• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

‘బీ.ఆర్ నాయుడిని ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలి’

E.G: టీటీడీ ఛైర్మన్ పదవికి కళంకం తెచ్చిన బి.ఆర్ నాయుడును పదవి నుంచి తొలగించాలని మాజీ హోంమంత్రి, గోపాలపురం వైసీపీ ఇంఛార్జ్ తానేటి వనిత డిమాండ్ చేశారు. శనివారం నల్లజర్ల గ్రామంలోని శ్రీ రామకృష్ణ భక్త మందిరం వద్ద వైసీపీ శ్రేణులతో నిరసన తెలిపారు. అనైతిక కార్యకలాపాలు చేస్తూ, వివాదాస్పద వ్యవహార శైలితో బీఆర్ నాయుడు టీటీడీ పవిత్రతను దెబ్బతిస్తున్నారన్నారు.

April 4, 2026 / 02:02 PM IST

పసుమర్రు వద్ద రోడ్డు ప్రమాదం ఒకరు మృతి

PLD: చిలకలూరిపేట మండలం పసుపు గ్రామం వద్ద శనివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు కారు, బైకు ఢీకొన్న క్రమంలో పసుమూరు గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి మృతి చెందడం జరిగిందని తెలిపారు. ఈ నేపథ్యంలో స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

April 4, 2026 / 02:00 PM IST

రేపు బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు: కలెక్టర్

సత్యసాయి: పుట్టపర్తి కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ మీటింగ్ హాల్‌లో ఏప్రిల్ 5న డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టర్ శ్యాంప్రసాద్, ప్రజాప్రతినిధులు, అధికారులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

April 4, 2026 / 02:00 PM IST

బండారులంక ప్రత్యేక అధికారిగా తహసీల్దార్

కోనసీమ: అమలాపురం మండలం బండారులంక గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిగా అమలాపురం తహసీల్దార్ వాసా సామ్యూల్ దివాకర్ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గ్రామంలో పారిశుద్ధ్యం మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు. ఆయనకు సచివాలయ సిబ్బంది, కూటమి నేతలు స్వాగతం పలికారు.

April 4, 2026 / 02:00 PM IST

రేపు జగ్జీవన్ రామ్ జయంతి: కలెక్టర్

ప్రకాశం: డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 118వ జయంతి కార్యక్రమాన్ని ఆదివారం ఉదయం 10 గంటలకు మార్కాపురం కలెక్టరేట్ ప్రాంగణంలో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ విజయ సునీత తెలిపారు. ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ జయంతిని రాష్ట్ర పండుగగా ఘనంగా నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులు, షెడ్యూల్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

April 4, 2026 / 02:00 PM IST

ఏలూరులో బీ.ఆర్ నాయుడుకు వ్యతిరేకంగా నినాదాలు

ELR: తిరుమల తిరుపతి ఛైర్మన్ బీ ఆర్ నాయుడు అనైతిక కార్యకలాపాల వలన తిరుమల అప్రతిష్టపాలు అవుతుందని ఏలూరు నియోజకవర్గ వైసీపీ ఇన్‌ఛార్జ్ మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. శనివారం బీ ఆర్ నాయుడు రాజీనామా చెయ్యాలని లేదా తక్షణమే ప్రభుత్వం అతన్ని ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని RR పేట నందు గల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

April 4, 2026 / 02:00 PM IST

వై జంక్షన్ వద్ద హెల్మెట్ వినియోగంపై అవగాహన

NTR: నందిగామ వై జంక్షన్ వద్ద హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీపీ రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు, ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం మార్గదర్శకత్వంలో ఎస్‌ఐ నరేష్ ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో హెల్మెట్ ధరించడం ప్రాణరక్షణకు అవసరమని వివరించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, లైసెన్స్, ఇన్సూరెన్స్ తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

April 4, 2026 / 02:00 PM IST

సెహ్వాగ్-గంభీర్ రికార్డుపై వైభవ్-జైస్వాల్ కన్ను

IPL 2026: రాజస్థాన్ యువ ఓపెనర్లు యశస్వీ జైస్వాల్ & వైభవ్ సూర్యవంశీ భారీ రికార్డుపై కన్నేశారు. ఇవాళ గుజరాత్‌పై ఇద్దరూ కలిసి మరో 3 రన్స్ చేస్తే చాలు.. IPLలో అత్యంత వేగంగా(246* బాల్స్) 500 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలుస్తారు. ప్రస్తుతం ఈ రికార్డు 309 బంతుల్లో 500 రన్స్ చేసిన వీరేంద్ర సెహ్వాగ్-గౌతమ్ గంభీర్(ఢిల్లీ డేర్‌డెవిల్స్) పేరిట ఉంది.

April 4, 2026 / 02:00 PM IST

తత్తూరు రంగనాథ స్వామిని దర్శించుకున్న ఎమ్మెల్యే

NDL: జూపాడుబంగ్లా మండలం తత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీలక్ష్మి సమేత శ్రీ రంగనాథస్వామిని ఎమ్మెల్యే గిత్త జయసూర్య పార్లమెంట్ ఇంఛార్జ్ మాండ్ర శివానందరెడ్డి శనివారం దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, ఆలయ కమిటీ ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి ఎద్దుల పెద్ద బండలాగుడు పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

April 4, 2026 / 02:00 PM IST

వింజమూరులో వైసీపీ నేతల నిరసన

NLR: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తన పదవి నుంచి వైదొలగాలని ఉదయగిరి వైసీపీ సమన్వయకర్త మేకపాడు రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో వింజమూరులోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనైతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ టీటీడీ ఛైర్మన్ పదవికి కళంకం తెచ్చిన బీఆర్ నాయుడు తన పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

April 4, 2026 / 02:00 PM IST

రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతింది: ఎమ్మెల్యే

KRNL: టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఇవాళ ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆర్&బీ గెస్ట్ హౌస్ నుంచి శ్రీ పాండురంగ స్వామి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు నాయుడు చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు.

April 4, 2026 / 02:00 PM IST

కర్బూజాతో ఆరోగ్య ప్రయోజనాలు

కర్బూజా వేసవిలో శరీరానికి అమృతం వంటిది. ఇందులో 90 శాతానికి పైగా నీరు ఉండటం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులోని విటమిన్ ఏ, సి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా చర్మం, కళ్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. లైకోపీన్ అనే యాంటీ ఆక్సిడెంట్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. అధిక బరువు తగ్గాలనుకునే వారికి, జీర్ణక్రియ సాఫీగా సాగడానికి ఇది ఉపయోగపడుతుంది.

April 4, 2026 / 01:55 PM IST

చేబ్రోలులో CMRF చెక్కులు పంపిణీ

GNTR: చేబ్రోలు మండలంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అనారోగ్య బాధితులకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక సాయాన్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ అందజేశారు. లబ్ధిదారలకు మొత్తం రూ.3,98,802లను పంపిణీ చేశారు. అత్యవసర వైద్య చికిత్సలకు అవసరమైన సహాయం అందించడంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ముందుంటుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు.

April 4, 2026 / 01:54 PM IST

రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సవాల్

TG: సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి బండి సంజయ్ బహిరంగ సవాల్ విసిరారు. ఎన్నికల హామీలు అమలవుతున్నాయని నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, లేదంటే CM రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. అబద్ధాలు చెప్పడంలో రేవంత్‌కు ఆస్కార్ ఇవ్వొచ్చని ఎద్దేవా చేశారు. హర్యానా, మహారాష్ట్ర, బీహార్‌లో కాంగ్రెస్ ఓటమికి రేవంతే కారణమని.. కేరళంలోనూ అదే పునరావృతమవుతుందని విమర్శించారు.

April 4, 2026 / 01:51 PM IST

సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన వైస్ ఛైర్మన్

MHBD: దంతాలపల్లి రైతు వేదికలో అర్హులైన లబ్ధిదారులకు తొర్రూరు మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ బట్టు సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ చేశారు. వైస్ చైర్మన్ మాట్లాడుతూ.. పేద ప్రజల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా లబ్ధి పొందాలన్నారు.

April 4, 2026 / 01:51 PM IST