SDPT: ఇందిరమ్మ ఇళ్ల గ్రౌండింగ్పై జిల్లా కలెక్టర్ హైమావతి జూమ్ సమావేశంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలాల వారీగా మంజూరు, గ్రౌండింగ్, నిర్మాణ దశల వివరాలు తెలుసుకున్నారు. ప్రతి ఇల్లు గ్రౌండింగ్ కావాలని ఎంపీడీవోలు ప్రణాళికతో పర్యవేక్షించాలని ఆదేశించారు. లబ్ధిదారుల ఖాతాల్లోనే నిధులు జమవుతాయని స్పష్టం చేశారు.
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చేపట్టబోయే అభివృద్ధి పనులకు వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే మొహమ్మద్ నసీర్ మున్సిపల్ అధికారులకు సూచించారు. స్థానిక కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతిని ఆయన ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
TG: ఖమ్మం జిల్లాకు చెందిన విశ్రాంత AR SI మైసయ్య రిటైర్మెంట్ బకాయిలు అందక, ఆసుపత్రి ఖర్చులకు డబ్బుల్లేక ప్రాణాలు కోల్పోవడం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. జీవితకాలం ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమించిన ఒక పోలీస్ అధికారి దుస్థితికి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
MNCL: మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్లో బీజేపీ సంస్థాగత నియామకాలు చేశారు. శుక్రవారం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్ వారికి బాధ్యతలు అప్పగించారు. బీసీ మోర్చా అధ్యక్షులుగా నల్ల రవి, ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా ముల్కల్ల కుమార్, బీసీ మోర్చా అధ్యక్షులుగా నాంపల్లి శ్రీనివాస్, మహిళా మోర్చా అధ్యక్ష కార్యదర్శులుగా బైరం లక్ష్మి, అంకం సంగీత నియమితులయ్యారు.
W.G: సమాజంలో శాంతి, భద్రత, శ్రేయస్సు వర్ధిల్లాలంటే సామాజిక న్యాయం ఎంతో అవసరమని లీగల్ సర్వీసెస్ సభ్యులు వై.డి. ఫణికర్, ప్యానెల్ లాయర్ కె. శిరీష పేర్కొన్నారు. శుక్రవారం ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం సందర్భంగా లింగబోయిన చర్ల గ్రామ సచివాలయం వద్ద న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ప్రస్తుత కాలంలో పిల్లలు సోషల్ మీడియా మోసాలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.
RR: ప్రజల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకునే విధంగా జలమండలి బస్తీబాట ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. జలమండలి ఎండి అశోక్ రెడ్డి శేరిలింగంపల్లి వార్డులోని శంకర్ నగర్లో పర్యటించారు. నీటి సరఫరా సమయంలో పలు ఇళ్లలో తనిఖీలు చేసి నీటి నాణ్యతను పరిశీలించారు. రూఫ్ వాటర్, వాన నీటిని భూమిలోకి ఇంకించే విధంగా ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని ప్రజలకు తెలిపారు.
NRPT: జిల్లా టీఎన్జీవో (TNGO) యూనియన్ నూతన కార్యవర్గ సభ్యులు మంత్రి వాకిటి శ్రీహరిని ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. జిల్లా అధ్యక్షుడు నరసింహరెడ్డి మంత్రికి పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో తొలిసారిగా యూనియన్ ఏర్పాటు కావడం పట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ, కార్యవర్గ సభ్యులను శాలువాతో సన్మానించారు.
JGL: జిల్లా కలెక్టర్ కార్యాలయంలో తెలంగాణ ప్రభుత్వం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మహారాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సేవాలాల్ బోధనలు గిరిజన సమాజానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
AP: ఆయేషా మీరా హత్య కేసులో సీబీఐ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈనెల 27న ఆయేషా శరీర అవశేషాలకు ఆచారాల ప్రకారం అంత్యక్రియలు చేయాలని ఆదేశించింది. అంత్యక్రియల ప్రక్రియను రికార్డ్ చేయాలని సూచించింది. రీపోస్టుమార్టం కోసం 2019లో ఆయేషా అవశేషాలను సీబీఐ అధికారులు వెలికి తీశారు.
అన్నమయ్య: పీఎం సూర్య ఘర్, పీఎం కుసుం పథకాల అమలులో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో అన్నా క్యాంటీన్లు, మునిసిపల్ సేవలు, పారిశుద్ధ్యం, శాంతిభద్రతలపై సమీక్ష జరిగింది. పథకాల అమలు సజావుగా కొనసాగాలని సీఎస్ సూచించారు.
TG: పెద్దపల్లి జిల్లాలో సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. మంథని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రూ.16,500 లంచం తీసుకుంటూ డాక్యుమెంట్ రైటర్ రషీద్ పట్టుబడ్డారు. రైతు భూమి రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ రాజేందర్ రూ.35వేలు డిమాండ్ చేశారు. వీరిని రెడ్ హ్యాండెడ్గా అధికారులు పట్టుకున్నారు.
MDCL: మల్కాజిగిరి ఎంపీ ఈటెల రాజేందర్ శుక్రవారం అల్వాల్ పట్టణ పరిధిలోని బొల్లారం రైల్వే స్టేషన్ను సందర్శించారు. నిజామాబాద్–రాయలసీమ ఎక్స్ప్రెస్కు బొల్లారం స్టేషన్లో నిలుపుదల కల్పించామని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక బీజేపీ నాయకులు విశాఖ ఎక్స్ప్రెస్, నాగావళి ఎక్స్ప్రెస్, నాగర్సోల్ ఎక్స్ప్రెస్ రైళ్లకు కూడా హాల్ట్ ఇవ్వాలని కోరారు.
VKB: పెండింగ్ కేసులపై దృష్టి సారించాలని ఎస్పీ స్నేహ మెహ్రా తెలిపారు. శుక్రవారం జిల్లా కార్యాలయంలో పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కేసుల దర్యాప్తులో జాప్యం లేకుండా వేగవంతంగా విచారణ పూర్తి చేయాలని తెలిపారు. బాధితులకు సత్వరమే న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
MDK: దేశ ప్రజలకు సేవలాల్ మహారాజ్ ఆదర్శప్రాయుడని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అదునపు కలెక్టర్ నగేష్ పేర్కొన్నారు. నర్సాపూర్ పట్టణంలో సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి పురస్కరించుకొని ర్యాలీ నిర్వహించారు. గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడి వారి ఔన్నత్యానికి పునాదులు వేశారని సేవాలాల్ మహారాజును కొనియాడారు. ఆయన ఆధ్యాత్మిక మార్గంలో ప్రతీ ఒక్కరు నడవాలన్నారు.
MBNR: భూత్పూర్ మున్సిపాలిటీ కొత్త ఛైర్మన్గా బాలకోటి మున్సిపల్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. మున్సిపాలిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తానని, వార్డుల సమస్యలను దశలవారీగా పరిష్కరిస్తానని.. సీసీ రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ వంటి మౌలిక వసతుల కల్పనకు కౌన్సిలర్ల సహకారంతో కృషి చేస్తానని చెప్పారు.