• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »వార్తలు

నేడు నెహ్రూ యువ కేంద్రంలో ఉద్యోగ మేళా

SKLM: నగరంలో నెహ్రూ యువ కేంద్రంలో ఇవాళ ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కె. సుధ ఓ ప్రకటనలో తెలిపారు. 85 ఖాళీల భర్తీకి ఇంటర్ ఆపై విద్యార్హత కలిగి, 30 ఏళ్లలోపు వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.

February 20, 2026 / 07:23 AM IST

చెరబండరాజు నగర్ దళిత వాసులకు రక్షణ ఆదేశాలు

HNK: భద్రఖాళీ దేవాలయ ప్రాంతంలోని చెరబండరాజు నగర్ కాలనీ దళిత వాసుల సమస్యలను మాజీ ప్రభుత్వ చీఫ్ విప్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ గురువారం స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఛైర్మన్ డా: జస్టిస్ శామీర్ అక్తర్ దృష్టికి తీసుకెళ్లారు. ఛైర్మన్ సానుకూలంగా స్పందించి తగిన రక్షణ కల్పించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

February 20, 2026 / 07:23 AM IST

జిల్లా వ్యాప్తంగా విస్తృత విజిబుల్ పోలీసింగ్

కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు జిల్లావ్యాప్తంగా విజిబుల్ పోలీసింగ్ కార్యక్రమం విస్తృతంగా అమలవుతోంది. నేరాల నియంత్రణ, ప్రజల భద్రత లక్ష్యంగా అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై కట్టుదిట్టమైన తనిఖీలు, గస్తీలు కొనసాగుతున్నాయి. సైబర్ నేరాలు, ట్రాఫిక్ నియమాలపై ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు.

February 20, 2026 / 07:22 AM IST

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమలలో టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 10-12 గంటల సమయం పడుతోంది. కంపార్ట్‌మెంట్లన్నీ నిండటంతో భక్తులు కృష్ణ తేజ గెస్ట్ హౌస్ వరకు క్యూలైన్‌లో ఉన్నారు. నిన్న శ్రీవారిని 57,682 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,020మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.65 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు.

February 20, 2026 / 07:21 AM IST

టెన్త్‌లో ఉత్తీర్ణత శాతం పెంచాలి: కలెక్టర్

WGL: జిల్లాలో టెన్త్ క్లాస్ విద్యార్థుల ఉత్తమ ఫలితాలు సాధించి ఉత్తీర్ణత శాతం పెరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ డా. సత్య శారద ప్రధానోపాధ్యాయులను ఆదేశించారు. DEO అధ్యక్షుల గురువారం సాయంత్రం ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 10 th class విద్యార్థులకు స్పెషల్ క్లాస్ నిర్వహించాలని ఉపాధ్యాయులను కోరారు.

February 20, 2026 / 07:21 AM IST

గంగమ్మ తల్లి జాతర ఘనంగా ముగింపు

అన్నమయ్య: లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన శ్రీ అనంతపురం గంగమ్మ తల్లి జాతర ఘనంగా ముగిసింది. జాతర సందర్భంగా అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించగా, వేలాది భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి అమ్మవారికి వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు.

February 20, 2026 / 07:21 AM IST

‘ఇంటర్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలి’

VKB: జిల్లాలో ఈ నెల 25 నుంచి నిర్వహించనున్న ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి శంకర్ నాయక్ తెలిపారు. గురువారం వికారాబాద్ జిల్లా ఇంటర్ బోర్డు నోడల్ అధికారి కార్యాలయంలో ఇంటర్ పరీక్షలపై సమావేశం నిర్వహించారు.

February 20, 2026 / 07:20 AM IST

రాష్ట్రస్థాయి పోటీలలో సత్తా చాటిన దివ్యాంగ విద్యార్థులు

NGKL: హైదరాబాదులో నిర్వహించిన రాష్ట్రస్థాయి దివ్యాంగుల విద్యార్థుల క్రీడలలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. క్రీడలలో పాల్గొని సత్తా చాటిన విద్యార్థులను జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం సాయంత్రం అభినందించారు. జిల్లాకు చెందిన తులసీదర్, నాని, విద్యార్థులు క్రీడలలో సత్తా చాటి జిల్లాకు పేరు తేవడం గర్వకారణమని అన్నారు.

February 20, 2026 / 07:20 AM IST

‘కన్నాయిగూడెంలో చెక్కుల పంపిణీ’

MLG: కన్నాయిగూడెం రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో ములుగు మార్కెట్ కమిటీ ఛైర్మన్ రేగా కళ్యాణి ముఖ్య అతిథిగా పాల్గొని కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మండల తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. వివిధ గ్రామాల మహిళలు చెక్కులు అందుకున్నారు.

February 20, 2026 / 07:19 AM IST

నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు

SRD: జిల్లాలో నేటి నుంచి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించాలని డీఈవో వెంకటేశ్వర్లు ఆదేశించారు. 20, 23 తేదీల్లో ప్రాథమిక స్థాయి, 24, 25 తేదీల్లో ప్రాథమికోన్నత స్థాయి ఉపాధ్యాయులకు ఈ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఏర్పాట్లు పూర్తి చేయాలని కాంప్లెక్స్ హెచ్ఎంలు, ఏంఈవోలకు సూచించారు.

February 20, 2026 / 07:19 AM IST

60% వరకు రాయితీతో బైక్‌లు

HYD: PM మత్స్య సంపద యోజన కింద HYD జిల్లాలో అర్హతగల మత్స్యకారులకు 16 బైక్‌లు (ఐస్ బాక్స్) మంజూరు చేసినట్లు జిల్లా మత్స్యశాఖాధికారి రజిని తెలిపారు. ఒక్క యూనిట్ విలువ రూ. 75,000 అని స్పష్టంచేశారు. జనరల్, SC/STలకు 40% (రూ.30వేలు), మహిళలకు 60% (రూ.45వేలు) రాయితీ ఉంటుంది. చేపల అమ్మకంలో అనుభవం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరి అన్నారు.

February 20, 2026 / 07:19 AM IST

‘ఆటల్లో గెలుపు ఓటములు సహజం’

SRCL: ఆటల్లో గెలుపు ఓటములు సహజం అని, గెలుపోటములను సమానంగా తీసుకోవాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. వేములవాడలో జరుగుతున్న 8వ తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల ముగింపు సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫుట్ బాల్ ఆటగాడు మెస్సిని హైదరాబాద్ తీసుకువచ్చి స్వయాన ఫుట్ బాల్ ఆడి తనకు క్రీడల పట్ల ఉన్న మక్కువను చాటారని తెలిపారు.

February 20, 2026 / 07:18 AM IST

నేడు ఏఐ సమ్మిట్‌కు రేవంత్, శ్రీధర్ బాబు

TG: ఢిల్లీ వేదికగా జరుగుతున్న ఏఐ సమ్మిట్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు హాజరుకానున్నారు. ఉదయం 8:30 గంటలకు స్వీడన్ వ్యాపార ప్రతినిధులతో మంత్రి శ్రీధర్ బాబు, స్పెషల్ సీఎస్ భేటీ కానున్నారు. అనంతరం వెస్ట్ వింగ్‌లో శ్రీధర్ బాబు కీలక ఉపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం 12:30 గంటలకు రేవంత్ ప్రసంగించనున్నారు.

February 20, 2026 / 07:17 AM IST

‘సీసీ రోడ్లు నిర్మించాలి’

ASR: జీకేవీధి మండలంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మించాలని టీడీపీ మండల అధ్యక్షుడు పొత్తూరు కొండలరావు కోరారు. గురువారం పలువురు కూటమి నేతలతో కలిసి ఎంపీడీవో రమణబాబును కలిసి వినతిపత్రం అందజేశారు. మండలంలో పలు గ్రామాల్లో సీసీ రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. కూటమి గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని, అధికారులు సహకరించాలని కోరారు.

February 20, 2026 / 07:17 AM IST

ముగ్గురిపై బైండోవర్‌పై కేసులు నమోదు

ELR: చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన ముగ్గురు పాత నాటు సారా కేసుల్లో ముద్దాయిలను గురువారం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద హాజరు పరిచారు. ఈ సందర్భంగా వారిపై మెజిస్ట్రేట్ బైండోవర్ కేసుల నమోదు చేయడం జరిగిందని అన్నారు. అలాగే బైండోవర్ విధించబడిన వారు సత్ప్రవర్తనతో ఉండాలని సూచించారు.

February 20, 2026 / 07:16 AM IST