ఎమ్మెల్సీ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డికి కాంగ్రెస్‌లో అవమానం జరగకుండా ఏఐసీసీ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ చూడాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి శుక్రవారం కోరారు. పది సంవత్సరాలు కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్ని ఆఫర్లు వచ్చిన బయటకు వెళ్లలేదని గుర్తు చేశారు.

February 20, 2026 / 03:51 PM IST

రాష్ట్ర స్థాయి సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

KRNL: రాష్ట్ర సచివాలయంలో ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులతో సెన్సస్-2027 నిర్వహణపై శుక్రవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పాల్గొన్నారు. జిల్లాస్థాయిలో చేపట్టాల్సిన ప్రాథమిక ఏర్పాట్లు, శిక్షణ, తదితర అంశాలపై ఆమె అధికారులతో చర్చించారు. జిల్లాలో జనాభా గణనను విజయవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

February 20, 2026 / 03:50 PM IST

దుప్పల్లి గ్రామ వాసికి రూ.లక్ష సీఎంఆర్ఎఫ్ చెక్కు

MBNR: చిన్నచింతకుంట మండలం దుప్పల్లి గ్రామానికి చెందిన బత్తుల లక్ష్మన్న కుమారుడికి మంజూరైన రూ.లక్ష సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి (GMR) అందజేశారు. శుక్రవారం గ్రామ సర్పంచ్, నాయకుల సమక్షంలో ఈ చెక్కును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆపదలో ఉన్న పేద ప్రజలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

February 20, 2026 / 03:49 PM IST

సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ 

AP: సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. పరిపాలనా భవనాల నిర్మాణంపై చర్చించారు. శాఖలవారీ ఉద్యోగుల మేరకు వర్క్ స్పేస్ కేటాయింపుపై చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. తొలుత 31.71 లక్షల చదరపు అడుగుల వర్క్ స్పేస్ అంచనా వేశామని.. శాఖలవారీగా ఉద్యోగుల వివరాలపై స్పష్టత ఇవ్వాలని CSను కోరినట్లు చెప్పారు. వర్క్ స్పేస్‌పై మరోసారి చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.

February 20, 2026 / 03:48 PM IST

‘సమస్యల పరిష్కారమే లక్ష్యం’

అనకాపల్లి నియోజకవర్గంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు జనసేన నియోజకవర్గం సమన్వయకర్త బీమరశెట్టి రాంకీ తెలిపారు. శుక్రవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సమస్యలపై వినతులు స్వీకరించారు. తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఓ పక్క సంక్షేమం మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు.

February 20, 2026 / 03:48 PM IST

కడపలో వైసీపీ పత్రికా సమావేశం నిర్వహణ

కడప నగరంలోని వైసీపీ జిల్లా కార్యాలయంలో రాష్ట్ర పాలనపై పార్టీ నేతలు పత్రికా సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ మంత్రి సాకే శైలజానాథ్, ఇతర నేతలు సమావేశంలో పాల్గొన్నారు. కడపకు విచ్చేసిన శైలజానాథ్‌ను పార్టీ నాయకులు శాలువాలతో సన్మానించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇంఛార్జ్‌లు, పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు.

February 20, 2026 / 03:47 PM IST

పాఠశాలలో ‘సామాజిక న్యాయ దినోత్సవం’

NLG: చిట్యాలలోని ఒక ప్రైవేటు పాఠశాలలో శుక్రవారం ‘సామాజిక న్యాయ దినోత్సవం’ జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో ఏర్పాటు చేసిన తాత్కాలిక ‘మాక్ కోర్టు’ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విద్యార్థులు న్యాయమూర్తులు, లాయర్ల పాత్రల్లో అభినయించి, న్యాయ ప్రక్రియపై అవగాహన కల్పించేలా మెప్పించారు. ప్రజా ప్రతినిధులు, పాఠశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

February 20, 2026 / 03:46 PM IST

అభివృద్ధి పనులకు భూమిపూజ చేసిన ఎమ్మెల్యే

ATP: తాడిపత్రిలో శుక్రవారం పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, MLA అశ్మిత్ రెడ్డి భూమిపూజ చేశారు. ఆంజనేయస్వామి మాన్యం వెనుక రూ.4.50 కోట్లతో నిర్మించే సోలార్ ప్రాజెక్టు పనులను ప్రారంభించారు. అలాగే అర్జాస్ స్టీల్ ప్లాంట్ ఎదురుగా మురుగునీరు శుద్ధి చేసే ప్లాంట్, జేసీ పార్క్ ఎదురుగా షాపింగ్ కాంప్లెక్స్ పనులకు శ్రీకారం చుట్టారు.

February 20, 2026 / 03:45 PM IST

వాట్సాప్ గ్రూప్ చాట్‌లో కొత్త అప్‌డేట్!

వాట్సాప్ గ్రూపుల్లో కొత్తగా చేరే వారికి పాత సంభాషణలు తెలిసేలా ‘హిస్టరీ షేరింగ్’ ఫీచర్‌ను మెటా పరిచయం చేసింది. అడ్మిన్లు గత 25 నుండి 100 మెసేజ్‌లను కొత్త సభ్యులతో షేర్ చేయవచ్చు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో ఇది పూర్తి సురక్షితం. హిస్టరీ షేర్ చేసినప్పుడు గ్రూప్ సభ్యులందరికీ సమాచారం అందుతుంది. అవసరమైతే అడ్మిన్లు ఈ ఫీచర్‌ను ఎప్పుడైనా నిలిపివేయవచ్చు.

February 20, 2026 / 03:45 PM IST

‘విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంచుకోవాలి’

కృష్ణా: నందివాడ మండలం తమ్మిరిశ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బాల్య వివాహాల నివారణ గురించి ఎస్సై సుబ్రహ్మణ్యం ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. విద్యార్థి దశనుంచే చట్టాలు, సామాజిక అంశాలపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా ఉజ్వల భవిష్యత్తు నిర్మించుకోవచ్చని తెలిపారు. అపరిచిత వ్యక్తులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

February 20, 2026 / 03:45 PM IST

తప్పిపోయిన బాలుడికి సర్పంచ్ ఆసరా

WNP: హైదరాబాద్ నుంచి రైలులో ప్రయాణిస్తున్న క్రమంలో కరీంనగర్‌కు చెందిన గణేష్ అనే బాలుడు తప్పిపోయి మదనాపురం మండలం బౌసింగ్ తండా వాసుల వెంట వెళ్లాడు. విషయాన్ని గుర్తించిన గ్రామ సర్పంచ్ సీతారాం నాయక్ తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. బాలుడి వివరాలు సేకరించిన అనంతరం పోలీసుల సహకారంతో సురక్షితంగా సఖీ కేంద్రానికి తరలించారు.

February 20, 2026 / 03:44 PM IST

టేబుల్ బుక్‌ను ఆవిష్కరించిన మంత్రి సీతక్క

MLG: ప్రజా భవన్లో “Goddess of Folk–Sammakka Saralamma Jatara” కాఫీ టేబుల్ బుక్‌ను మంత్రి సీతక్క నేడు ఆవిష్కరించారు. బుక్‌ను రూపొందించిన కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్‌ను మంత్రి సీతక్క ప్రత్యేకంగా అభినందించారు. జాతర అరుదైన ఫోటోలతో ఆకర్షణగా మేడారం కాఫీ టేబుల్ బుక్ ఉందని మంత్రి సీతక్క అన్నారు.

February 20, 2026 / 03:43 PM IST