ADB: కామారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడికి నిరసనగా బీజేపీ నాయకులు చలో కామారెడ్డి కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు కార్యక్రమానికి బయలుదేరకుండా పోలీసులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో దాడులు, ప్రతి దాడులు సరైనవి కాదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ పేర్కొన్నారు.
ASR: గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్యకరమైన అడ్డపిక్కల కొనుగోలుకు ప్రజలు అధికంగా మక్కువ చూపిస్తున్నారు. వీటిని గిరిజనులు, మైదాన ప్రాంతాల వారు కొనుగోలు చేస్తుంటారు. అల్లూరి జిల్లాలో జరిగే వారపు సంతలో వీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. మూడు, నాలుగు కేజీలుండే ప్యాకెట్ ధర రూ.500 పలుకుతుంది. కష్టానికి తగిన ఫలితం దక్కుతుందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
గుంటూరు: పొన్నూరులో పరదాల మాటున మద్యం విక్రయాలు కొనసాగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. జీబీసీ రోడ్డులో బాపట్ల బస్టాండ్, ఆటో స్టాండ్ సమీప వైన్స్ షాపుల్లో తెల్లవారుజామునే అమ్మకాలు సాగుతున్నాయని తెలిపారు. ప్రయాణికులు, మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’ మూవీతో కోలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. దర్శకుడు విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తమిళ, తెలుగు భాషల్లో రూపొందించిన ఈ సినిమా వాస్తవిక కథనంతో పాటు వాణిజ్య అంశాలతో అలరించనుంది. ఇక ఈ సినిమాలో ఆరి అర్జున్, అమ్ము అభిరామి, కిషోర్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
NLR: చేపల దుకాణాలలో తనిఖీలు నిర్వహించి తూకాలలో లోపాలు ఉన్న 15 కాంటాలను సీజ్ చేశామని తూనికుల అధికారి శాఖ ఇన్స్పెక్టర్ రియాజ్ అహ్మద్ తెలిపారు. తూనికలలో తేడాలు వస్తున్నాయని వినియోగదారుల ఫిర్యాదు మేరకు బుచ్చిరెడ్డిపాలెం చాపల దుకాణాలపై దాడులు చేశారు. చేతి కర్ర కాంటాలు వాడొద్దని వ్యాపారస్తులకు సూచించారు. కాంటాలు కొనుగోలు చేసేటప్పుడు సీలు వేయించుకుని లైసెన్సులు తీసుకోవాలన్నారు.
BDK: అశ్వాపురం మండలంలోని శ్రీ సాయి బాబా ఆలయం భక్తుల సందడితో ఆదివారం ముస్తాబవుతోంది. శ్రీ శిర్డీ సాయి బాబా ఆరాధనలో భాగంగా 32 వ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఆలయ నిర్వాహకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి 23న జరగనున్న ఈ ఉత్సవాలకు ఆ ప్రాంతం మొత్తం పండుగ వాతావరణం నెలకొంది.
నాగర్ కర్నూల్: కుమ్మెర జాతరలో కాంగ్రెస్ నాయకుల దాడిలో రెండు నెలల చిన్నారి మృతి చెందడం అమానుషమైన ఘటన అని బీఆర్ఎస్వీ పాలమూరు యూనివర్సిటీ అధ్యక్షులు గడ్డం భరత్ బాబు అన్నారు. ఆయన మాట్లాడుతూ.. చిలుకేశ్వరం చాకలి చంద్రకళ దైవదర్శనం కోసం వెళ్తే కాంగ్రెస్ నాయకులు దాడి చేసి, పసికందు మృతికి కారణమైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
VSP: గాజువాకలోని పెట్రోల్ బంక్ జంక్షన్ వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక ద్విచక్ర వాహనదారుడు దుర్మరణం పాలయ్యాడు. వేగంగా వచ్చిన భారీ వాహనం ద్విచక్ర వాహనాన్ని బలంగా ఢీకొనడంతో, సదరు వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న గాజువాక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
SKLM: మందసలో వెలసిన శ్రీ వాసుదేవ పెరుమాళ్లు స్వామి వారిని పలాస టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త వెంకన్న చౌదరి, స్థానిక నాయకులుతో కలిసి స్వామి వారిని ఆదివారం దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు నాగ రాజు తదితరులు ఉన్నారు.
ATP: గార్లదిన్నె మండలం తిమ్మంపేటకు చెందిన సిరిచాటి రవి, నాగరత్నమ్మ కుమార్తె నవనీత వివాహానికి ఏడీసీసీ బ్యాంక్ ఛైర్మన్ ముంటిమడుగు కేశవరెడ్డి ఆదివారం రూ.10వేలు ఆర్థిక సాయం అందజేశారు. నిరుపేద కుటుంబాలకు అండగా నిలవడం సంతోషకరమని పేర్కొన్నారు. నూతన వధూవరులు సుఖసంతోషాలతో ఉండాలని ఆయన ఆకాంక్షించారు.
ELR: జంగారెడ్డిగూడెం పట్టణం విశాఖపట్నంతో పోటీపడే సత్తా ఉందని ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. ఆదివారం జంగారెడ్డిగూడెం కూడా పట్టణంలో హ్యాపీ సండే కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడారు. జంగారెడ్డిగూడెం పట్టణానికి ఆదాయం పెంచే విధంగా ప్రాజెక్టులను తీసుకువచ్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని అన్నారు. దీంతో పట్టణ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు.
నిర్మల్: కడెం మండలం అల్లంపెల్లిలోని జీయర్ గురుకులం విద్యార్థిని గోపు నిహారిక ఆర్చరీలో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించింది. ఇటీవల ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి ‘సీఎం-కప్’ అర్చరీ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి వెండి పథకం సాధించిందని పాఠశాల ప్రధానోపాధ్యాయులు చక్రధర్ తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థిని అభినందించారు.
AP: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు, అసైన్డ్ భూముల వ్యవహారంలో గతంలో చంద్రబాబుపై ఫిర్యాదు చేసిన మాజీ MLA ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ అధికారులు నోటీసులు జారీ చేశారు. అప్పట్లో ఆయన చేసిన ఫిర్యాదులపై సరైన సాక్ష్యాధారాలు లేవని సీఐడీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో, ఈనెల 27న విజయవాడ ఏసీబీ కోర్టుకు విచారణ నిమిత్తం హాజరుకావాలని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు.
ఆదాయ పన్ను ముసాయిదా నిబంధనలు-2026 పేరిట ఐటీ శాఖ కీలక ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఈ ముసాయిదా ప్రకారం.. ఒక ఆర్థిక ఏడాదిలో క్రెడిట్ కార్డు ద్వారా రూ.10 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ విలువైన లావాదేవీలు చేస్తే.. ఆ వివరాలను బ్యాంకులు ఐటీ శాఖకు నివేదిస్తాయి. అలాగే రూ.లక్ష, అంత కంటే ఎక్కువ నగదు చెల్లింపులు చేసినా వివరాలు అందిస్తాయి. దీందో ఖర్చుచేసే వారిపై ఐటీ శాఖ నిఘా పెరుగుతుంది.
WGL: కొమ్మాల శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థాన డైరెక్టర్గా ఆరేపల్లి హవేలీ గ్రామానికి చెందిన దుకిరే వినయ్ కుమార్ నియమితులయ్యారు. రేపటి నుంచి ఆలయంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నియామకానికి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సందర్భంగా వినయ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.