• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

గ్రామ పంచాయతీల ఆదాయ వృద్ధిపై శిక్షణ

NDL: గ్రామ పంచాయతీలు సొంత ఆదాయ వనరులు పెంపొందించుకోవాలని ఎంపీడీవో మేరీ సూచించారు. శుక్రవారం కొత్తపల్లి ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక కార్యాచరణ, ప్రణాళిక శిక్షణ నిర్వహించారు. గ్రామాల్లో ఆస్తి, ఇతర పన్నుల ద్వారా ఆదాయం సృష్టించాలని ఆమె కోరారు. పంచాయతీల ఆర్థిక స్థిరీకరణకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుందని వివరించారు.

February 21, 2026 / 06:17 AM IST

రేణిగుంటలో వాహన తనిఖీలు

TPT: రేణిగుంట పట్టణంలో ఎంటీఆర్ సర్కిల్ వద్ద శుక్రవారం సాయంత్రం వాహనాల తనిఖీలు నిర్వహించారు. సీఐ జయచంద్ర ఆధ్వర్యంలో SI ధర్మారెడ్డి, ఆర్టీవో శ్రీనివాసరావు, సిబ్బంది సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. అధిక కాంతి వెలువరించే LED బల్బులు అమర్చిన వాహనాలను గుర్తించి తొలగించేశారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

February 21, 2026 / 06:16 AM IST

3D ప్రింటింగ్ సాంకేతికతపై రెండు రోజుల శిక్షణ

అల్లూరి: స్వయం సహాయక సంఘాల గిరిజన మహిళలు, హస్తకళల వస్తువులను విక్రయించే మహిళలకు వచ్చేనెల 9,10వ తేదీల్లో ఆధునిక 3D ప్రింటింగ్ సాంకేతికతపై రెండు రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో శ్రీపూజ తెలిపారు. పాడేరు కాఫీ హౌస్‌లో జరిగే శిక్షణకు 10వ తరగతి అర్హత కలిగిన మహిళలు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. మహిళలు మార్చి 5లోగా పాడేరు ఐటీడీఏ కార్యాలయంలో ధరఖాస్తులు అందించాలన్నారు.

February 21, 2026 / 06:16 AM IST

కమ్మర్‌పల్లిలో హిందూ రాష్ట్ర జాగృతి సభ

NZB: కమ్మర్‌పల్లిలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హిందూ జన జాగృతి సమితి ఆధ్వర్యంలో ‘హిందూ రాష్ట్ర జాగృతి సభ’ శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సమితి రాష్ట్ర సమన్వయకర్త చైతన్య గాడి, శ్రీమతి తేజస్వి వెంకటాపూర్ ప్రసంగిస్తూ.. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని పిలుపునిచ్చారు.ఈ ప్రదర్శన భక్తులను ఆకట్టుకుంది.

February 21, 2026 / 06:15 AM IST

అన్నమయ్య: జిల్లాకు వర్ష సూచన..!

అన్నమయ్య: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరిత ఆవర్తనం ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. మిగతా జిల్లాల్లో కూడా కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.

February 21, 2026 / 06:14 AM IST

మార్చి 28న జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు

సత్యసాయి: గోరంట్ల మండలంలోని కరవులపల్లి తండా వద్ద శ్రీరామనవమి పురస్కరించుకుని మార్చి 28న జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలు నిర్వహించనున్నారు. అభయాంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఈ పోటీలు జరుగుతాయి. విజేతలకు రూ. లక్ష ప్రథమ బహుమతి అందజేస్తారు. ఆసక్తిగల వారు మార్చి 27లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు కోరారు.

February 21, 2026 / 06:14 AM IST

నేడు రాప్తాడులో పర్యటించనున్న ఎమ్మెల్యే

ATP: ఎమ్మెల్యే పరిటాల సునీత ఇవాళ రాప్తాడు నియోజకవర్గ కేంద్రంలో పర్యటించనున్నారు. ఉదయం 10:30 గంటలకు ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించే ‘స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణ ఆంధ్ర’ కార్యక్రమంలో ఆమె పాల్గొంటారు. అనంతరం రాప్తాడు ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేస్తారు. కార్యకర్తలు, నాయకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

February 21, 2026 / 06:12 AM IST

నేడు జిల్లాలో పర్యటించనున్న ఎమ్మెల్యే

NLR: ఇందుకూరుపేట మండలంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇవాళ పర్యటించనున్నారు. ఉదయం 9:30 గంటలకు కొత్తూరు కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో జరిగే స్వచ్ఛ ఆంధ్రా-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉదయం 10:30గంటలకు శ్రీ ఇందుపూరమ్మ-దేశమ్మ దేవతల మహా కుంభాభిషేకంలో పాల్గొంటారు అని తెలిపారు.

February 21, 2026 / 06:12 AM IST

ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసులో పురోగతి

AP: విజయవాడ భవానీపురంలో ఇద్దరు పిల్లల మిస్సింగ్ కేసులో పురోగతి లభించింది. ట్యూషన్‌కు వెళ్లకుండా మేరారామ్(12), ఉమారామ్ (13) డబ్బులు తీసుకుని ఆటోలో బస్టాండ్‌కు వెళ్లినట్లు సమాచారం. నిన్న విజయవాడ బస్టాండ్ నుంచి ముంబై వెళ్లారు. పిల్లలు గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్తుండగా పోలీసులు గుర్తించారు. పిల్లలను క్షేమంగా తల్లిదండ్రలకు అప్పగించారు.

February 21, 2026 / 06:12 AM IST

నేడు చేబ్రోలులో తాగునీటి సరఫరా నిలిపివేత

GNTR: చేబ్రోలు పంచాయతీ పరిధిలో శనివారం తాగునీటి సరఫరాకు అంతరాయం కలగనున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో రవిశంకర్ తెలిపారు. RSF ఫిల్టర్ బెడ్స్, సంప్ క్లీనింగ్ పనుల కారణంగా చేబ్రోలుతో పాటు కొత్తరెడ్డిపాలెం, పాతరెడ్డిపాలెం గ్రామాలకు నీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు.కావున ప్రజలు ఈ మార్పును గమనించి అధికారుల పనులకు సహకరించాలని కోరారు.

February 21, 2026 / 06:11 AM IST

నేడు మండలంలో ఎమ్మెల్యే పర్యటన

VSP: పరవాడ మండలంలో పలుగ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉదయం 9 గంటల నుంచి పర్యటిస్తారని కూటమి నాయకులు నాగిరెడ్డి చిన్నారావు తెలిపారు. రూ. 4. 40 కోట్లతో చేపడుతున్న జాజులవానిపాలెం-దళాయిపాలెం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం లంకెలపాలెం పైవంతెన, లంకెల పాలెం-పెదముషిడివాడ రహదారిని పరిశీలిస్తారన్నారు.

February 21, 2026 / 06:11 AM IST

నేడు మండలంలో పర్యటించనున్న ఎమ్మెల్యే

VSP: పరవాడ మండలంలో పలుగ్రామాల్లో ఇవాళ ఎమ్మెల్యే రమేష్ బాబు ఉదయం 9 గంటల నుంచి పర్యటిస్తారని కూటమి నాయకులు నాగిరెడ్డి చిన్నారావు తెలిపారు. రూ. 4. 40 కోట్లతో చేపడుతున్న జాజులవానిపాలెం-దళాయిపాలెం రహదారి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేస్తారన్నారు. అనంతరం లంకెలపాలెం పైవంతెన, లంకెల పాలెం-పెదముషిడివాడ రహదారిని పరిశీలిస్తారన్నారు.

February 21, 2026 / 06:11 AM IST

హోలీ వేళ ప్రయాణికులకు ప్రత్యేక రైళ్లు

ATP: హోలీ రద్దీని దృష్టిలో ఉంచుకుని జిల్లా మీదుగా ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి. యశ్వంతపూర్ నుంచి ధన్‌బాద్‌కు ఈనెల 21 నుంచి ఏప్రిల్ 25 వరకు ప్రతి శనివారం వీక్లీ రైలు (06563) నడవనుంది. తిరుగు ప్రయాణంలో (06564) సోమవారాల్లో అందుబాటులో ఉంటుంది. అలాగే యశ్వంతపూర్-హజ్రత్ నిజాముద్దీన్‌కు ఈనెల 25న ప్రత్యేక రైలు (06569) నడుస్తుందని అధికారులు తెలిపారు.

February 21, 2026 / 06:11 AM IST

మంత్రాలయంలో కళాకారుల నాట్య వైభవం

KRNL: మంత్రాలయం రాఘవేంద్రస్వామి గురు వైభవోత్సవాలు మూడో రోజైన శుక్రవారం ఆధ్యాత్మిక శోభతో విలసిల్లాయి. యోగేంద్ర కళా మండపంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను మంత్రముగ్ధుల్ని చేశాయి. డాక్టర్ పద్మిని సంగీత కచేరి వీనులవిందుగా సాగగా, బెంగళూరుకు చెందిన నాటేశ్వర నృత్య కళాకారులు భరతనాట్యం, కూచిపూడి ప్రదర్శనలతో భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తారు.

February 21, 2026 / 06:11 AM IST

విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందజేసిన ఎమ్మెల్యే

MBNR: మూసాపేట మండలం ఆచ్చాయిపల్లి గ్రామానికి చెందిన నరేష్, మైబు అనే విద్యార్థులు హైదరాబాద్లో బీటెక్ చదువుతున్నారు. వారి ఉన్నత చదువులకు లాప్‌టాప్‌లు అవసరముందని బోయిని చంద్రశేఖర్ ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే, విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లను అందజేశారు. కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు.

February 21, 2026 / 06:10 AM IST