MHBD: జిల్లా గంగారాం మండలం వెంకమ్మగుంపు గ్రామానికి చెందిన క్రీడాకారులకు శుక్రవారం ఉదయం యువ ఫౌండేషన్ సభ్యులు క్రీడా దుస్తులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ.. మారుమూల ఏజెన్సీగుడాలలో మంచి క్రీడానైపుణ్యం కలిగిన యువకులు ఉన్నారని, వారిని ప్రోత్సహించిన ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని అన్నారు. యువతతోనే ఏజెన్సీఅభివృద్ధి సాధ్యమన్నారు.
ASR: రాజవొమ్మంగి మండలం జడ్డంగి మడేరు ఆనకట్ట వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. అన్నవరంలో వివాహానికి హాజరై కొండపల్లికి తిరిగి వస్తుండగా కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను జడ్డంగి పోలీసులు వెంటనే స్థానిక పీహెచ్సీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
SDPT: ఐటీ హాబ్ మేనేజర్ నరేందర్ గౌడ్ మహిళా అభ్యర్థులకు సువర్ణావకాశం ప్రకటించారని తెలిపారు. హైదరాబాద్ సోలార్ కంపెనీలో ఉద్యోగాల కోసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు, హిందీ భాషలో ప్రావీణ్యం ఉన్నవారు అర్హులన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు 20వ తేదీ వరకు https://forms.gle /AoKByEro8EvtckD67 దరఖాస్తు చేసుకోవాలన్నారు.
KKD: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ‘గ్రీవెన్స్’ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ షన్మోహన్ తెలిపారు. కలెక్టరేట్ ప్రజావాణి హాలులో సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. జిల్లా స్థాయి అధికారులు 3:45 గంటలకే హాజరు కావాలని సూచించారు. ఉద్యోగులు తమ సర్వీసుపై సమస్యలపై వినతులు సమర్పించాలన్నారు
SRD: గంజాయి తరలిస్తూ పట్టుబడ్డ ఇద్దరికి 20 ఏళ్లు జైలు శిక్ష, రూ.2 లక్షల చొప్పున జరిమానా విధించారు. ఈ మేరకు సంగారెడ్డి ఫస్ట్ క్లాస్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ న్యాయమూర్తి జయంతి గురువారం తీర్పు వెలువరించారని అందోలు ఎక్సైజ్ స్టేషన్ సీఐ సాగర్ రెడ్డి తెలిపారు. 2020 సెప్టెంబరులో 850 కేజీల గంజాయిని జాదవ్ బన్సీలాల్, రాథోడ్ శంకర్ రవాణా చేస్తుండగా పట్టుకున్నారు.
అన్నమయ్య: పీలేరులో దారుణ ఘటన చోటుచేసుకుంది. రామచంద్రారెడ్డి కాలనీలో ఐదేళ్ల బాలికపై అఘాయిత్యం జరిగినట్లు సమాచారం. ఘటనపై ఆగ్రహించిన స్థానికులు నిందితుడిగా భావిస్తున్న 15 ఏళ్ల బాలుడికి దేహశుద్ధి చేశారు.అనంతరం అతడు సమీప బంధువుల ఇంట్లో తలదాచుకోగా, పీలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గాయపడిన బాలుడిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
KMR: రాష్ట్ర ఫుడ్ కమిషన్ బృందం నేడు KMR జిల్లాలో పర్యటించనుంది. కమిషన్ ఛైర్మన్, సభ్యులు ఉ.9:30 గం.కు KMR పట్టణంలోని R&B గెస్ట్ హౌస్ కు చేరుకోనున్నారు. ఉ.10:30 గం.కు మున్సిపల్ క్యాంటిన్లో ప్రజలకు విక్రయిస్తున్న పదార్థాల ధరలను తనిఖీ చేసి,11 గం.కు ZPHS పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేయనున్నారు.12 గం.కు అంగన్వాడి సెంటర్ ను,1 గం.లకు రామారెడ్డి PHCకీ వెళ్తారు.
యూట్యూబర్ అన్వేష్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ బ్లాక్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై కరాటే కళ్యాణి స్పందిస్తూ.. ‘అన్వేష్ యూట్యూబ్ ఛానల్ సహా అన్ని అకౌంట్లను డిలీట్ చేయాలని CPని కలుస్తా. అలాగే పాస్ పోర్ట్, బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాలని కోరుతా. హిందువులను అవమానించిన అతడికి శిక్ష పడేలా చేస్తా’ అని తెలిపింది. దీంతో అన్వేష్ యుట్యూబ్ కూడా బ్లాక్ అవుతుందా అని SMలో చర్చ జరుగుతోంది.
E.G: నిడదవోలు మండలంలోని రావిమెట్ల గ్రామ శివారులో అక్రమంగా కోడిపందాలు నిర్వహిస్తున్న నలుగురు వ్యక్తులను సమిశ్రగూడెం పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 1,000 నగదుతో పాటు ఒక కోడిపుంజును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నియోజకవర్గంలో ఎక్కడైనా జూదం, కోడిపందాల వంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారం అందించాలన్నారు.
KRNL: AP మోడల్ స్కూల్లో 2026-27 విద్యాసంవత్సరానికి గాను 6వ తరగతి ప్రవేశపరీక్షకు అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోడుమూరు మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఆశాజ్యోతి ఇవాళ తెలిపారు. ఈనెల23 నుంచి ఆన్లైన్లో ఆప్లికేషన్ ప్రారంభమవుతుందని, మార్చి 31లోగా విద్యార్థులంతా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న ఆన్లైన్ ఆప్లికేషన్లను సమర్పించాలన్నారు.
W.G: ఆకివీడు మండలం పెదకాపవరంలో గ్రామంలో గురువారం ఆర్ డబ్ల్యూఎస్ అధికారులు పర్యటించారు. గ్రామంలోని మంచినీటి చెరువు, ఫిల్టర్ బెడ్లు, సంపులు, మైక్రో యూనిట్ల నిర్వహణ తీరును పరిశీలించారు. ఆర్డబ్ల్యూఎస్ రాష్ట్ర సలహాదారుడు ప్రభాకర్ రావు, బ్రౌసు సంస్థ సభ్యులు డాక్టర్ సుధాకర్ శ్రీధర్, డీఎల్పీవో దోసిరెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఈ శ్రీనివాస్ పాల్గొన్నారు.
VSP: మధురవాడ జోన్లో శుక్రవారం తాగునీటి సరఫరా అంతరాయం ఉంటుందని జీవీఎంసీ అధికారులు తెలిపారు. గంభీరం వద్ద 700 మి.మీ ప్రధాన పైప్లైన్ లీకేజీ మరమ్మతుల కారణంగా వార్డు 6, 7లోని సాయిరాం కాలనీ, కొమ్మాది, బక్కన్నపాలెం, మిధిలాపురి వుడా కాలనీ, పాత మధురవాడ ప్రాంతాల్లో సరఫరా నిలిచిపోతుందని చెప్పారు. అవసరమైతే ట్యాంకర్ కోసం సంబంధిత ఏఈలను సంప్రదించాలని సూచించారు.
GDWL: లోకపావని, చల్లని తల్లి జమ్ములమ్మ అమ్మవారు నేడు శుక్రవారం సందర్భంగా విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అని ఆలయ అర్చకులు తెలిపారు. గద్వాల జిల్లా జమ్మిచేడులో వెలసిన శ్రీ జమ్ములమ్మ అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. దివ్య మంగళ స్వరూపాన్ని దర్శించుకోవడానికి తెల్లవారుజాము నుండే భక్తులు భారీ సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారనారు.
PDPL: ఐఎన్టీయూసీ రాష్ట్ర కార్యదర్శిగా రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన వికాస్ కుమార్ యాదవ్ను నియమించారు. హైదరాబాద్లో జరిగిన యూనియన్ 21వ త్రైవార్షిక ప్రతినిధుల మహా సభలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అతి చిన్న వయసులో రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించడం పట్ల వికాస్ కుమార్ కృతజ్ఞతలు తెలిపారు.
ASR: జీకేవీధి మండలం మంగళపాలెం నుంచి గుణయలంక వరకూ జరుగుతున్న రోడ్డు నిర్మాణంలో కాఫీ మొక్కలు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని బాధిత రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు. పలువురు గిరిజన రైతులకు చెందిన కాఫీ మొక్కలు పోతున్నాయన్నారు. అధికారులు కాఫీ మొక్కలు కోల్పోయిన వారికి పరిహారం చెల్లించాలని బాధితులు కోరుతున్నారు.