• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి కొత్త టారిఫ్‌లు: వైట్ హౌస్

సుంకాలపై అమెరికా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్.. ప్రపంచ దేశాలపై మళ్లీ 10 శాతం టారిఫ్‌లు విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై తాజాగా సంతకం చేశారు. ఈ మేరకు తన ట్రూత్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ టారిఫ్‌లు ఫిబ్రవరి 24 నుంచి అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ వెల్లడించింది. ఈ సుంకాలు 150 రోజులపాటు అమలులో ఉంటాయని తెలిపింది.

February 21, 2026 / 06:57 PM IST

జనసేన జిల్లా సమన్వయకర్తగా రవికుమార్

SKLM: జనసేన పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి సంబంధించి పార్లమెంటు నియోజకవర్గాల సభ్యత్వ నమోదు సమన్వయకర్తల పేర్లను శనివారం పార్టీ ప్రకటించింది. ఈ మేరకు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గానికి సుడా ఛైర్మన్ కోరికన రవి కుమార్‌‌ను సభ్యత్వ నమోదు సమన్వయకర్తగా నియమించింది. జిల్లాలో గతంలో కంటే ఎక్కువ సంఖ్యలో జనసేన పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేస్తామన్నారు.

February 21, 2026 / 06:56 PM IST

వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ప్రభుత్వ విప్

MHBD: దంతాలపల్లి మండలం రామానుజాపురం గ్రామ సర్పంచ్ అక్కిరెడ్డి దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో శనివారం మెగా ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. ప్రభుత్వవిప్, డోర్నకల్ MLA డా.రాంచందర్ నాయక్ కార్యక్రమానికి అతిథిగా హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. గ్రామస్తుల సౌకర్యార్థం శిబిరాన్ని ఏర్పాటుచేయడం అభినందనీయ విషయమన్నారు. తొర్రూరు ఏఎంసీ ఛైర్మన్ బట్టునాయక్ తదితరులున్నారు.

February 21, 2026 / 06:55 PM IST

అది ఏకసభ్య కమిషన్ కాదు.. టీడీపీ కమిషన్: మల్లాది 

AP: రాష్ట్ర ప్రభుత్వం లడ్డూ కల్తీ నెయ్యి వ్యవహారంపై ఏకసభ్య కమిషన్‌ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే అది ఏకసభ్య కమిషన్ కాదని.. టీడీపీ కమిషన్ అని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. తిరుమల లడ్డూ ప్రసాదాన్ని కూటమి ప్రభుత్వం రాజకీయం చేసిందని విమర్శించారు. సీబీఐ రిపోర్టు ఇచ్చిన జగన్‌పై బురద చల్లడం మానుకోలేదని మండిపడ్డారు.

February 21, 2026 / 06:54 PM IST

ఖాదీ అంటే కలెక్షన్లు కాదు సర్వీస్: ఎమ్మెల్యే

KMR: ఖాదీ అంటే కలెక్షన్లు కాదని, సర్వీస్ అనే దిశగా తాను పని చేస్తున్నట్లు MLA కె.వి రమణారెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. తాను లెటర్లు రాస్తే వచ్చిన నిధులను తానే తెచ్చానని ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ చెప్పుకుంటూ ఇంచార్జీ మంత్రిని తీసుకువచ్చి ప్రారంభోత్సవాలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

February 21, 2026 / 06:52 PM IST

23 నుంచి ప్రజావాణి కార్యక్రమం నిర్వహణ

MNCL: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిలిపివేసిన ప్రజావాణి కార్యక్రమం ఈనెల 23 నుంచి నస్పూర్‌లోని మంచిర్యాల కలెక్టరేట్‌లో యధాతధంగా నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. ప్రజలు, దరఖాస్తుదారులు ఈ విషయాన్ని గమనించాలని, తమ సమస్యలపై దరఖాస్తులు అందజేయవచ్చని వెల్లడించారు.

February 21, 2026 / 06:51 PM IST

బస్సులో గుండెపోటుతో ప్రయాణికుడు మృతి

SKLM: శ్రీకాకుళం నుంచి పాలకొండకు వెళ్తున్న బస్సులో శనివారం సాయంత్రం ఓ ప్రయాణికుడు గుండెపోటుతో రావడంతో చింతాడ వద్ద బస్సును నిలుపుదల చేసి 108కి చెప్పండి సమాచారమిచ్చారు. దీంతో 108 చేరుకుని బస్సులో ఉన్న ప్రయాణికుని 108లోకి ఎక్కించే సమయంలో ప్రయాణికుడు మృతి చెందినట్లు గుర్తించారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది .

February 21, 2026 / 06:50 PM IST

సేవాలాల్ జయంతి వేడుకల్లో ఎమ్మెల్యే

KMM: వైరా నియోజకవర్గం పాత తండాలోని రైతు వేదికలో శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ మాలోత్ రాందాస్ నాయక్ గారు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన జాతి అభ్యున్నతికి సేవాలాల్ మహారాజ్ చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు.

February 21, 2026 / 06:48 PM IST

సంఘం బస్తీలో గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం

ASF: కాగజ్ నగర్ సంఘం బస్తీలో శనివారం గ్యాస్ సిలిండర్ పేలి ఓ ఇంట్లో ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో అక్కడ ఉన్న పలువురికి గాయాలవ్వగా, స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాద తీవ్రతకు ఇంటి సామాగ్రి ధ్వంసమైంది. పేలుడుకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు.

February 21, 2026 / 06:48 PM IST

హత్య కేసు ఛేదించిన పోలీసులు.. నిందితురాలు అరెస్ట్

RR: చేవెళ్ల పట్టణ కేంద్రంలోని పుష్కరని వద్ద జరిగిన కరుణాకర్ హత్య కేసును పోలీసులు చేదించారు. పోలీసుల వివరాలు.. గత ఆరేళ్లుగా కలిసి ఉంటున్న కరుణాకర్, బాలమని శివరాత్రి జాతర సందర్భంగా పుష్కరిని వద్ద మద్యం సేవించారు. డబ్బులు విషయంలో వాగ్వాదం జరగడంతో కరుణాకర్ పై కట్టెతో బాలమణి దాడి చేసి పుష్కరిణిలో తోసేయగా మృతి చెందాడు. నిందితురాలు బాలమణిని పోలీసులు అరెస్టు చేశారు.

February 21, 2026 / 06:48 PM IST

బీజేపీ ఎమ్మెల్యే అరెస్ట్

కర్ణాటక రాజకీయాల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎమ్మెల్యే చంద్రూలమానీ అరెస్ట్ అయ్యారు. రూ.10 లక్షల లంచం తీసుకున్న కేసులో ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన ఇద్దరు పీఏలను కూడా అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన పీఏ మంజునాథ్ వాల్మీకి, ప్రైవేట్ సహాయకుడు గురు లమానీలను కూడా అధికారులు అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.

February 21, 2026 / 06:46 PM IST

మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు: మంచిరెడ్డి

HYD: ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడారు. పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికలను అడ్డుకున్నారని పేర్కొన్నారు. కోర్టు స్టే పేరుతో ధ్రువీకరణ పత్రం ఇవ్వలేదని ఆరోపించారు. 

February 21, 2026 / 06:45 PM IST

డీజిల్ లోకో షెడ్‌ను తనిఖీ చేసిన డీఆర్‌ఎం

VSP: వాల్తేరు రైల్వే డివిజన్ డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బోహ్రా శనివారం డీజిల్ లోకో షెడ్‌ను పరిశీలించారు. కొనసాగుతున్న కార్యకలాపాలు, మౌలిక సదుపాయాల నవీకరణలు, సాంకేతిక మార్పుల పురోగతిని సమీక్షించారు. సిమెన్స్ సంస్థ ద్వారా 300 లోకోమోటివ్‌ల నిర్వహణ కోసం చేపట్టిన ప్రాజెక్ట్ పురోగతిపై ప్రత్యేకంగా చర్చించారు.

February 21, 2026 / 06:45 PM IST

అగ్రి షోలు రైతులకు మార్గదర్శకం: సునీల్ కుమార్

BHPL: ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించేందుకు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం BHPL, కాటారం డివిజన్‌లకు చెందిన 50 మంది రైతులను HYDలో జరుగుతున్న “రైతుబడి అగ్రి షో”కు తీసుకెళ్లారు. ఆధునిక సాంకేతికత అవలంబిస్తే తక్కువ వ్యయంతో అధిక దిగుబడులు సాధ్యమని, ఇలాంటి అగ్రి షోలు రైతులకు మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు.

February 21, 2026 / 06:43 PM IST

గుడ్లవల్లేరులో మండల పరిషత్ సర్వసభ్య సమావేశం

కృష్ణా: గుడ్లవల్లేరు మండల పరిషత్ కార్యాలయంలో ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం జరిగింది. ఈ సందర్భంగా శాఖల వారీగా అమలవుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రస్తుత పరిస్థితులు, పెండింగ్ పనులపై ఎంపీడీవో ఇమ్రాన్ సమీక్షించారు. ప్రభుత్వ పథకాల అమలును వేగవంతం చేయడంతో పాటు ప్రజలకు సేవలను సమర్థవంతంగా అందించాలని అధికారులకు సూచించారు.

February 21, 2026 / 06:42 PM IST